11–12–2019
అసెంబ్లీ
*వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పు*
*అభివృద్ధితో కూడిన పరిపాలన ముఖచిత్రాన్ని ఈవ్యవస్థలు మార్చబోతున్నాయి*
*వివక్షకు తావులేకుండా అర్హులందరికీ ప్రయోజనాలు*
*సచివాలయాల ద్వారా 500 రకాలకుపైగా సేవలు*
*అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే 4లక్షల ఉద్యోగాలు కల్పించాం*
*సచివాలయాల్లో 82.5శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉద్యోగాలు వచ్చాయి*
*ఇంతటి ముఖ్యమైన సబ్జెక్టుపై చర్చలో చంద్రబాబుగారు పాల్గొనకపోవడం దురదృష్టకరం*
*అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్*
వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం శ్రీ వైయస్.జగన్ మాట్లాడిన అంశాలు
వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ లాంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్మీద చర్చలో చంద్రబాబుగారు పాల్గొంటారని చాలా ఆశగా ఎదురుచూశాం. ఎక్కువ సమయంకూడా ఇచ్చాం. కాని తన ధోరణి మారదు అన్నట్టుగానే చంద్రబాబుగారు రాలేదు
వాలంటీర్లు, సచివాలయాల ఏర్పాటుతో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నాం.
అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు కల్పించడమన్నది దేశచరిత్రలో ఎప్పుడూ జరగలేదు.
అలాంటి ఘట్టం ఆంధ్రరాష్ట్రంలో జరిగింది.
అక్షరాల 1,28,858 మందికి అపాయింట్మెంట్లు ఇచ్చారు.
వాళ్లంతా కూడా ఇవాళ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నారు.
నిజంగా ఇది చాలా సంతోషాన్ని ఇచ్చే అంశం.
11వేలకుపైగా గ్రామసచివాలయాలు, దాదాపు 3వేలకుపైగా వార్డు సచివాలయాలు అన్నీ కలిపి దాదాపు 15వేలకుపైగా గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,28,858 మంది పనిచేస్తున్నారు.
దాదాపు 8 రోజులపాటు 20 లక్షలమంది పరీక్షలు రాశారు.
చాలా పారదర్శకంగా ఈ పరీక్షలు జరిగాయి.
ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ పరీక్షలు నిర్వహించారు.
అధికారులందరికీ కూడా నేను హేట్యాఫ్ చెప్తున్నాను.
సెక్రటరీల దగ్గరనుంచి జిల్లా కలెక్టర్ల వరకూ, అలాగే పంచాయతీరాజ్శాఖమంత్రి, మున్సిపాల్ శాఖమంత్రులనూ ఈ సందర్భంగా ప్రశంసిస్తున్నాను.
దేశంలో కూడా ఎక్కడాలేని రీతిలో ఈ పరీక్షలు పారదర్శకంగా జరిగాయి.
1,28,858 ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 82.5శాతం ఉద్యోగాలు వచ్చాయంటే.. ఏ స్థాయిలో విప్లవాత్మక బాట ఏర్పడిందో చెప్పాల్సిన అసరంలేదు.
51.9 శాతం మంది బీసీలతో కలిపి 82.5శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వచ్చిందంటే.. ఇది ఏరకమైన విప్లవాత్మక మార్పునకు దారితీసిందో ఇట్టే అర్థం అవుతుంది.
వీటికి అనుబంధంగా 2.65లక్షల పైచిలుకు గ్రామ వాలంటీర్లను నియమించాం
ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించాం.
వాళ్లు కూడా ఎక్కడా అవినీతికి పాల్పడ కూడదనే ఉద్దేశంతో నెలకు రూ.5 వేలచొప్పున జీతాలు ఇస్తున్నాం.
ఎక్కడైనా, ఎవరైనా పక్షపాతం చూపించినా, ఎవరైనా లంచాలు తీసుకున్నా... ఒక టోల్ఫ్రీ నంబర్ఇచ్చాం. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే కనెక్ట్ అయ్యేట్టుగా చేశాం. ఎక్కడైనా సరే ఎవరైనా తప్పులు చేస్తే తొలగిస్తామని స్పష్టంగా చెప్పాం. 1902 అనే కాల్ సెంటర్ను కూడా పెట్టాం.
ప్రతి యాభై ఇళ్లకు సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీకూడా నేరుగా డోర్డెలివరీ చేసే విధంగా ఈవ్యవస్థను రూపొందించాం.
ప్రతి 2 వేల జనాభాకు గ్రామ సెక్రటేరియట్ను తీసుకు రావడం, ఆ 2వేల జనాభాకు సంబంధించిన అన్ని అంశాలను గ్రామ సచివాలయం, గ్రామ సెక్రటేరియట్కూడా ప్రతి సేవను కూడా డోర్డెలివరీ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం.
సంతృప్త స్థాయిలో ప్రతి ఒక్క లబ్ధిదారునికీ మంచి కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టాం.
ఎవ్వరైనా, ఎక్కడైనా మిగిలిపోతే గ్రామ సచివాలయంలో ఆ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను అతికిస్తున్నాం.
ఆ జాబితాలో లబ్ధిదారుల జాబితాను అతికించడమే కాకుండా, ఆ జాబితా పక్కనే అర్హతలు ఏంటి, ఎవరిపేరైనా మిస్ అయితే వాళ్లు ఎలా నమోదుచేసుకోవాలి అన్న విషయాలను రాస్తున్నాం.
శాశ్వతంగా సోషల్ ఆడిట్ కోసం ఇవన్నీ చేస్తున్నాం.
అర్హత ఉన్నవారు మిగిలిపోకుండా ఉండడానికి, అర్హత లేకుండా పథకాన్ని పొందిఉంటే.. తొలగించడానికి ఇవన్నీచేస్తున్నాం.
సోషల్ఆడిట్ మెకానిజాన్ని గ్రామ సచివాలయంలో అంతర్భాగంగా పెట్టాం.
దాదాపు 500 రకాల సేవలను అందిస్తున్నాం.
సర్టిఫికెట్కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కార్డు కావాలన్నా.. 72 గంటల్లో ఇస్తామా? వారంరోజుల్లో ఇస్తామా? లేకపోతే రెండు వారాల్లో ఇస్తామో స్పష్టంగా వివరణ ఇస్తూ... ఏయే సేవలు ఎన్నిరోజుల్లోగా అందిస్తామో... ప్రదర్శించమని అధికారులకు చెప్పాం.
స్పందన అనే కార్యక్రమంలో వారానికి ఒకరోజు సోమవారం కార్యక్రమం పెట్టి సమస్యలను అన్నీ వినేందుకు అ«ధికారులను అందుబాటులో ఉండమని చెప్తున్నాం.
మంగళవారం నేరుగా నేను కలెక్టర్లతో స్వయంగా వీడియో కాన్ఫరెన్స్తో సమీక్షిస్తున్నాను.
వారానికి ఒకరోజు జరుగుతున్న ఈ స్పందన అనే కార్యక్రమం ప్రతిరోజుకూడా గ్రామ సచివాలయంలో జరుగుతుంది.
స్పందన అనే కార్యక్రమం... అభివృద్ధితో కూడిన పాలన ముఖచిత్రాన్ని ఇది పూర్తిగా మారుస్తుంది.
చంద్రబాబుగారు ఈ చర్చలో పాల్గొని ఉంటే బాగుండేది.
వాళ్లుప్రవేశపెట్టిన జన్మభూమి కమిటీలు విఫలం అయ్యాయి, గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు.. ఏరకంగా విజయవంతం అవుతున్నాయో చంద్రబాబుగారికి అర్థం అయ్యే విధంగా, ఆయనకు నాలెడ్జ్ పెంచే విధంగా చర్చ ఉండేది.
దురదృష్టవశాత్తూ ఆయన రాలేదు. కాని ఈప్రసంగాన్ని టీవీల్లో చూస్తారని అనుకుంటున్నాను. ఆయన నాలెడ్జ్ పెంచుకుంటారని ఆశిస్తున్నాను.