ఆక్వా అక్వేరియా - 2019 ను ప్రారంభించిన వెంకయ్య నాయుడు

 



హైదరాబాద్, ఆగస్టు 30, 2019


 


ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు ఈ రోజు సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్ధ (ఎంపిఇడిఎ) ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఏర్పాటైన ఆక్వా ఆక్వేరియా - 2019 ప్రదర్శనను ఆయన ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ, సముద్ర ఉత్పత్తుల రంగంలో ప్రపంచంలోనే రెండో స్ధానంలో భారత్ ప్రస్తుతం ఉందని, మొదటి స్దానానికి చేరడానికి‌ కృషి జరగాలని ఈ సందర్భంగా అన్నారు.



ఆక్వారంగంలో ఉత్పాదక సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ప్రపంచంలో ఆక్వా ఉత్పత్తుల‌లో మొదటి స్దానానికి చేరేందుకు కృషి జరగాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న జల వనరులను కేవలం 40 శాతమే ఆక్వా కల్చర్ కు వినియోగించుకుంటున్నామని చెబుతూ, ఆక్వా ఉత్పాదకతను పెంచేందుకు కూడా ఎంపిఇడిఎ లాంటి సంస్ధలు, ప్రభుత్వ సంస్దలు, పరిశోధనా సంస్దలు కృషి చేయాలని సూచించారు. మెరుగైన ఫిషరీస్ మేనేజ్ మెంట్ పద్దతులను రూపొందించుకుని, ఖచ్చితమైన అమలు కోసం కృషి జరగాలని, వాతావరణ మార్పుల ను దృష్టిలో ఉంచుకోవాలని కూడా పేర్కొన్నారు. క్షేత్ర స్ధాయిలో ఆక్వా రైతుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని, వారికి లాభాలలో తగిన వాటా ఉండేలా విధానాల రూపకల్పన జరగాలని సూచించారు.



దేశంలో ఆహార సమృద్ది ఉన్నప్పటికీ, ప్రోటీన్ సహిత పోషకాహారంలో సముద్ర ఉత్పత్తులను మించిన సరైన అహారం‌ మరొకటి లేదని అన్నారు. సాంప్రదాయ ఆహార పద్దతులే సరైనవని చెబుతూ, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నిన్న ప్రారంభించిన 'ఫిట్ ఇండియా' కార్యక్రమం ఉద్యమంగా మారాలని ఉప రాష్ట్రపతి పిలుపునిచ్చారు. భౌతికంగా ఫిట్ గా ఉన్నపుడే మానసికంగా దృఢంగా ఉంటామని ఆయన‌ పేర్కొన్నారు. ఫిట్ నెస్, యోగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార అలవాట్లను పునః సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతూ, ప్రోటీన్లతో కూడిన పోషకాహారం పోషకాల లోపాన్ని నివారిస్తుందని పేర్కొన్నారు.


 


తెలంగాణ ప్రభుత్వం పశు సంవర్ధక రంగ అభివృద్దికి పలు చర్యలు చేపట్టడాన్ని ఉప రాష్ట్రపతి అభినందించారు. అక్వారంగంలో జరిగే పరిశోధనలు ఆ రంగం రైతులకు ఉపయోగపడాలని ఉప రాష్ట్రపతి ఉద్భోదించారు.


 


తెలంగాణా మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రినివాస్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మత్స్య రంగ అభివృద్దికి పలు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ అభివృద్ది పథకం కింద మత్స్యకారులకు 70-90 శాతం రాయితీతో పరికరాలు సమకూరుస్తున్నట్లు తెలిపారు. 'ప్రధాన మంత్రి సురక్ష యోజన' కింద మాత్స్యకారులకు లబ్ది చేకూరుస్తున్నట్లు తెలిపారు. గత మూడేళ్ళలో 128 కోట్ల సీడ్ పంపిణీ అయిందని, 4 కోట్ల పైగా రొయ్యల సీడ్ ను జలాశయాల్లో వదిలినట్లు, దీనివల్ల రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ది ఊపందుకొందని అన్నారు. ఎంపిఇడిఎ సాంకేతిక సహాకారం రాష్ట్రానికి అందించాలని కోరారు. తొమ్మిది ప్రాంతాలలొ ప్రయోగాత్మకంగా చేపట్టిన రొయ్యల పెంపకం విజయవంతం కావటంతో ఈ ఏడాది మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో రాష్ట్రం‌ నుంచి ఆక్వా ఎగుమతుల వృద్దికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియచేశారు.


 


అంతకు ముందు, ఆంద్ర ప్రదేశ్ మంత్రి మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ. సువిశాల సముద్రతీరం ఉన్న ఆంధ్ర ప్రదేశ్ నుంచే ఆక్వారంగంలో 60 శాతం విదేశీ మారకం వస్తోందని అన్నారు. 14.5 లక్షల మంది రాష్ట్రంలో ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారని, అందుకు తగిన రీతిలో ఈ రంగం అభివృద్దికి చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రస్తుతం ఈ రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటోందని, ఆకారణంగా డీజిల్ రాయితీ ని పెంచడం, నాణ్యమైన సీడ్ ను ఇచ్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అక్వా రైతుల పట్టుదలే రాష్ట్రంలో అభివృద్దికి కారణమని అన్నారు. హ్యాచరీస్ కు సంబంధించి నాణ్యమైన సీడ్ అందించేందుకు ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ఎంపిఇడిఎ సహకరించాలని కోరారు. వైరస్ వ్యాప్తి నివారణకు పాలిమర్ కిట్స్ పంపిణీ లో ప్రైవేట్ సంస్ధలను కూడా అనుమతించాలని సూచించారు. మెరైన్ రంగంలో మార్పులు చేసి ఆదునిక పరిజ్ఞానాన్ని మత్స్యకారులకు అందుబాటులోకి తేవాలని ఎంపిఇడిఎ కు సూచించారు.


 


ఎంపిఇడిఎ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆక్వారంగ అభివృద్దికోసం ప్రభుత్వం, ప్రైవేటురంగం అమలు చేస్తున్న చర్యలను వివరించారు.


 


ఈ సందర్భంగా ఆక్వా రంగంలో విశేష కృషి చెసిన పది మంది ఆక్వా రైతులకు ఉప రాష్ట్రపతి పురస్కారాలు అందజేశారు.


 


రాజ్య సభ సభ్యులు బండ ప్రకాశ్, చేవెళ్ళ లోక్ సభ సభ్యులు రంజిత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image