నీతి ఆయోగ్‌ బృందంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌.జగన్, అధికారుల భేటీ

13–09–2019
అమరావతి


అమరావతి: సచివాలయంలో నీతి ఆయోగ్‌ బృందంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్, అధికారుల భేటీ
నీతిఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌కు ప్రజంటేషన్‌ ఇచ్చిన అధికారులు
రంగాల వారీగా రాష్ట్రంలో పరిస్థితులను వివరించిన అధికారులు


*చీఫ్‌సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం*


రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధిని రెండింటినీ ముందుకు తీసుకెళ్తున్నాం: చీఫ్‌సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం
విభజన కారణంగా రాష్ట్రానికి నష్టం జరిగింది: సీఎస్‌
దాన్ని పూడ్చాలంటే నీతి ఆయోగ్‌ సహకారం అవసరం: సీఎస్‌
అది నీతిఆయోగ్‌ వల్లే సాధ్యమవుతుంది: సీఎస్‌
అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉన్న ఏపీ, విభజన కారణంగా అభివృద్ధికి దూరమైంది: సీఎస్‌
పరిశ్రమలు, సేవలు, వ్యవసాయం.. ఈరంగాలే అభివృద్ధికి చోదకాలు:
విశాఖపట్నం, విజయనగరం, కడప ఆస్పిరేషనల్‌ జిల్లాలు:
వీటితోపాటు శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలను కూడా అభివృద్ధి చేయాల్సి ఉంది:
15వ ఆర్థిక సంఘం, నీతిఆయోగ్‌లు ఉదారంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది:
సమగ్రాభివృద్ధితో మోడల్‌ స్టేట్‌ గా రాష్ట్రాన్ని తయారుచేయాలని గౌరవ ముఖ్యమంత్రిగారి  సంకల్పం: సీఎస్‌
5 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం దిశగా కేంద్రం అడుగులేస్తోంది: సీఎస్‌
రాష్ట్రానికి కూడా తగిన రీతిలో సహాయం చేస్తే ఆ లక్ష్య సాధనలో మేం కూడా భాగస్వాములం అవుతాం: సీఎస్‌
దేశం 10–11 శాతం వృద్ధిరేటు సాధించాలని అనుకున్నప్పుడు రాష్ట్రానికి సహాయం ఉండాలి: సీఎస్‌
తగిన వనరులు, నైపుణ్యం, అంకిత భావం ఉన్న అధికారులు, దృఢ నిశ్చయం ఉన్న నాయకత్వం మాకు ఉన్నాయి: సీఎస్‌ 
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలికాలంలో అనేక చర్యలు తీసుకుంది: సీఎస్‌ 
బహుముఖ ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నాం: సీఎస్‌
పరిపాలనలో వికేంద్రీకరణకు గ్రామసచివాలయాలు తీసుకొచ్చాం: సీఎస్‌
విభజనలో భాగంగా హామీ ఇచ్చిన కడప స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి: పారదర్శకతతో కూడిన విధానాలను పరిపాలనలోకి తీసుకు వచ్చాం:
గడచిన అసెంబ్లీ సమావేశాల్లో 18 చట్టాలు చేశాం: సీఎస్‌
మొదటిసారిగా జ్యుడిషియల్‌ ప్రివ్యూ చట్టాన్ని తీసుకు వచ్చాం: సీఎస్‌
టెండర్లను జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపేలా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు: సీఎస్‌
వైజాగ్‌– చెన్నై, చెన్నై – బెంగుళూరు కారిడార్లలో క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం:సీఎస్‌
పెట్టుబడులకు కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం, మీ సహకారం కావాలి:సీఎస్‌
నేపుణ్యాభివృద్ధికోసం 25 ఇంజినీరింగ్‌ కాలేజీలను ఎంపిక చేస్తున్నాం:సీఎస్‌
కాలుష్యాన్ని నివారించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం:సీఎస్‌
డీజిల్‌ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రవేశపెడుతున్నాం, దీనికి సహకారం కావాలి:సీఎస్‌
నిరక్షరాస్యతను నిర్మూలించడానికి అమ్మ ఒడిని ప్రారంభిస్తున్నట్టుగా వెల్లడించిన సీఎస్‌
దీనికి మానవ వనరుల అభివృద్ధిశాఖ నుంచి తగిన సహాయం అందేలా చూడాలన్న సీఎస్‌



*రాజీవ్‌ కుమార్, నీతిఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌*


సీఎం ఢిల్లీ వచ్చినప్పుడు సుదీర్ఘంగా నాతో చర్చించారు: రాజీవ్‌ కుమార్, నీతిఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌
నవరత్నాలు కార్యక్రమాలను నాకు వివరించారు: రాజీవ్‌ కుమార్‌
సీఎం ఆలోచన, విజన్, ప్రణాళికలు చాలా బాగున్నాయి:
సీఎం వైయస్‌ జగన్‌ అంకిత భాగం, విజన్‌ నన్ను ఆకట్టుకున్నాయి:
వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే పనితీరు చూపారు:
మేం చేయదగ్గదంతా చేస్తాం, తగిన రీతిలో సహకారం అందిస్తాం:
అభివృద్ధి పథంలో రాష్ట్రం ముందు ఉండేలా తోడ్పాటును అందిస్తాం:
మానవాభివృద్ధి సూచికలను పెంచేందుకు తగిన రీతిలో సహకారం అందిస్తాం:
రాష్ట్రంలో నిరక్షరాస్యత జాతీయ సగటు కన్నా ఎక్కువ ఉంది:
రాష్ట్రానికి పారిశ్రామిక వాటా కూడా తక్కువుగా ఉంది:
బడ్జెట్‌లో సగానికిపైగా మానవవనరుల వృద్ధికోసం ఖర్చుచేస్తున్నారు:
పారిశుధ్య కార్యక్రమాలు బాగానే నిర్వహిస్తున్నారు:
సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధంపై ముందడుగు వేయాలి:
జీరోబడ్జెట్‌నేచరల్‌ ఫార్మింగ్‌కు నేను చాలా అనుకూలం, దీన్ని పోత్సహించాలి:
రాష్ట్ర రెవిన్యూలోటు కాస్త ఆందోళనకరంగా ఉంది: 
బడ్జెయేతర ఖర్చులు పెరిగినట్టు కనిపిస్తున్నాయి:
పెట్టుబడులు, పబ్లిక్‌ రుణాలపై దృష్టిపెట్టాలి:
మేం మీతో çపనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం:
గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్లనిర్మాణంపై దృష్టిపెట్టాలని కోరుతున్నాం:
పప్పు దినుసులు, నూనెగింజల సాగును దేశవ్యాప్తంగా పెంచడానికి ప్రయత్నిస్తున్నాం:
వాటికి సరైన మద్దతు ధర ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం:
మహిళల్లో రక్తహీనత రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది:
మహిళా, శిశుసంక్షేమంపై దృష్టిపెట్టాలి: 
బియ్యం, వంటనూనెల్లో ఖనిజలవణాలు, విటమిన్లు ఉండేలా చూడాలి:
దీనిపై కేంద్ర ఆహార శాఖతో కలిసి పనిచేస్తున్నాం:
తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన:
ఫుడ్‌ ప్రాససింగ్, ఆగ్రో ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టిసారించాలన్న నీతిఆయోగ్‌



*సీఎం శ్రీ వైయస్‌. జగన్‌*


నిరక్షరాస్యతను అధిగమించిడానికి బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్నాం: నీతి ఆయోగ్‌కు తెలిపిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ 
రాష్ట్రంలోని మొత్తం 44వేలకు పైగా స్కూళ్లను దశలవారీగా అభివృద్ది చేస్తున్నాం: సీఎం
మొదటి దశలో 15వేల స్కూళ్లలో 9 రకాల కనీస సదుపాయాలు కల్పిస్తున్నాం:సీఎం
వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 8 వరకూ ఇంగ్లిషు మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నాం: సీఎం
ఆపై వచ్చే సంవత్సరం 9,10 తరగతుల్లో  ఇంగ్లిషు మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నాం: సీఎం
ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులు కారణంగా చాలామంది పేదలు పిల్లలను స్కూళ్లకు పంపించలేకపోతున్నారు:
చక్కటి సౌకర్యాలతో నాణ్యమైన విద్యను ప్రభుత్వ స్కూళ్లలో అందించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం: సీఎం
పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి ఏడాదికి రూ.15వేలు ఇస్తాం, జనవరి 26న అమ్మ ఒడి పథకం అమలు: సీఎం
మొదట పేదల కడుపులు నింపితే ఆతర్వాత వాళ్లు స్కూళ్లవైపు దృష్టిపెడతారు:సీఎం
నిరక్షరాస్యతను సున్నాస్థాయికి తీసుకురావడమే లక్ష్యం: సీఎం
పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం: సీఎం
కేంద్ర మానవవనరుల అభివృద్దిశాఖ ''అమ్మ ఒడి''ని స్పాన్సర్‌ చేస్తే.. దేశానికి మోడల్‌గా నిలుస్తుందని నీతిఆయోగ్‌ను కోరిన అధికారులు


పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికీ చర్యలు : నీతిఆయోగ్‌కు వివరించిన సీఎం
ఆహారం లోపం ఒకటైతే, పారిశుధ్యం, తాగునీరు, అనారోగ్య వాతావరణం దీనికి మరో కారణం: సీఎం
వీటిని నివారించడానికి అన్ని చర్యలూ చేపడుతున్నాం: సీఎం
పరిశుభ్రమైన నీటిని ప్రతి ఇంటికీ అందించడానికి వాటర్‌గ్రిడ్‌ను తీసుకు వస్తున్నాం: సీఎం
గిరిజన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో రక్తహీనత అధికంగా ఉంది: సీఎం
అంగన్‌వాడీల కింద, మధ్యాహ్న భోజనం కింద ఇస్తున్న ఆహారం నాణ్యతను బాగా పెంచుతున్నాం:సీఎం
ఇప్పటికే పంపిణీచేస్తున్న బియ్యంలో నాణ్యత పెంచామన్న సీఎం
విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తామన్న సీఎం


ఆరోగ్యరంగంలో కూడా చాలా మార్పులు తీసుకు వస్తున్నాం:
ఆరోగ్యంపై ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు :
ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని జబ్బులను చేరుస్తున్నాం:
డిసెంబరులో ప.గో.జిల్లాలో తొలిసారిగా పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం:
డెంగీ, మలేరియా కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు వస్తున్నాం:
ప్రభుత్వ ఆస్పత్రులన్నీ జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాం:
స్కూళ్లు, ఆస్పత్రులు విషయంలో శరవేంగా ముందుకు వెళ్తున్నాం:
నాడు – నేడు కింద వీటిని అభివృద్ధి చేస్తున్నాం:
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా వీటిని తయారుచేస్తున్నాం:
ప్రజలకు వైద్యం ఖర్చులు తగ్గిస్తున్నాం: సీఎం
ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో 10 మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించాం: సీఎం
ఆక్వాకల్చర్‌లో నాణ్యమైన ఉత్పాదనలకోసం అత్యుత్తమ విధానాలను అనుసరించేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు సీఎం చెప్పారు
కొత్తగా ల్యాబ్‌లు ఏర్పాచేస్తున్నట్టు వెల్లిడించారు


వారసత్వంగా వచ్చిన కొన్ని సమస్యలతో రాష్ట్రం బాధపడుతోంది: సీఎం
గత ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ అయినప్పటికీ రూ. 2.27లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది: సీఎం
మేం అధికారంలోకి వచ్చాక బడ్జెట్‌ అంతే ఉంచి అంతర్గతంగా కొన్నిమార్పులు చేసుకున్నాం:
నాలుగు రకాలుగా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది:
రాష్ట్ర రెవిన్యూ నుంచి వచ్చే ఆదాయం ఒకటైతే, 
కేంద్ర పన్నుల నుంచి వచ్చే వాటా మరొకటి: సీఎం
ఒక విధానం ప్రకారం కేంద్ర పన్నల నుంచి వాటా వస్తుంది: సీఎం
ఇక రుణాల విషయంలో కూడా ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులు ఉన్నాయి:సీఎం
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు తగ్గకుండా చూడాలి: సీఎం


నీతి ఆయోగ్‌సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి, నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, మేకపాటి గౌతం, గుమ్మనూరు జయరాములు, చీఫ్‌ సెక్రటరీ ఎల్వీసుబ్రహ్మణ్యం, నీత్‌ ఆయోగ్‌ బృందం ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Popular posts
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు :శ్రీమతి పద్మశ్రీ సుంకర, ఏ పిసిసి సమన్వయ కమిటీ సభ్యులు
Image
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image
ఏప్రిల్ 14 వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు