అమరావతి
27.9.2019
రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి శ్రీ కురసాల కన్నబాబు ప్రెస్మీట్
-గోదావరిలో బోటు ప్రమాద ఘటనలో గాలింపు కొనసాగుతోంది.
- ఈ ప్రమాదంలో 26 మందిని రక్షించిన స్థానికులకు నగదు ప్రోత్సాహాకాలు
- ప్రాణాలకు తెగించి ప్రయాణీకులను కచ్చులూరు గ్రామస్తులు కాపాడారు.
- వారి సాహసాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు.
- ఒక్కొక్కరికి ఇరవై అయిదు వేల రూపాయలు ఇస్తాం.
- అధికారుల నుంచి వారి వివరాలను పంపించాలని కూడా కలెక్టర్ ను కోరాం.
- వారిని గుర్తించడం ఈ ప్రభుత్వ బాధ్యత.
- త్వరలోనే వారికి ఈ ప్రోత్సాహకాలను అందచేస్తాం.
-ఎవరైనా సరే ముగినిపోయిన బోటును తీస్తామని ముందుకువస్తే..
- నిపుణులతో చర్చించి... వారికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది
- బోటును బయటకు తీసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో వుంది.
- దీనిపై రాజకీయాల కోసం కొందరు విమర్శలు చేస్తున్నారు.
- చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు కూడా అసంబద్దంగా మాట్లాడుతున్నారు.
- దేశంలో ఇంత లోతులో.. ప్రవాహంలో మునిగివున్న లాంచీని బయటకు తీయలేదు.
- ఎవరైనా మేం తీయగలుగుతామని చెబితే...
-వారికి పూర్తి సహకారంను ప్రభుత్వం అందిస్తుంది.
- స్థానికంగా గాలింపు చర్యలు కొనసాగుతూనే వున్నాయి.
- వందలాది మంది ప్రభుత్వ సిబ్బంది పనిచేస్తూనే వున్నారు.
- ప్రతికూల పరిస్థితుల్లో కూడా పనిచేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాం.
- ఇంకా ఆచూకీ లభ్యంకాని వ్యక్తులకు బంధువులు డెత్ సర్టిఫికేట్ కోరుతున్నారు.
- దీనిని సాంకేతికంగా ఏలా చేయాలో పరిశీలిస్తున్నాం.
- వారి విజ్ఞప్తికి అనుకూలంగా చర్యలు తీసుకుంటాం.
- బాధితులకు ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడింది.
- వారికి రాజమండ్రిలో వసతులు, సమాచారం అందించాం.
- ఇలాంటి సంఘటనలు పునారవృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
- బోటు ప్రమాదాల నేపధ్యంలో 2018లో ఒక జీఓ ఇచ్చారు.
- నీటిమీద నడిచే వాహనాల నియంత్రణపై ఇందులో నిబంధనలు వున్నాయి.
- ఏ డిపార్ట్ మెంట్ ఏం చేయాలో మాత్రమే దీనిలో చెప్పారు.
- దీనిని ఎవరు సమన్వయం చేయాలో చెప్పలేదు.
- ఫలితంగా దీనిని అమలుచేసే విషయంలో ఇబ్బంది ఎదురయ్యింది.
- పడవ సామర్ధ్యంను కాకినాడ పోర్ట్ అధికారి నిర్ధారిస్తారు.
- రివర్ కన్సర్వేటర్ ద్వారా రూట్ పర్మీషన్ ఇవ్వాలని జిఓలో సూచించారు.
- మొత్తంగా పడవ ప్రయాణీకుల భద్రతను ఎలా సమన్వయం చేయాలో స్పష్టత లేదు.
- తాజా ప్రమాద ఘటన తరువాత ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి కమిటీ వేశారు.
- ఈ కమిటీ నివేదిక వచ్చిన తరువాత దానిని అధ్యయనం చేయాలని సిఎం సూచించారు.
- కృష్ణా, గోదావరి నదుల్లో బోటు ప్రయాణంపై కంట్రోల్ రూం లను ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు.
- ఈ పడవ ప్రమాదంలో పడవ నడిపిన డ్రైవర్ల బాడీలు దొరకలేదు.
- ఆరోజు ప్రమాద ఘటనాస్థలం గోదావరిలో అత్యధికంగా లోతు వుండే ప్రాంతం
- పక్కనుంచి వెళ్లి... ముందుకు వెళ్లిన తరువాత బోటు డైవర్ట్ కావాలి.
- ఈ ప్రాంతంలో సుడిగుండాలు తీవ్రంగా వున్నాయి.
- కనురెప్పపాటులో ప్రమాదం జరిగిపోయిందని బయటపడిన వారు చెప్పారు.
- ఇటువంటివి ఎప్పుడు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనకు వుంది.
- దేవీపట్నం పోలీస్స్టేషన్ వద్ద పోలీసులు సదరు బోటును తనిఖీ చేశారు.
- బోటులో మద్యం లేదని, లైఫ్ జాకెట్లు ధరించారని పోలీసులు నిర్ధారించారు.
- పరిమితికి అనుగుణంగానే ఆనాడు బోటులో ప్రయాణీకులు ఎక్కారు.
- ట్రావెల్ ఏజెన్సీ, బోటు నిర్వాహకులు, బాధితుల బంధువుల సమాచారం, ప్రమాదానికి ముందు బయటపడిన వారి వద్ద వున్న ఫోటోలను కూడా పరిశీలించి ప్రయాణీకులను గుర్తించాం.
- మొత్తం 77 మంది బోటులో వున్నట్లు నిర్ధారించాం.
- ముఖ్యమంత్రి గంటన్నర పాటు రాజమండ్రిలోసమీక్ష జరిపారు.
- పడవ ప్రమాదాలు జరగకుండా మ్యానువల్ రూపొందించాలని ఆదేశించారు.
- నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు.
- జిపిఎస్ సిస్టమ్, సిసి కెమేరాలు, ఆధునిక నావిగేషన్ పరికరాలు వుండాలని సూచించారు.