ఐదు కోట్ల ప్రజల మనోభావాలతో చాలా చులకనగా ఆడుకుంటున్నారు..

🔸నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నేతల సమావేశం..


*మాజీ మంత్రి సోమిరెడ్డి కామెంట్స్*


🔸జీఎన్ రావు, బీసీజీ....ఏ కమిటీ అయినప్పటికీ అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో అదే నివేదికల్లో కనిపిస్తోంది..


🔸వైజాగ్ లో విజయసాయి రెడ్డి ఏమని ప్రకటించారో దానినే నివేదికల్లో రాస్తున్నారు...వారిద్దరు చెప్పిందే జరుగుతోంది..


🔸బీసీజీ వారం రోజుల్లోనే నివేదిక ఇచ్చింది..జీఎన్ రావు కమిటీ రిపోర్టును జెరాక్స్ తీసిచ్చినట్టుంది..


🔸ఐదు కోట్ల ప్రజల మనోభావాలతో చాలా చులకనగా ఆడుకుంటున్నారు..


🔸ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి దురదృష్టకరం..151 సీట్లతో గెలిపిస్తే ప్రజలకు పాలన అందించడం మానేసి రాష్ట్రంలో కన్ఫ్యూజన్ వాతావరణం తెచ్చారు..


🔸జీఎన్ రావు కమిటీ గవర్నర్ నివాసం అమరావతిలో అని చెప్పింది..బీసీజీ రిపోర్టు మాత్రం వైజాగ్ కు మార్చినట్టుంది..


🔸మంత్రుల నివాసాలు అమరావతిలో అని జీఎన్ రావు కమిటీ చెప్పగా బీసీజీ అసలేం చెప్పలేదు..మంత్రులు గాలిలో ఉంటారా..


🔸ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలెనుకున్న ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రం ఆమోదించి, రాజధానికి నిధులు విడుదల చేసి, దేశ చిత్రపటంలో రాజధానిగా అమరావతిని గుర్తించి ఈ రోజు మారస్తామంటే ఆషామాషి కాదు..అది మీ వల్ల కాదు.


🔸మీ ఐదేళ్ల పాలన కాలంలో హైకోర్టు మూడు బెంచీలకు సుప్రీకోర్టు అనుమతులు వచ్చేది కష్టమే..హైకోర్టు మార్చడం అంత తేలికకాదు..


🔸సాక్ష్యాత్తు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి, నిధులిచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదు..


🔸ప్రజల హక్కులను కాపాడేందుకు న్యాయ స్థానాలున్నాయి..


🔸ఇప్పటికైనా కక్షసాధింపు చర్యలను ఆపండి..చంద్రబాబు నాయుడిపై కోపంతో రాష్ట్రాన్ని నాశనం చేయకండి..


🔸ప్రశాంతంగా ఆలోచించండి...రైతులను బాధపెడుతుండటం దురదృష్టకరం..ఇది మీ పార్టీకి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచిది కాదు..


🔸అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను ఆర్నెళ్లలో అధోగతి పట్టించారు..