ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ నిర్ణయాలు

11–12–2019
అమరావతి


*ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ నిర్ణయాలు*


*1*. 
మహిళలు, చిన్నారులకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ఇటీవలి దిశ సహా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటనల తర్వాత శ్రీ వైయస్‌.జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం (ఆంధ్రప్రదేశ్‌ దిశ యాక్ట్‌ పేరుతో కొత్త చట్టం)
ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా (సవరణ) చట్టం 2019 ( ఏపీ దిశ యాక్ట్‌) మరియు ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం 
కొత్త చట్టాన్ని తీసుకు వస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ 
మహిళలపై అత్యాచారం లాంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష
నిర్ధారించే ఆధారాలున్నప్పుడు (కన్‌క్లూజివ్‌ ఎవిడెన్స్‌) 21 రోజుల్లో తీర్పు
వారంరోజుల్లో దర్యాప్తు పూర్తి, 14 రోజుల్లో విచారణ పూర్తి, మొత్తం 21 రోజుల్లో జడ్జిమెంట్‌
ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు
మహిళలు,చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు
అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు, సోషల్‌మీడియా ద్వారా మహిళలపై వేధింపులు, చిన్నారులపై లైంగిక దాడులు తదితర నేరాలకు విచారణకు ప్రతిజిల్లాలో ప్రత్యేక కోర్టులకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌
సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగించేలా పోస్టింగులు పెడితే చర్యలు
ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెక్షన్‌ 354 (ఇ) కింద చర్యలు తీసుకునేలా బిల్లులో అంశాలు
మొదటి సారి తప్పు చేస్తే 2 సంవత్సరాలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష
మెయిల్స్, సోషల్‌మీడియా, డిజిటిల్‌ మీడియాల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఈ చర్యలు 
పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 354 (ఎఫ్‌) కింద చర్యలు
10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకూ శిక్ష
ఈ నేరాల్లో తీవ్రత ఉంటే 14 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకూ శిక్ష
పోస్కోచట్టం కింద ఇప్పటివరకూ 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకూ జైలుశిక్ష
ఈ శిక్షను పెంచుతూ బిల్లులో అంశాలు 
ఆమోదం తెలిపిన కేబినెట్‌ 


*2*. 
గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాలతో ప్రభుత్వంలో కొత్తశాఖ ఏర్పాటు
గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాలపై సమీక్ష, పర్యవేక్షణలకు బలోపేతమైన యంత్రాగం ఏర్పాటు చేయడమే దీని ఉద్దేశమన్న మంత్రివర్గం
లక్ష్యాలను సాధించడానికి ఇతర శాఖలతో సమన్వయం చేసుకునేదిశగా అడుగులు
ఉద్యోగులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతోపాటు వారిలో లక్ష్యాలపై స్పష్టత తీసుకురావడం, భాగస్వామ్యంద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టడమే ఉద్దేశమన్న మంత్రివర్గం


*3*. 
ప్రభుత్వంలో ఏపీఎస్‌ఆర్టీసీ విలీనం కొరకు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం
రవాణా, రోడ్లు– రహదారులు–భవనాలశాఖలోనే ఈ విభాగం ఏర్పాటు
ఏపీఎస్‌ ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో ఉన్న 51,488 మంది ఉద్యోగుల సంఖ్యకు 
తగినట్టుగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో పోస్టుల ఏర్పాటుకు కేబినెట్‌ అంగీకారం
ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సేవల కొనసాగింపునకు మంత్రివర్గం అంగీకారం


*4*. 
కాపు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసుల ఉపంసహరణకు మంత్రివర్గం నిర్ణయం
తుని ఘటన సహా కాపు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసుల ఉపసంహరణకు మంత్రివర్గం ఆమోదం
భోగాపురం భూసేకరణ సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని నిర్ణయం


*5*.
వైయస్సార్‌ పెన్షన్‌ కానుక మార్గదర్శకాలకు మంత్రివర్గం ఆమోదం
గతంలో ఉన్న మార్గ దర్శకాలను సవరించిన ప్రభుత్వం
గ్రామీణ ప్రాంతాల్లో నెల ఆదాయం రూ.10వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12లోపు ఆదాయం ఉన్నవారికి వైయస్సార్‌ పెన్షన్‌కానుక వర్తింపు
గతంలో కన్నా.. నెలవారీ ఆదాయపరిమితి పెంపు
3 ఎకరాల పల్లం లేదా, 10 ఎకరాల్లోపు మెట్ట లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉన్నవారికి వైయస్సార్‌ పెన్షన్‌ కానుక వర్తింపు
సొంతంగా కారు ఉన్నవారు అనర్హులు. ట్యాక్సీ, ట్రాక్టర్లు,  ఆటోలు ఉన్నవారికి మినహాయింపు
పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగుల్లోపు ఇల్లు ఉన్నవారు అర్హులు
కుటుంబంలో ఆదాయపుపన్ను చెల్లించేవారు అనర్హులు


*6*. 
ఆంధ్రప్రదేశ్‌ జనరల్‌ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం
రూ. 101 కోట్లతో షేర్‌ క్యాపిటల్‌తో ఏర్పాటు 


*7*. 
ఆంధ్రప్రదేశ్‌ మిల్లెట్‌బోర్డు చట్టం 2019 ముసాయిదాకు కేబినెట్‌ ఆమోదం
కరవు, వర్షభావ ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగును పెంచేందుకు బోర్డు ఏర్పాటు


*8*. 
ఆంధ్రప్రదేశ్‌ పల్సస్‌ బోర్డు చట్టం 2019 ముసాయిదాకు కేబినెట్‌ ఆమోదం


*9*. 
ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ రుణ పరిమితి మరో రూ.3వేల కోట్లు పెంచేందుకు కేబినెట్‌ అంగీకారం
ప్రస్తుతం ఉన్న పరిమితి రూ.22వేల కోట్లు


*10*.
ఆంధ్రప్రదేశ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ సవరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం


*11*.
అక్రమంగా మద్యాన్ని తయారుచేసినా, విక్రయించినా, రవాణా చేసినా కఠిన శిక్షలకు ఉద్దేశించిన బిల్లు ముసాయిదాకు కేబినెట్‌ ఆమోదం
ఈ నేరాలను నాన్‌ బెయిలబుల్‌ కేసులుగా పరిగణిస్తున్న బిల్లు
6నెలల నుంచి ఐదేళ్ల వరకూ జైలు శిక్ష
మొదటిసారి పట్టుబడితే జరిమానా రూ.2 లక్షలు, రెండోసారి పట్టుబడితే జరిమానా రూ.5 లక్షలు
బార్లలో మద్యం అక్రమాలకు పాల్పడితే లైసెన్స్‌ఫీజు కన్నా 2 రెట్లు జరిమానా, రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్‌ రద్దు


*12*.
ఆంధ్రప్రదేవ్‌ టాక్స్‌ ఆన్‌ ప్రొఫెషన్స్, ట్రేడ్స్, కాలింగ్స్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ అమెండమెంట్‌ బిల్‌ –2019 కు కేబినెట్‌ ఆమోదం


*13*.
వీఓఏ, సంఘమిత్ర, యానిమేటర్ల జీతాల పెంపుదలకు మంత్రివర్గం అంగీకారం
వారికి రూ.10వేల చొప్పున జీతాలు పెంచుతూ ఇటీవలే నిర్ణయం
27,797 మందికి లబ్ధి


*14*.
ఆంధ్రప్రదేశ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ (ఏపీసీఎస్‌) చట్టం 1964లో సెక్షన్‌ 21–ఎ (1) (ఇ)  సవరణకు కేబినెట్‌ ఆమోదం


*15*.
చిత్తూరుజిల్లా ఏర్పేడు మండలం పంగూరు గ్రామంలో 15 ఎకరాల 28 సెంట్ల భూమి ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం


*16*.
అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిచేస్తూ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం
వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లిషు మాధ్యమంలో బోధన
తదుపరి సంవత్సరాల్లో ఒక్కో ఏడాది ఒక్కో తరగతి చొప్పున ఇంగ్లిషు మాధ్యమంలో బోధన


*17*.
రాజధాని ప్రాంతంలో కొనుగోలుచేసి ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చిన అసైన్డ్‌ భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్‌ ప్లాట్ల కేటాయింపు రద్దుకు కేబినెట్‌ ఆమోదం
ఫిబ్రవరి 17,2016న జీఓఎంఎస్‌ –41 ప్రకారం ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చిన అసైన్డ్‌ భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్‌ ప్లాట్ల కేటాయింపు రద్దు
ఏపీ అసైన్డ్‌ ల్యాండ్స్‌ (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్స్‌)–1977 నాటి చట్టాన్ని ఉల్లంఘించారన్న కేబినెట్‌
అసలైన అసైన్డ్‌దారులకు రెసిడెన్షియల్, కమర్షియల్‌పాట్లు కేటాయించాలని నిర్ణయం


*18*.
ఏపీ స్టేట్‌యూనివర్శిటీ యాక్ట్‌లో సవరణలకు కేబినెట్‌ ఆమోదం


*19*.
కడపజిల్లాలో వైయస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం
యూనివర్శిటీలో స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్, కాలేజ్‌ ఆఫ్‌ఫైన్‌ ఆర్ట్స్‌ ఏర్పాటు
రెండు కాలేజీల్లో ఐదు విభాగాలు


*20*. 
ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఛైర్మన్‌ లేదా ఆయనచే నియమించబడిన వ్యక్తి అన్ని యూనివర్శిటీల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా నియామకం
చట్టంలో సవరణలకు కేబినెట్‌ ఆమోదం


*21*.
కర్నూలులో క్లస్టర్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు నిర్ణయం
సిల్వర్‌ జూబ్లీ డిగ్రీకాలేజీ, కేవీఆర్‌ గవర్నమెంట్‌ డిగ్రీకాలేజీ, గవర్నమెంట్‌ డిగ్రీకాలేజీలను విలీనం చేస్తూ క్లస్టర్‌ యూనివర్శిటీగా ఏర్పాటు చేయాలని నిర్ణయం


*22*. ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక విభాగం కమిషన్‌ ఛైర్మన్‌ గా వంగపండు ఉష నియామకానికి కేబినెట్‌ ఆమోదం.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు