జగన్ ప్రభుత్వానికి మండలి గండం

జగన్ ప్రభుత్వానికి మండలి గండం
అమరావతి: ఒక రాష్ట్రం.. మూడు రాజధానులు, ఒక హైకోర్టు, రెండు ప్రాంతాల్లో సీఎం క్యాంపు కార్యాలయాలు, రెండు చోట్ల అసెంబ్లీ సమావేశాలు.. ఇవీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక సిఫారసులు చేసింది. ముఖ్యమంత్రి జగన్‌ చేసిన ‘మూడు రాజధానుల’ ప్రకటనకు బాగా దగ్గరగా... ఆయా వ్యవస్థలను మరిన్ని ‘ముక్కలు’గా చేస్తూ కమిటీ తన నివేదిక సమర్పించింది. ఆ తర్వాత రాజధాని మార్పుపై ప్రభుత్వం బీసీజీ కమిటీని కూడా నియమించింది. బీసీజీ కూడా జగన్‌కు నివేదిక ఇచ్చింది. దేశంలోని బహుళ రాజధానులు, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణపై నివేదికలో ప్రస్తావించారు. అయితే ఈ రెండు కమిటీలపై చర్చించేందుకు ఈనెల 20న అసెంబ్లీ, 21న శాసన మండలిని సమావేశపర్చాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.  ఈ సమావేశాల్లో ప్రభుత్వం రాజధాని మార్పునకు సంబంధించి బిల్లును ప్రవేశ పెట్టనుందని ప్రచారం జరుగుతోంది. గతంలో అసెంబ్లీ ఆమోదించిన సీఆర్డీయే చట్టాన్ని రద్దు చేయడం లేదా కొన్ని సవరణలు ప్రతిపాదించవచ్చని అంటున్నారు. అయితే రాజధాని మార్పునకు సంబంధించి ప్రభుత్వ వ్యూహానికి శాసనమండలి గండం పొంచి ఉంది. మండలిలో మెజారిటీ ఉన్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఈ బిల్లును అడ్డుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మండలిలో ఆధిక్యం ఉన్న పార్టీలకు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. బిల్లును మరింత నిశిత పరిశీలనకు సెలెక్ట్‌ కమిటీకి పంపవచ్చు. ఆ పేరుతో ఏ నిర్ణయం తీసుకోకుండా నెల, రెండు నెలలు గడిపేయవచ్చు. లేదా ఆ బిల్లుకు సవరణలు ప్రతిపాదించి వెనక్కు అసెంబ్లీకి పంపవచ్చు. అసెంబ్లీ మరోసారి దాన్ని ఆమోదించి మండలికి పంపాల్సి ఉంటుంది. అప్పుడు కూడా దానిపై నిర్ణయం తీసుకోవడానికి మండలికి నెల సమయం ఉంటుంది. రెండోసారి కూడా మండలి తిరస్కరిస్తే ఆ తర్వాత అసెంబ్లీ నిర్ణయమే ఫైనల్‌ అవుతుంది.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు