గుంటూరు సెప్టెంబర్ 22: శాసన మండలి సభ్యులు శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించ బడుచున్న మహాకవి జాషువా జయంతి వారోత్సవాలు లో బాగంగా ఈ రోజు 22.09.2019 సాయంత్రం 6.00 గంటలకు గుంటూరు పట్టణంలో బృందావన్ గార్డెన్స్ నందలి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో అన్నమయ్య కళా వేదిక నందు " జాషువా పద్యానికి పట్టాభిషేకం" కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో ప్రముఖ అవధాని శ్రీ గరికపాటి నరసింహారావు ముఖ్యఅతిథిగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం మరియు మాజీ శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ఆత్మీయ అతిథులు గా పాల్గొంటారు.
మహాకవి జాషువా జయంతి వారోత్సవాలు