*సీబీఐ జేడీగా రాష్ట్రేతరుడిని నియమించాలని కోరుతూ విజయసాయి రెడ్డి రాసిన లేఖపై స్పందించిన అమిత్ షా*
న్యూఢిల్లీ, జనవరి 11: హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సీబీఐ జాయింట్ డైరెక్టర్గా తెలుగేతర అధికారిని నియమించాలని కోరుతూ వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి రాసిన లేఖపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు.
- ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ ఆ లేఖను కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖకు పంపించినట్లు అమిత్ షా సమాధానం ఇచ్చారు.
- హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సీబీఐ జాయింట్ డైరెక్టర్ నియామకం తరచుగా రాజకీయ దురుద్దేశాలతో, రాజకీయ స్వప్రయోజనాల సాధన కోసం జరుగుతోందని చెబుతూ.. గత ఏడాది డిసెంబర్ 30న విజయసాయి రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, సీబీఐ డైరెక్టర్కు లేఖలు రాశారు.
- ఈ నేపథ్యంలో తెలుగేతర అధికారిని జేడీగా నియమించాలని ఆయన కోరారు. తెలుగు అధికారిని జేడీగా నియమిస్తున్నందు వలన జరుగుతున్న అనర్ధాలను, అక్రమాలను ఆయన ఆ లేఖలో వివరించారు.
- తెలుగు అధికారులను జాయింట్ డైరెక్టర్లుగా నియమించడం వలన వారు స్థానిక రాజకీయ, సామాజిక పరిణామాలకు ప్రభావితులవుతున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగువాడైన సీబీఐ జాయింట్ డెరెక్టర్ను ప్రలోభాలతో లోబరచుకుని వారిని తన రాజకీయ ప్రత్యర్ధులపైకి ఏ విధంగా ఉసిగొల్పుతారో గతంలో జరిగిన ఉదంతాలను విజయసాయిరెడ్డి ఆ లేఖలో వివరించారు.
- గడచిన అయిదేళ్ళ కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాల్పడిన వేల కోట్ల రూపాయల అక్రమాలు, అవినీతి కార్యకలాపాల నిగ్గు తేల్చాలంటే తెలుగేతర సీబీఐ జాయింట్ డైరెక్టర్గా తెలుగేతర అధికారి నియామకం జరిగితేనే సాధ్యపడుతుందని ఆయన వివరించారు.
- విజయసాయి రెడ్డి లేఖకు సమాధానంగా ఈనెల 10న హోం మంత్రి అమిత్ షా తిరిగి లేఖ రాశారు. విజయసాయి రెడ్డి లేఖలో ప్రస్తావించిన పలు అంశాలపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ ప్రధాన మంత్రి నేతృత్వంలో పనిచేసే సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖకు ఆ లేఖను పంపినట్లు అమిత్ షా తెలిపారు.
- దీనికి సంబంధించిన లేఖ- సమాధానం డాక్యుమెంట్స్ జత చేయడమైనది ...👉