ఏం చేస్తారో అని భయమేస్తుంది : కాల్వ శ్రీనివాసులు

ఏం చేస్తారో అని భయమేస్తుంది : కాల్వ శ్రీనివాసులు
అమరావతి : రాజధానిని మూడు ముక్కలు చేయడమనేది అనాలోచిత చర్య అని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ప్రశాంతంగా ఉండే విశాఖను వైసీపీ నేతలు ఏం చేస్తారో అని భయమేస్తోందని వ్యాఖ్యానించారు. ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన.. జీఎన్. రావు కమిటీ పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. గతంలో విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుకు జగన్ అంగీకరించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. విశాఖలో పాలనా రాజధానిని ఏర్పాటు చేయాలని ఎవరడిగారని ప్రశ్నించారు. రాయలసీమకు రాజధానిని దూరం చేసే దురుద్దేశం జగన్‌లో కనిపిస్తుందన్నారు. హైకోర్టును విశాఖలో పెట్టి.. పాలనా రాజధానిని కర్నూలులో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాల్వ డిమాండ్ చేశారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు