అంతిమతీర్పు- అమరావతి. 25.8.2019
ఆధార్ మరియు కైవేసీ అప్డేషన్పై ప్రకటన
ఆధార్ మరియు కేవైసీ నమోదుపై ప్రజలు ఆందోళనకు గురైన ఘటనలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చాయి.
ఆధార్ అప్డేట్కోసం ప్రజలెవ్వరూ ఆందోళన, ఆదుర్దా పడాల్సిన అవసరంలేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నిదానంగా వాటిని అప్డేట్ చేయించుకోవచ్చు ఎటువంటి గడువు లేదు.
స్కూలు పిల్లల ఆధార్ బయోమెట్రిక్ తాజా వివరాల నమోదుకు ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ సేవ కేంద్రాలు, పోస్టాఫీసుల వద్దకు వెళ్ళనవసరం లేదు.
రానున్న రోజుల్లో స్కూలు పిల్లలు చదువుతున్న పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లకు ప్రభుత్వమే ప్రత్యేక బృందాలను పంపిస్తుంది. అక్కడే ఆధార్ వివరాలు అప్డేట్ చేయించుకోవచ్చు.
e-కేవైసీ అప్డేట్ చేయనంత మాత్రాన రేషప్ సరుకులను తిరస్కరించడం అంటూ ఉండదు. ఎక్కడైతే రేషన్ తీసుకుంటున్నారో అక్కడ మాత్రమే e-కేవైసి చేసుకోవలెను. e-కేవైసి కొరకు ఆధార్ కేంద్రాలు, బ్యాంకులు, మీ సేవ కేంద్రాల వద్దకు వెళ్ళ కూడదు. ఇదివరకు రేషన్ దుకాణం వద్ద కేవైసి చేయించుకొని ఉంటే మరల చేయించవలసిన అవసరం లేదు.
ప్రజలు ఆందోళనకు గురికావొద్దని, ఆధార్ కేంద్రాలు వద్ద, మీ సేవ కేంద్రాల వద్ద, పోస్టాఫీసుల వద్ద పడిగాపులు పడొద్దని విజ్ఞప్తి.
అధికారులు, వాలంటీర్లు, ఉద్యోగులు, మీడియా సంస్థలు ఈ అంశాన్ని ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి.
– కోన శశిధర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి