*అమరావతి*
*పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్సు*
*చంద్రబాబు, తెలుగుదేశం అధినేత*
ఏ ప్రభుత్వమూ అతి తక్కువ కాలంలో ఇంత అప్రతిష్ట పాలు కాలేదు
కావాలని మనపై బురదాచల్లాలని చూసి ఆ బురద జగనే పూసుకుంటున్నాడు
పీపీఏ ల పై హైకోర్టు తీర్పు, కేంద్రమంత్రి లేఖలే దీనికి ఉదాహరణలు
*పోలవరం ద్వారా దోపిడీకి శ్రీకారం చుట్టారు*
*పోలవరం 750కోట్లు తగ్గించామని చెప్పుకుని 7500కోట్లు నష్టం చేకూర్చారు*
*ఎలక్ట్రిక్ బస్సుల క్విడ్ ప్రోకో లో భాగంగానే..., పొలవరంకి గతంలో ఎక్కువ ఎక్కువ కోట్ చేసిన సంస్థ ఇప్పుడు తక్కువ కోట్ చేసింది*
*మెగా కు ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేదానికి నిబంధనలు ఒప్పుకోవని సురేంద్ర బాబు అడ్డుపడితే ఆయన్ని తప్పించారు*
ప్రజల్ని మభ్యపెట్టి దోచుకోటానికి శ్రీకారం చుడుతున్నారు
వరద తగ్గినా బోటు తీసే ప్రయత్నం చేయటం లేదు
ప్రయివేటు సంస్థ ముందుకొచ్చి తీస్తామన్నా వారికి అనుమతివ్వటం లేదు
ఇసుక పరిస్థితి దారుణంగా ఉంది
ఇసుక కొరత వల్ల 20లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వివాదలమయం చేస్తున్నారు
అన్నింటిపైనా గట్టిగా పోరాడదాం