విజయవాడ
27-9-19
-గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని కలిసిన ఉపాధిహామీ పథకం కౌన్సిల్ సభ్యులు
-ఉపాధిహామీ పథకం చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని ఫిర్యాదు
-ఏపీ సర్కారు అనాలోచిత చర్యల వలన దేశంలో నెంబర్ 1 గా ఉన్న రాష్ట్రం చివరి స్థానానికి వెళ్తోందని ఆవేదన
-ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేస్తుందని గవర్నర్ కి పిర్యాదు చేసిన ఉపాధిహామీ కౌన్సిల్ మెంబర్లు
-ఉద్యోగభద్రత కరువై రోడ్డున పడిన ఉద్యోగులు
-ఎక్కడికక్కడే నిలిచిపోయిన ఉపాధి పనులు
-గవర్నర్ స్పందించి చర్యలు తీసుకోవాలిని కోరిన ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యులు ఈ రోజు మధ్యాహ్నం రాజభవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని కలిసారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు లో 2019 మొదటి వరకూ ఏపీ దేశంలోనే ప్రథమస్థానంలో ఉండేదని, నేడు అథమస్థానానికి పడిపోయిందని ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యులు గవర్నర్ ద్రుష్టి కి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తరువాత, ఉపాధి పనులు పూర్తిగా మందగించాయని,కేంద్ర ఉపాధిహామీ పథకం చట్టం నిబంధనలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించిందని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని గవర్నర్ కి ఫిర్యాదు చేసారు.రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు పనుల కోసం మెటీరియల్ కాంపోనెంట్ సరఫరాదారులకు బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహించారని,మూడు దశల్లో రాష్ట్రానికి రావాల్సిన రూ. 2230 కోట్లకు గానూ కేంద్ర ప్రభుత్వం రూ. 1969 కోట్లు మంజూరు చేసినా, పెండింగ్ బిల్లులు చెల్లించలేదు అని కౌన్సిల్ సభ్యులు గవర్నర్ కి తెలిపారు. ప్రభుత్వ వెబ్సైట్లో లభించిన సమాచారం ప్రకారం, 31 మార్చి 2019 నాటికి మెటీరియల్ కాంపోనెంట్కు పెండింగ్లో ఉన్నది రూ. 1610 కోట్లు, 2019 ఏప్రిల్ 1 నుండి 2019 సెప్టెంబర్ 4 వరకు మరో రూ. 691 కోట్ల మేరకు ఉపాధిహామీ పథకం నిధులను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం మెటీరియల్ కాంపోనెంట్ బిల్లులు చెల్లించేందుకు సుముఖత చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు అనుసంధానం కింద జరుగుతున్న పనులను నిలిపేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో అటవీశాఖ కన్వర్జెన్స్ పనులు నిలిపేయడం అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది అని గవర్నర్ కి వివరించారు.మరోవైపు కేంద్రం నిర్దేశించిన కార్యక్రమానికి నిధులు విడుదల చేసినప్పుడు...ఆ నిధుల స్వీకరణ తేదీ నుంచి మూడు రోజుల్లోగా రాష్ట్ర వాటాని ఉపాధి హామీ నిధికి జమ చేయాలి, అలా చేయని పక్షంలో తదుపరి నిధుల విడుదలను కేంద్రం నిలిపేస్తుందని స్పష్టమైన నిబంధనలున్నా ఏపీ సర్కారు పట్టించుకోవడంలేదని గవర్నర్ కి తెలిపారు.దీంతోపాటు రాష్ట్ర వాటా చెల్లింపు ఆలస్య కాలానికి 12 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది అదనపు భారం అవుతుంది అని గవర్నర్ కి వివరించారు కౌన్సిల్ సభ్యులు.
మరోవైపు ఉపాధి హామీ చట్టం నిబంధనలకు విరుద్ధంగా 25 శాతం లోపు అయిన పనులన్నింటినీ నిలిపి వేయాలని ఏపీ సర్కారు ఇచ్చిన ఆదేశాలు పంచాయతీల ప్రగతి, ప్రజల ఉపాధిపై నీలినీడలు కమ్ముకునే లా చేసాయని వివరించారు. కూలీ చెల్లింపులు, మెటీరియల్ కాంపోనెంట్ కింద జరిగే ఈ పనులతో సామాజిక, గ్రామ అవసరాలు తీరనున్నాయని, అటువంటి పనులను ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలతో ఆగిపోయాయని గవర్నర్ కి వివరించారు. పల్లెల్లో రాజకీయ ఆధిపత్యం ఆశించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఉపాధిహామీ క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది, సహాయకులు గత కొద్ది నెలలుగా తీవ్ర అభద్రతా భావంతో రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నా..ప్రభుత్వం స్పదించడంలేదని గవర్నర్ కి వివరించారు . ఉపాధి లక్ష్యాలను సాధించడంలో ఎంతో శ్రమించిన క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది, సహాయకులపై ప్రభుత్వం కక్ష సాధించే ధోరణితో వ్యవహరిస్తోందని గవర్నర్ కి ఫిర్యాదు చేసారు కౌన్సిల్ సభ్యులు. గ్రామవలంటీర్ల నియామకంతో తమ ఉద్యోగాలుంటాయో ఊడుతాయో అనే అయోమయంలో ఉన్నారని..వీరి ఉద్యోగ భద్రతకు భరోసా నివ్వాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ నెల నుంచి వీరికి గౌరవవేతనాలు కూడా అందలేదని, తక్షణం వీరి బకాయి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి అని కౌన్సిల్ సభ్యులు గవర్నర్ కి కోరారు
2014 నుంచి 2019 ఆరంభం వరకూ ఉపాధిహామీ సాధించిన ప్రగతి అంతా నాలుగు నెలల్లో అథోగతికి చేరిందని గవర్నర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కౌన్సిల్ సభ్యులు. 2014 నుంచి 2019 వరకూ 26000 కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్డు వేశారని, 6 వేల అంగన్ వాడీ భవనాలు నిర్మించారని, 2200 గ్రామపంచాయతీ భవనాలు నిర్మించారని , 12,000 కిలోమీటర్ల రోడ్లు వేసి పల్లెలకు రహదారి సౌకర్యం కల్పించారని, 10 వేల సంపద కేంద్రాలు నిర్మించారని, 7,00,000 పంట కుంటలు తవ్విదేశంలోనే నెంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు . ఉపాధి నిధులను 24 ప్రభుత్వ శాఖలకు అనుసంధానం చేస్తూ సాధించిన విజయాలు దేశంలోనే ఏపీని మొదటిస్థానంలో నిలిపాయన్నారు. ఉపాధి పనుల కల్పన, లక్ష్యాలు చేరుకోవడం, మెటీరియల్ కాంపోనెంట్ చెల్లింపు, వందల అవార్డులు, రివార్డులు అందుకున్నఏపీ నేడు ఉపాధిలో దయనీయ స్థితికి చేరిందని గవర్నర్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు కౌన్సిల్ మెంబర్లు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక చర్యలతో లక్షలాది మంది ఉపాధి కూలీలు, వేలాది మంది ఉపాది సిబ్బంది తమ కుటుంబాలతో సహా నడిరోడ్డున పడ్డారని , రాష్ట్ర ప్రథమపౌరుడిగా గవర్నర్ జోక్యం చేసుకుని ఏపీలో రాజకీయ కారణాలతో నిర్వీర్యమవుతున్న ఉపాధి హామీ పథకానికి ఊపిర పోయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉపాధి చట్టాలకు తూట్లు పొడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ని కోరారు . ఉద్దేశపూర్వకంగా, కక్షతో నిలిపేసిన బిల్లు చెల్లింపులను వెంటనే చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి పెండింగ్ జీతాలు చెల్లించేలా ..అలాగే వారి ఉద్యోగ భద్రతకు హామీ ఇచ్చేలా చూడాలని గవర్నర్ ని కోరారు. మెటీరియల్ కాంపోనెంట్ రాష్ట్ర వాటా వెంటనే జమచేయాల్సిందిగా గవర్నర్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
గవర్నర్ కి కలిసిన ఆంధ్రప్రదేశ్ ఉపాధిహామీ పథకం కౌన్సిల్ సభ్యులు...
వీరంకి వెంకట గురుమూర్తి(కృష్ణ జిల్లా)
పోతుగంటి పేరయ్య(కడప జిల్లా)
మొవ్వ లక్ష్మి సుభాషిణి(గుంటూరు జిల్లా)
సత్రం రామకృష్ణుడు(కర్నూలు)
భవాని (నెల్లూరు)
వినోద్ రాజు (విశాఖ)