సర్కారుపై విపక్షాల సవారీ


- రాజధాని కౌలు చెల్లింపును పట్టించుకోని జగన్ సర్కార్
- టిడిపి, బిజెపి ఆందోళనతో దిగిరాక తప్పని వైనం
- గతంలో సీఎంకే లేఖ రాసిన బిజెపి చీఫ్ కన్నా
- విమర్శనాస్ర్తాలు సంధించిన టిడిపి
- రైతులకు రెండు పార్టీల దన్ను
- 187కోట్ల చెల్లింపు ఉత్తర్వులిచ్చిన సర్కార్
- వ్యూహం లేక దెబ్బతిన్నామంటున్న వైసీపీ నేతలు 
- ఇది విపక్షాల తొలి విజయం
సీఎం జగన్ ఎవరి మాట వినరు. ఎవరి ఒత్తిళ్లకు లొంగే నేత కాదు. తాను అనుకున్నదే చేస్తారు. ఇదీ ఇప్పటివరకూ జనంలో ఉన్న ఒక అభిప్రాయం. కానీ.. రాజకీయాల్లో పంతాలు, పట్టింపులు ప్రజాగ్రహం ముందు ఎక్కువ కాలం కొనసాగవు. వాటని సరిదిద్దుకోవడం అనివార్యం. అది ఏ పాలకులకులకైనా తప్పదు. అమరావతి భవితవ్యం అగ మ్యగోచరంగా మారిన నేపథ్యంలో రాజధానికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపు సందేహంగా మారిన వైనాన్ని ప్రతిపక్ష టిడిపి, బిజెపి తమకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధించాయి. సర్కారు కూడా రైతుల ఆందోళనకు దిగి వచ్చి, కౌలు చెల్లింపు ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం అభినందనీయం.  నవ్యాంధ్ర రాజధాని కోసం స్వచ్ఛందంగా 34 వేల ఎకరాల భూములిచ్చిన రైతులు దేశంలోనే చరిత్ర సృష్టించారు. నాటి సీఎం చంద్రబాబు దేశంలోనే తొలిసారిగా ల్యాండ్‌పూలింగ్ విధానాన్ని అమలుచేసిన తీరును మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ర్టాలు అబ్బురపడి అధ్యయనం కూడా చేశాయి. అయితే, ఎక్కడైతే రైతులు రాజధాని కోసం భూములిచ్చారో, ఆ నియోజవర్గాల్లో టిడిపి ఓడిపోయింది. అది వేరే విషయం.  భూములిచ్చిన రైతులకు ప్రతిగా ఏటా కౌలు చెల్లించేందుకు బాబు సర్కారు నిర్ణయించింది. అయితే, ఎన్నికల్లో టిడిపి ఓడిన తర్వాత రాజధాని, అమరావతి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకూ అమరావతి, రాజధాని నిర్మాణంపై సర్కారు వైఖరేమిటన్నదీ అధికారికంగా స్పష్టం కాలేదు. దానికితోడు మంత్రి బొత్స పొంతన లేని వ్యాఖ్యతో రైతు గందరగోళంలో పడ్డాడు.
దానితో ఆగ్రహించిన రైతు రోడ్డెక్కగా, వారికి టిడిపి, బిజెపి బాసటగా నిలిచాయి. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, బిజెపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ వద్దకు రాజధాని రైతులు వచ్చి, తమ బాధలు వెళ్లబోసుకున్నారు. దానితో బిజెపి ఒక అడుగు ముందుకేసి.. కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి తదితర బిజెపి నేతలు అక్కడికి వెళ్లి వారి గళంతో జతకలిపారు. రాజధానిని తరలిస్తే సహించేది లేదని, రైతులకు కౌలు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బొత్సతో సీఎం మాట్లాడిస్తున్నారా? అని ప్రశ్నించారు. దానికంటే చాలారోజుల ముందే బిజెపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ.. రైతులకు కౌలు చెల్లించాలని సీఎం జగన్‌కు లేఖ రాశారు. బొత్స వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. ఒక్క అంశంపైనే టిడిపి-బిజెపి వేర్వేరుగా అయినా సమరశంఖం పూరించడం, రైతులు ఆ రెండు పార్టీలను ఆశ్రయించం, అందులో వైసీపీ మద్దతుదారులయిన రైతులు కూడా ఉండటంతో సర్కారు ఆత్మరక్షణ లో పడింది.  దానితో.. 187.40 కోట్లు విడుదల చేయాల్సి వచ్చింది. ఇది భూములిచ్చిన రైతుల్లో ఆందోళన తగ్గించగా.. అదే సమయంలో జగన్ తొలిసారి ఒక మెట్టు దిగేందుకు కారణమయింది. దీనిపై బిజెపి నేతల్లో సమరోత్సాహం కనిపిస్తోంది. కౌలు చెల్లింపు కోసం తాము లేఖ రాయడంతోపాటు.. రైతు సభ నిర్వహించటం ద్వారా సర్కారుపై ఒత్తిడి పెంచినందుకే, జగన్ సర్కారు దిగివచ్చిందని బిజెపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.  కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ప్రజా సమస్యలకు సంబంధించి సాధించిన తొలి విజయంగా బిజెపి నేతలు చెబుతున్నారు. ఇది తమ పార్టీలో నైతిక స్ధైర్యం పెంచిందని, ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో తమ వైఖరి ఇలాగే ఉంటుందని బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నారు.  అటు టిడిపిలో కూడా ఈ అంశం హుషారునిచ్చినట్లు కనిపిస్తోంది. తమను నమ్మి భూములిచ్చిన రైతుల కోసం, తాము చేసిన పోరాటం వృధా కాలేదని టిడిపి నేతలు చెబుతున్నారు. తాము రాజధాని అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం వల్లే జగన్ సర్కారు దిగివచ్చిందంటున్నారు. అటు వైసీపీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సున్నితమైన ఈ అంశాన్ని ఇంతకాలం సాగదీయకుండా ఉండాల్సిందన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో తమ పార్టీ-ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యహరించలేదంటున్నారు. విపక్షాలు డిమాండ్ చేయకముందే కౌలు చెల్లిస్తే ఆ క్రెడిట్ తమకే దక్కి ఉండేదంటున్నారు. కానీ.. ఇప్పుడు టిడిపి-బిజెపి నేతలు కౌలుపై రాద్ధాంతం చే సినందుకే, తాము కౌలు డబ్బు ఇచ్చామన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని విశ్లేషిస్తున్నారు. దానివల్ల ఇచ్చిన ఫలితం కూడా దక్కకుండా పోయిందన్న వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.  ఏదేమైనా.. రాజకీయాలు, ఎత్తు పై ఎత్తులు ఎలా ఉన్నా, భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించడం అభినందనీయమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాకపోతే ఈ మొత్తం వ్యవహారంలో బిజెపికి ఒక తొలి విజయం లభించగా, టిడిపి పోరాటం పదునెక్కినట్లయింది.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image