వివాహితపై గ్రామ వాలంటీర్ అత్యాచారయత్నం*

*వివాహితపై గ్రామ వాలంటీర్ అత్యాచారయత్నం*


కలిగిరి: ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలం వీర్నకొల్లు గ్రామ దళితవాడలో రైతు భరోసా పధకంపై వివరాల కోసం వెళ్ళి ఒక వివాహిత మహిళపై అత్యాచారయత్నానికి ఒడిగట్టిన గ్రామ వాలంటీర్ ఉదంతం మంగళవారం నాడు వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే వీర్నకొల్లు గ్రామంలో వాలంటీరుగా పనిచేస్తున్న నిమ్మకంటి.వాలీ స్థానిక దళిత వాడలో నివాసముంటున్న నిమ్మకంటి.సంధ్య ఇంటికి గత రాత్రి పట్టాదారు పాసుపుస్తకాల వివరాల కోసం వెళ్ళాడు. వరుసకు వదిన అయిన సంధ్యతో రైతు భరోసా పధకంలో అర్హురాలిగా చేరుస్తానని, పాసు పుస్తకాలు కావాలని కోరాడు. సంధ్య పాసు పుస్తకాలను తీస్తుండగా వాలంటీర్ వాలీ ఆమెపై అత్యాచార యత్నానికి పాల్బడినట్లు తెలిసింది. వెంటనే తేరుకున్న సంధ్య బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. స్థానికులను పసిగట్టిన వాలంటీర్ వాలీ అక్కడి నుండి జారుకున్నాడు. ఈ విషయమై సంధ్య కలిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే అప్రమత్తమైన ఎస్.ఐ ఆదిలక్ష్మి విచారణ ముమ్మరం దిశగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించి వాలీపై కేసు నమోదు చేశారు. భాధ్యతాయుతమైన వాలంటీర్ ఇలాంటి దురాగతానికి ఒడిగట్టిన వైనం స్థానికంగా తీవ్ర చర్చానీయాంశమైంది.......


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు