విజయసాయి రెడ్డి రాసిన లేఖపై స్పందించిన అమిత్ షా

*సీబీఐ జేడీగా రాష్ట్రేతరుడిని నియమించాలని కోరుతూ  విజయసాయి రెడ్డి రాసిన లేఖపై స్పందించిన అమిత్ షా*


న్యూఢిల్లీ, జనవరి 11: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా తెలుగేతర అధికారిని నియమించాలని కోరుతూ వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి రాసిన లేఖపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. 


- ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ ఆ లేఖను కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖకు పంపించినట్లు అమిత్‌ షా సమాధానం ఇచ్చారు.


- హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే సీబీఐ జాయింట్‌ డైరెక్టర్ నియామకం తరచుగా  రాజకీయ దురుద్దేశాలతో, రాజకీయ స్వప్రయోజనాల సాధన కోసం జరుగుతోందని చెబుతూ.. గత ఏడాది డిసెంబర్‌ 30న విజయసాయి రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌ షా, సీబీఐ డైరెక్టర్‌కు లేఖలు రాశారు. 


- ఈ నేపథ్యంలో తెలుగేతర అధికారిని జేడీగా నియమించాలని ఆయన కోరారు. తెలుగు అధికారిని జేడీగా నియమిస్తున్నందు వలన జరుగుతున్న అనర్ధాలను, అక్రమాలను ఆయన ఆ లేఖలో వివరించారు.
 
- తెలుగు అధికారులను జాయింట్‌ డైరెక్టర్లుగా నియమించడం వలన వారు స్థానిక రాజకీయ, సామాజిక పరిణామాలకు ప్రభావితులవుతున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగువాడైన సీబీఐ జాయింట్‌ డెరెక్టర్‌ను ప్రలోభాలతో లోబరచుకుని వారిని తన రాజకీయ ప్రత్యర్ధులపైకి ఏ విధంగా ఉసిగొల్పుతారో గతంలో జరిగిన ఉదంతాలను విజయసాయిరెడ్డి ఆ లేఖలో వివరించారు.



- గడచిన అయిదేళ్ళ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాల్పడిన వేల కోట్ల రూపాయల అక్రమాలు, అవినీతి కార్యకలాపాల నిగ్గు తేల్చాలంటే తెలుగేతర సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా తెలుగేతర అధికారి నియామకం జరిగితేనే సాధ్యపడుతుందని ఆయన వివరించారు. 


- విజయసాయి రెడ్డి లేఖకు సమాధానంగా ఈనెల 10న హోం మంత్రి అమిత్‌ షా తిరిగి లేఖ రాశారు. విజయసాయి రెడ్డి లేఖలో ప్రస్తావించిన పలు అంశాలపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ ప్రధాన మంత్రి నేతృత్వంలో పనిచేసే సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖకు ఆ లేఖను పంపినట్లు అమిత్ షా తెలిపారు.


- దీనికి సంబంధించిన లేఖ- సమాధానం డాక్యుమెంట్స్ జత చేయడమైనది ...👉


Popular posts
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image