నీతి ఆయోగ్‌ బృందంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌.జగన్, అధికారుల భేటీ

13–09–2019
అమరావతి


అమరావతి: సచివాలయంలో నీతి ఆయోగ్‌ బృందంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్, అధికారుల భేటీ
నీతిఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌కు ప్రజంటేషన్‌ ఇచ్చిన అధికారులు
రంగాల వారీగా రాష్ట్రంలో పరిస్థితులను వివరించిన అధికారులు


*చీఫ్‌సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం*


రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధిని రెండింటినీ ముందుకు తీసుకెళ్తున్నాం: చీఫ్‌సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం
విభజన కారణంగా రాష్ట్రానికి నష్టం జరిగింది: సీఎస్‌
దాన్ని పూడ్చాలంటే నీతి ఆయోగ్‌ సహకారం అవసరం: సీఎస్‌
అది నీతిఆయోగ్‌ వల్లే సాధ్యమవుతుంది: సీఎస్‌
అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉన్న ఏపీ, విభజన కారణంగా అభివృద్ధికి దూరమైంది: సీఎస్‌
పరిశ్రమలు, సేవలు, వ్యవసాయం.. ఈరంగాలే అభివృద్ధికి చోదకాలు:
విశాఖపట్నం, విజయనగరం, కడప ఆస్పిరేషనల్‌ జిల్లాలు:
వీటితోపాటు శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలను కూడా అభివృద్ధి చేయాల్సి ఉంది:
15వ ఆర్థిక సంఘం, నీతిఆయోగ్‌లు ఉదారంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది:
సమగ్రాభివృద్ధితో మోడల్‌ స్టేట్‌ గా రాష్ట్రాన్ని తయారుచేయాలని గౌరవ ముఖ్యమంత్రిగారి  సంకల్పం: సీఎస్‌
5 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం దిశగా కేంద్రం అడుగులేస్తోంది: సీఎస్‌
రాష్ట్రానికి కూడా తగిన రీతిలో సహాయం చేస్తే ఆ లక్ష్య సాధనలో మేం కూడా భాగస్వాములం అవుతాం: సీఎస్‌
దేశం 10–11 శాతం వృద్ధిరేటు సాధించాలని అనుకున్నప్పుడు రాష్ట్రానికి సహాయం ఉండాలి: సీఎస్‌
తగిన వనరులు, నైపుణ్యం, అంకిత భావం ఉన్న అధికారులు, దృఢ నిశ్చయం ఉన్న నాయకత్వం మాకు ఉన్నాయి: సీఎస్‌ 
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలికాలంలో అనేక చర్యలు తీసుకుంది: సీఎస్‌ 
బహుముఖ ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నాం: సీఎస్‌
పరిపాలనలో వికేంద్రీకరణకు గ్రామసచివాలయాలు తీసుకొచ్చాం: సీఎస్‌
విభజనలో భాగంగా హామీ ఇచ్చిన కడప స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి: పారదర్శకతతో కూడిన విధానాలను పరిపాలనలోకి తీసుకు వచ్చాం:
గడచిన అసెంబ్లీ సమావేశాల్లో 18 చట్టాలు చేశాం: సీఎస్‌
మొదటిసారిగా జ్యుడిషియల్‌ ప్రివ్యూ చట్టాన్ని తీసుకు వచ్చాం: సీఎస్‌
టెండర్లను జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపేలా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు: సీఎస్‌
వైజాగ్‌– చెన్నై, చెన్నై – బెంగుళూరు కారిడార్లలో క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం:సీఎస్‌
పెట్టుబడులకు కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం, మీ సహకారం కావాలి:సీఎస్‌
నేపుణ్యాభివృద్ధికోసం 25 ఇంజినీరింగ్‌ కాలేజీలను ఎంపిక చేస్తున్నాం:సీఎస్‌
కాలుష్యాన్ని నివారించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం:సీఎస్‌
డీజిల్‌ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెడుతున్నాం, దీనికి సహకారం కావాలి:సీఎస్‌
నిరక్షరాస్యతను నిర్మూలించడానికి అమ్మ ఒడిని ప్రారంభిస్తున్నట్టుగా వెల్లడించిన సీఎస్‌
దీనికి మానవ వనరుల అభివృద్ధిశాఖ నుంచి తగిన సహాయం అందేలా చూడాలన్న సీఎస్‌



*రాజీవ్‌ కుమార్, నీతిఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌*


సీఎం ఢిల్లీ వచ్చినప్పుడు సుదీర్ఘంగా నాతో చర్చించారు: రాజీవ్‌ కుమార్, నీతిఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌
నవరత్నాలు కార్యక్రమాలను నాకు వివరించారు: రాజీవ్‌ కుమార్‌
సీఎం ఆలోచన, విజన్, ప్రణాళికలు చాలా బాగున్నాయి:
సీఎం వైయస్‌ జగన్‌ అంకిత భాగం, విజన్‌ నన్ను ఆకట్టుకున్నాయి:
వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే పనితీరు చూపారు:
మేం చేయదగ్గదంతా చేస్తాం, తగిన రీతిలో సహకారం అందిస్తాం:
అభివృద్ధి పథంలో రాష్ట్రం ముందు ఉండేలా తోడ్పాటును అందిస్తాం:
మానవాభివృద్ధి సూచికలను పెంచేందుకు తగిన రీతిలో సహకారం అందిస్తాం:
రాష్ట్రంలో నిరక్షరాస్యత జాతీయ సగటు కన్నా ఎక్కువ ఉంది:
రాష్ట్రానికి పారిశ్రామిక వాటా కూడా తక్కువుగా ఉంది:
బడ్జెట్‌లో సగానికిపైగా మానవవనరుల వృద్ధికోసం ఖర్చుచేస్తున్నారు:
పారిశుధ్య కార్యక్రమాలు బాగానే నిర్వహిస్తున్నారు:
సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధంపై ముందడుగు వేయాలి:
జీరోబడ్జెట్‌నేచరల్‌ ఫార్మింగ్‌కు నేను చాలా అనుకూలం, దీన్ని పోత్సహించాలి:
రాష్ట్ర రెవిన్యూలోటు కాస్త ఆందోళనకరంగా ఉంది: 
బడ్జెయేతర ఖర్చులు పెరిగినట్టు కనిపిస్తున్నాయి:
పెట్టుబడులు, పబ్లిక్‌ రుణాలపై దృష్టిపెట్టాలి:
మేం మీతో çపనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం:
గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్లనిర్మాణంపై దృష్టిపెట్టాలని కోరుతున్నాం:
పప్పు దినుసులు, నూనెగింజల సాగును దేశవ్యాప్తంగా పెంచడానికి ప్రయత్నిస్తున్నాం:
వాటికి సరైన మద్దతు ధర ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం:
మహిళల్లో రక్తహీనత రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది:
మహిళా, శిశుసంక్షేమంపై దృష్టిపెట్టాలి: 
బియ్యం, వంటనూనెల్లో ఖనిజలవణాలు, విటమిన్లు ఉండేలా చూడాలి:
దీనిపై కేంద్ర ఆహార శాఖతో కలిసి పనిచేస్తున్నాం:
తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన:
ఫుడ్‌ ప్రాససింగ్, ఆగ్రో ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టిసారించాలన్న నీతిఆయోగ్‌



*సీఎం శ్రీ వైయస్‌. జగన్‌*


నిరక్షరాస్యతను అధిగమించిడానికి బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్నాం: నీతి ఆయోగ్‌కు తెలిపిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ 
రాష్ట్రంలోని మొత్తం 44వేలకు పైగా స్కూళ్లను దశలవారీగా అభివృద్ది చేస్తున్నాం: సీఎం
మొదటి దశలో 15వేల స్కూళ్లలో 9 రకాల కనీస సదుపాయాలు కల్పిస్తున్నాం:సీఎం
వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 8 వరకూ ఇంగ్లిషు మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నాం: సీఎం
ఆపై వచ్చే సంవత్సరం 9,10 తరగతుల్లో  ఇంగ్లిషు మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నాం: సీఎం
ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులు కారణంగా చాలామంది పేదలు పిల్లలను స్కూళ్లకు పంపించలేకపోతున్నారు:
చక్కటి సౌకర్యాలతో నాణ్యమైన విద్యను ప్రభుత్వ స్కూళ్లలో అందించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం: సీఎం
పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి ఏడాదికి రూ.15వేలు ఇస్తాం, జనవరి 26న అమ్మ ఒడి పథకం అమలు: సీఎం
మొదట పేదల కడుపులు నింపితే ఆతర్వాత వాళ్లు స్కూళ్లవైపు దృష్టిపెడతారు:సీఎం
నిరక్షరాస్యతను సున్నాస్థాయికి తీసుకురావడమే లక్ష్యం: సీఎం
పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం: సీఎం
కేంద్ర మానవవనరుల అభివృద్దిశాఖ ''అమ్మ ఒడి''ని స్పాన్సర్‌ చేస్తే.. దేశానికి మోడల్‌గా నిలుస్తుందని నీతిఆయోగ్‌ను కోరిన అధికారులు


పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికీ చర్యలు : నీతిఆయోగ్‌కు వివరించిన సీఎం
ఆహారం లోపం ఒకటైతే, పారిశుధ్యం, తాగునీరు, అనారోగ్య వాతావరణం దీనికి మరో కారణం: సీఎం
వీటిని నివారించడానికి అన్ని చర్యలూ చేపడుతున్నాం: సీఎం
పరిశుభ్రమైన నీటిని ప్రతి ఇంటికీ అందించడానికి వాటర్‌గ్రిడ్‌ను తీసుకు వస్తున్నాం: సీఎం
గిరిజన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో రక్తహీనత అధికంగా ఉంది: సీఎం
అంగన్‌వాడీల కింద, మధ్యాహ్న భోజనం కింద ఇస్తున్న ఆహారం నాణ్యతను బాగా పెంచుతున్నాం:సీఎం
ఇప్పటికే పంపిణీచేస్తున్న బియ్యంలో నాణ్యత పెంచామన్న సీఎం
విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తామన్న సీఎం


ఆరోగ్యరంగంలో కూడా చాలా మార్పులు తీసుకు వస్తున్నాం:
ఆరోగ్యంపై ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు :
ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని జబ్బులను చేరుస్తున్నాం:
డిసెంబరులో ప.గో.జిల్లాలో తొలిసారిగా పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం:
డెంగీ, మలేరియా కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు వస్తున్నాం:
ప్రభుత్వ ఆస్పత్రులన్నీ జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాం:
స్కూళ్లు, ఆస్పత్రులు విషయంలో శరవేంగా ముందుకు వెళ్తున్నాం:
నాడు – నేడు కింద వీటిని అభివృద్ధి చేస్తున్నాం:
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా వీటిని తయారుచేస్తున్నాం:
ప్రజలకు వైద్యం ఖర్చులు తగ్గిస్తున్నాం: సీఎం
ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో 10 మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించాం: సీఎం
ఆక్వాకల్చర్‌లో నాణ్యమైన ఉత్పాదనలకోసం అత్యుత్తమ విధానాలను అనుసరించేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు సీఎం చెప్పారు
కొత్తగా ల్యాబ్‌లు ఏర్పాచేస్తున్నట్టు వెల్లిడించారు


వారసత్వంగా వచ్చిన కొన్ని సమస్యలతో రాష్ట్రం బాధపడుతోంది: సీఎం
గత ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ అయినప్పటికీ రూ. 2.27లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది: సీఎం
మేం అధికారంలోకి వచ్చాక బడ్జెట్‌ అంతే ఉంచి అంతర్గతంగా కొన్నిమార్పులు చేసుకున్నాం:
నాలుగు రకాలుగా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది:
రాష్ట్ర రెవిన్యూ నుంచి వచ్చే ఆదాయం ఒకటైతే, 
కేంద్ర పన్నుల నుంచి వచ్చే వాటా మరొకటి: సీఎం
ఒక విధానం ప్రకారం కేంద్ర పన్నల నుంచి వాటా వస్తుంది: సీఎం
ఇక రుణాల విషయంలో కూడా ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులు ఉన్నాయి:సీఎం
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు తగ్గకుండా చూడాలి: సీఎం


నీతి ఆయోగ్‌సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి, నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, మేకపాటి గౌతం, గుమ్మనూరు జయరాములు, చీఫ్‌ సెక్రటరీ ఎల్వీసుబ్రహ్మణ్యం, నీత్‌ ఆయోగ్‌ బృందం ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image