నేను చెప్పిందే వైసీపీ అనుసరించాల్సి వస్తోంది: చంద్రబాబు

నేను చెప్పిందే వైసీపీ అనుసరించాల్సి వస్తోంది: చంద్రబాబు
అమరావతి : కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి బాబు నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. వైసీపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో హాయిగా బతికిన ప్రజలు.. ఇప్పుడు కష్టాలు కొని తెచ్చుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. బస్తా సిమెంట్ కన్నా ఇసుక ధర ఎక్కువ ఉండడం జగన్నాటకమేనని.. వైసీపీ నేతల ఇసుక దోపిడీ జగన్‌కు తెలియడం లేదా? అని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు.
నేను చెప్పిందే అనుసరించాల్సి వస్తోంది  'వరదల వల్ల ఇసుక కొరత అనడం అబద్ధం. ఇసుక పాలసీ మార్చకుండా ఉంటే రాష్ట్రంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకునేవారు కాదు. 8 నెలల్లో పట్టిసీమ పూర్తి చేశారు.. అది టీడీపీ దూర దృష్టి. ఇరిగేషన్‌లో మీకు ఓనమాలు రావని జగన్‌కు చెప్పాం. ఇప్పుడు నేను చెప్పిందే అనుసరించాల్సి వస్తోంది. దేశంలో రైతురుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీనే. ప్రభుత్వంగా బాండ్లు ఇచ్చాం.. గౌరవించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. రూ.12,500 ఇస్తామని చెప్పి ఇప్పుడెందుకు ఇవ్వడం లేదో చెప్పాలి' అని జగన్ ప్రభుత్వంపై బాబు ప్రశ్నల వర్షం కురిపించారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు