డి.జి. పి కి చంద్రబాబు లేఖ

గౌరవనీయులైన శ్రీ గౌతమ్‌సవాంగ్‌ గారికి,


డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌, ఆంధ్రప్రదేశ్‌.


నమస్కారములు...


విషయం : రాష్ట్రంలో జరుగుతున్న వైసీపీ దమనకాండ, టీడీపీ శ్రేణులపై దాడులు, హింసా, విధ్వంసాల గురించి...


ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నాయకులపై, కార్యకర్తలపై జరిగిన దాడులు-దౌర్జన్యాలు, వేధింపులు-బెదిరింపులు, ఆస్తుల విధ్వంసాలు, గ్రామాల నుంచి వెళ్ళగొట్టడం గురించి, గతంలోనే మీ ద ష్టికి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది.


 రాష్ట్రవ్యాప్తంగా 545 పైగా కుటుంబాలు వైసిపి నేతల వేధింపులు తట్టుకోలేక, 100 రోజులకుపైగా ఎక్కడెక్కడో తలదాచుకోవాల్సి వచ్చిందంటే వైసీపీ నాయకుల దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తోంది. భౌతిక దాడులతో  శారీరకంగా హింసించడం, బెదిరింపులతో మానసికంగా వేధించడం, ఆస్తుల ధ్వంసం ద్వారా ఆర్ధిక మూలాలు దెబ్బతీసే ఫాసిస్ట్‌ దమనకాండకు పాల్పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, ముస్లిం మైనార్టీలు, మహిళలపై  దాడులు, దౌర్జన్యాలకు వైసిపి నేతలు పాల్పడుతోన్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూడటం అమానుషం.  ఇళ్లపై సామూహిక దాడులు చేయటం, భూములు బీడులు పెట్టడం, గ్రామాల నుంచి వెళ్లగొట్టడం, రోడ్లకు అడ్డంగా గోడలు కట్టడం, చీనీ చెట్లు, దానిమ్మ, బత్తాయి, కొబ్బరి చెట్లు నరికివేయటం, బోర్లు ధ్వంసం చేయడం, కాంట్రాక్టర్లపై దాడులు చేసి మెషీనరి ధ్వంసం చేయడం, సోలార్‌ ప్లాంట్లపై దాడులు చేసి సౌర ఫలకాలు పగులకొట్టడం, తుపాకీ చూపి కంపెనీల ప్రతినిధులను బెదిరించడం జరుగుతున్నా ప్రభుత్వం కిమ్మిన్నాస్తిగా వ్యవహరించడం గర్హనీయం. వైసిపి నేతల ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్సహాయంగా మారినందు వల్లే ఈ దుష్పలితాలన్నీ... 


బడుగు బలహీన వర్గాల ప్రజలు నిర్భయంగా సొంతూళ్లలో తలెత్తుకుని జీవించాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ పేదల పక్షానే పనిచేసింది. గత 100 రోజులుగా ప్రజలపక్షాన నిలబడిన తెలుగుదేశం పార్టీ నేతల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరం. 


ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 చోట్ల దాడులు, దౌర్జన్యాలు  జరిగాయి. 10 మందిని కిరాతకంగా హత్య చేశారు. వందలాది కుటుంబాలను  స్వగ్రామాల నుంచి తరిమేశారు. అనేకమందిపై అక్రమ కేసులు బనాయించారు. 12 మంది టీడీపీ శాసనసభ్యులు, మాజీ శాసన సభ్యులపై తప్పుడు కేసులు పెట్టారు.


 01-07-2019న సమర్పించిన లేఖలో ఈ విషయాలన్నింటినీ మీకు వివరించడం జరిగింది. అయినా చర్యలు లేనందు వల్లే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపు ఇచ్చాం. అందులో తొలిగా ''ఛలో ఆత్మకూరు'' కార్యక్రమం చేపట్టాం. 


 గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని 3నియోజకవర్గాలలో 16 గ్రామాల్లో జరుగుతున్న దారుణాలు, అరాచకాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకు, ''చలో ఆత్మకూరు'' పేరుతో ఒక పుస్తకం, రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలను వివరిస్తూ  ''నాగరిక ప్రపంచంలో అనాగరిక పాలన - పులివెందుల ఫ్యాక్షనిజం గుప్పిట్లో రాష్ట్రం'' పేరుతో మరో పుస్తకం ప్రచురించి విడుదల చేశాం. వైసిపి ప్రభుత్వ బాధిత కుటుంబాల వివరాలు, వాళ్లపై దౌర్జన్యాల గురించి ఆయా పుస్తకాలలో అన్ని ఆధారాలతో సహా మీకు అందజేస్తున్నాం.


 తుఫాన్లు, భూకంపాలు తదితర ప్రక తి విపత్తులలోనే, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆశ్రయం కల్పిస్తారు. అలాంటిది 'వైసీపీ ప్రభుత్వ బాధితులకు పునరావాస కేంద్రం' ఏర్పాటు చేయటం దేశంలోనే ఇదే తొలిసారి. సెప్టెంబర్‌ 11న 'ఛలో ఆత్మకూరు'కు పిలుపునిచ్చిన తర్వాత ముందస్తు నోటీసులు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులను హౌస్‌ అరెస్ట్‌ చేయడం చట్ట వ్యతిరేకం. నేనుండే ఇంటి గేట్లకు తాళ్లు కట్టి నన్ను బైటకు వెళ్లకుండా నిర్భంధించడం, నా నివాసానికి ఎవరినీ రాకుండా  అడ్డుకోవడం పౌర విధులనే కాదు, నా బాధ్యతలను కూడా కాలరాయడమే. శాంతిభద్రతలు కాపాడాల్సిన వ్యక్తి, బాధితులు అందరికీ న్యాయం చేయాల్సిన హోం మంత్రే, బాధితులను పెయిడ్‌ ఆర్టిస్టులని అవమానించారు. తమను ఊళ్లలో నుంచి వెళ్లిపొమ్మన్నారని బాధితులే ఫిర్యాదు చేసిన పోలీసు అధికారులపై చర్యలు చేపట్టాలి. 


బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ ముందుకు వచ్చిన టీడీపీ నేతలను అక్రమంగా నిర్బంధించి ఇబ్బందులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, ముస్లిం మైనార్టీ నేతలను, మహిళలను గంటకో పోలీస్‌ స్టేషన్‌ కు తరలించి అనేక అవస్థలకు గురిచేశారు. చివరికి పునరావాస శిబిరంలో ఉన్న బాధితులకు తాగునీరు, పాలు, ఆహారం అందించకుండా అడ్డుకోవడం బాధాకరం. 9 రోజులు శిబిరంలో ఉన్నా పట్టించుకోకుండా, సెప్టెంబర్‌ 11న గుంటూరు శిబిరంలో ఉన్న 157 కుటుంబాలను ఉన్నఫళంగా బస్సుల్లో ఎక్కించి తరలించారు.


సొంతూళ్లో నివసించే హక్కు కోసం పోరాడుతున్న బాధితులను పోలీసు అధికారులే తీసుకెళ్లి ఆయా గ్రామాలలో వదిలిపెట్టారు కాబట్టి బాధితుల రక్షణకు, ఆస్తుల భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంది.   తెలుగుదేశం పార్టీ పాలనలో అత్యంత సమర్ధవంతమైన వ్యవస్థగా నిరూపించుకున్న ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ వ్యవస్థ, ప్రస్తుత ప్రభుత్వంలో వైసిపి నేతల ఒత్తిళ్లతో నిర్వీర్యం కావడం దురద ష్టకరం. 


శిబిరం నుంచి తరలించిన కుటుంబాల యోగక్షేమాలను విచారించేందుకు, బాధితులను పరామర్శించేందుకు, వచ్చే వారం  టీడీపీ నేతల బ ందం ఆయా గ్రామాల్లో పర్యటిస్తుంది. ఈ వారం రోజుల్లో ఆయా గ్రామాల్లో పరిస్థితులను చక్కదిద్దడమే కాకుండా, దాడులకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. 


రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాలలో అరాచకాలు జరిగిన ప్రాంతాలలో కూడా టిడిపి నేతల ప్రతినిధి బ ందాలు త్వరలోనే పర్యటిస్తాయి. అన్నిచోట్ల ప్రశాంత పరిస్థితులు నెలకొల్పేందుకు తెలుగుదేశం పార్టీ పూర్తి సహకారం అందిస్తుంది. 


ప్రజల ప్రాధమిక హక్కులు, పౌరహక్కులు కాపాడడంలో, ఆస్తులకు భద్రత కల్పించడంలో  పోలీసు యంత్రాంగం తమ విధులను సమర్ధంగా నిర్వహించాలని, బాధితులకు న్యాయం చేయాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 


 భవదీయుడు


 


 (నారా చంద్రబాబు నాయుడు)


 ప్రధాన ప్రతిపక్ష నాయకులు


ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image