ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు :పోతిన మహేష్

విజయవాడ నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్. ఈరోజు తన కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019వ సంవత్సరం రాష్ట్ర ప్రజలందరికీ బ్యాడ్ఇయర్  ఎందుకంటే ప్రజలకు ఉపాధి అవకాశాలు లేక తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనవుతు తాము చేసిన తప్పుకి మధన పడుతూన్నారని , జగన్మోహన్ రెడ్డి గారికి పాలన చేతకాక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని , 2020 వ సంవత్సరంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి పరిపాలన అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని లేదంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి చివరి అవకాశమని హెచ్చరించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వైఎస్ఆర్సిపి కి ఇక ఈ రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు ఉండదని ప్రజలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పాలన పై తీవ్రమైన టువంటి అసంతృప్తితో ఉన్నారని ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.


అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులకు పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడితే వారు చేస్తున్న పోరాటానికి మద్దతు పలికితే వైఎస్ఆర్సిపి నాయకులు ఎందుకు అంత కడుపుమంట అర్థం కావడం లేదని వారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ గా  తయారు చేసుకునేందుకు రైతుల భూములు త్యాగం చేస్తే వారి త్యాగాన్ని అపహాస్యం చేసే విధంగా వైఎస్సార్ సీపీ నాయకులు చేస్తున్న  చౌకబారు విమర్శలు ప్రజలందరూ గమనిస్తున్నారని రైతుల  కనీళ్ళలో ఈ ప్రభుత్వం  కొట్టుకుపోయే రోజులు తొందరలోనే ఉన్నాయి అని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారి పై చౌకబారు విమర్శలు చేస్తున్న వైఎస్ఆర్సిపి నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే వారికి ప్రజలే తగిన సమయంలో తగిన రీతిలో లో సమాధానం చెప్తారని హెచ్చరించారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image