రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి

రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించడానికి అధికార వైకాపా ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. మంగళవారం నాడు క్యాబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం తరువాత బుధవారం నాడు మంత్రివర్గసమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో రాజధాని తరలింపుపై అధికారిక నిర్ణయాన్ని తీసుకుని...శాఖల తరలింపు గురించి చర్చిస్తారని సమాచారం. ఇప్పటికే పలు శాఖాధిపతులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో రాజధాని తరలింపుపై అధికారికంగా చెప్పబోతున్నారు. దీంతో రాజధాని తరలింపు జనవరి రెండో వారం నుంచే మొదలు కానుంది. 


ఒకవైపు రాజధానిని ఇక్కడే కొనసాగించాలని రాజధాని ప్రాంతంలోని రైతులు భారీ స్థాయిలో ఉద్యమిస్తుంటే...వారి ఉద్యమాన్ని పట్టించుకోకుండానే ప్రభుత్వం తాము చేయాలనుక్ను పనులను వరుసగా చేసుకుంటూపోతోంది. రాజధాని రైతుల ఆందోళన పతాకస్థాయికి చేరినా, వారి ఉద్యమానికి అన్ని వైపుల నుంచి మద్దతు వస్తున్నా...ప్రభుత్వం మాత్రం దాన్ని గుర్తించడం లేదు. అది ఫెక్‌ ఉద్యమమని చెబుతూ కొంతమంది రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్లు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారని మంత్రులు,ఎమ్మెల్యేలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాజధానిని ఇక్కడే కొనసాగించాలని టిడిపి,బిజెపి,జనసేన, సిపిఐ,సిపిఎం తదితర పార్టీలు చెబుతున్నా..ప్రభుత్వం మాత్రం వారి మాటలను కనీసం పరిగణలోకి తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని తరలింపుపై ప్రజల్లో అసహనం, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా రాయలసీమ వాసులు..విశాఖలో రాజధానిని ఏర్పాటు చేస్తే...తమకు చాలా దూరం అవుతుందని, ఉంటే రాజధానిని 'అమరావతి'లో కొనసాగించాలని, లేకుంటే రాయలసీమలో పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే వారి డిమాండ్‌ను కానీ, ఇతర ప్రాంతాలవారి డిమాండ్‌ను కానీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా, తరలింపుకు న్యాయపరమైన అడ్డంకులు రాకుండా చర్యలు తీసుకుంటూ తాను తీసుకున్ననిర్ణయాన్ని అమలు చేయబోతోంది.


ఈ నేపథ్యంలో ముందుగా 32శాఖలను విశాఖపట్నం తరలించాలని ప్రయత్నాలు చేస్తోంది. సచివాలయంలోని జిఎడిని ముందుగా తరలిస్తారని వార్తలు వస్తున్నాయి. దానితోపాటు విద్యాశాఖను కూడా తరలిస్తారంటున్నారు. ఇక హోం, ఆర్థికశాఖలతో పాటు ఇతర ముఖ్యమైన శాఖలను జనవరి ఆఖరి లోపే విశాఖపట్నానికి తరలిస్తారని, ఫిబ్రవరి, మార్చి నాటికి తరలింపు పూర్తి అవుతుందంటున్నారు. ఆగమేఘాలపై రాజధాని తరలించడంపై సచివాలయ ఉద్యోగులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు విశాఖపట్నం వెళ్లడం ఎలా వీలవుతుందని అంతర్గతంగా ప్రశ్నించుకుంటున్నారు. కానీ..ఏఒక్కరు కూడా రాజధాని తరలింపుపై కనీస నిరసన వ్యక్తం చేయడానికి ముందుకు రావడం లేదు. ఎవరికి వారు భయంతో..తమకెందుకులే..అందరూ ఎలా అయితే తాము అలా అంటూ మౌనంగా బాధను వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద తాను అనుకున్నట్లే 'జగన్‌' రాజధాని జనవరిలోనే విశాఖకు తరలిస్తారనే దానిపై  అటు ప్రభుత్వ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ స్పష్టత తెస్తున్నారు. 


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image