వై. యస్. ఆర్. ప్రవాసాంధ్ర సేవా కేంద్రం

వై. యస్. ఆర్. ప్రవాసాంధ్ర సేవా కేంద్రం
రాజంపేట : ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ తన సేవలను మరింత  అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా డా. వై ఎస్ ఆర్ కడప జిల్లా రాజంపేట లో “వై. యస్. ఆర్. ప్రవాసాంధ్ర సేవా కేంద్రం” ను ఈ రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు మైనారిటీ వెల్ఫేర్ శాఖ మాత్యులు  శ్రీ  అంజద్ బాషా గారు,  రైల్వేకోడూరు శాసన సభ్యులు, విప్ శ్రీ  శ్రీనివాసులు గారు ,రాజంపేట శాసనసభ్యులు మరియు టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ  మేడా వెంకట  మల్లికార్జున రెడ్డి గారు,  రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్,మాజీ శాసన సభ్యులు  శ్రీ.ఏ  అమర్నాథ్ రెడ్డి  గారు, ఏపిఎన్ఆర్ టి సొసైటీ అధ్యక్షులు శ్రీ  వెంకట్ ఎస్ మేడపాటి  గారు , కడప పార్లమెంట్ ఇంచార్జి మరియు కడప మాజీ మేయర్ శ్రీ కె .సురేష్ బాబు గారు , రాజంపేట డిఎస్పీ శ్రీ నారాయణ స్వామి రెడ్డి  గారు మరియు ఆర్ డీ ఓ శ్రీ పి. ధర్మారెడ్డి  గారు చేతుల మీదుగా  ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గల్ఫ్  వైసీపీ కన్వీనర్లు శ్రీ బి హెచ్ .ఇలియాస్ గారు మరియు  శ్రీ ఎం.బాలిరెడ్డి గారు కూడా హాజరయ్యారు.     ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల క్షేమమే ధ్యేయంగా వారికి సేవలందించడంలో రాష్ట్ర  గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి  ఆదేశానుసారం, శ్రీ  వెంకట్ ఎస్ మేడపాటి  గారి  అధ్యక్షతన ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్  పనిచేస్తోందని,  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ అంజద్ బాషా గారు అన్నారు. విదేశాలకు  వెళ్లే వారికి, అక్కడున్న ప్రవాసాంధ్రులకు  ఎన్నో సేవలందిస్తున్న ఏపిఎన్అర్ టి సొసైటీ  తన సేవలను మరింత చేరువచేయడానికి ఈ సేవా కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం  చేసారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే విధముగా రాజంపేటలో ప్రాంతీయ  కార్యాలయమును ఏర్పాటు చేసిన  ఏపిఎన్ఆర్ టి సొసైటీ అధ్యక్షులు  శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి గారిని ఆయన అభినందించి సత్కరించారు. 
  విదేశాలలో ఉన్న ఆంధ్రులు  ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ సేవలని వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసన సభ్యులు  శ్రీ  కె . శ్రీనివాసులు గారు కోరారు.    ఈ వై ఎస్ ఆర్  ప్రవాసాంధ్ర సేవా కేంద్రం ప్రారంభోత్సవానికి  విచ్చేసిన రాజంపేట  శాసనసభ్యులు మరియు టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ . మేడా  వెంకట మల్లికార్జున రెడ్డి గారు మాట్లాడుతూ  ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ కార్యాలయము తన నియోజక వర్గంలో ప్రారంభించినందుకు  ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసారు.  కడప జిల్లా మరియు పరిసర ప్రాంతాల నుండి  ఎంతో మంది విదేశాలకు వెళ్తున్నారని, వారిలో చాలా మంది ఉపాధి కోసం  గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి, అక్కడ చట్టాల గురించి సరైన అవగాహన లేక  ఇబ్బందులు పడుతున్నారన్నారు..  అలా విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు   సరైన అవగాహనతో, తమ సందేహాలను నివృత్తి చేసుకొని వెళ్ళడానికి ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ వారి రాజంపేట ఆఫీస్ ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు.  రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్,మాజీ శాసన సభ్యులు  శ్రీ.ఏ  అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజంపేటలో వై ఎస్ ఆర్  ప్రవాసాంధ్ర సేవా కేంద్రం ప్రారంభించటం  రాయలసీమ ప్రాంత వాసులకు  ఎంతో ఉపయోగకరమని  అభిప్రాయపడ్డారు.  ఏపిఎన్నార్టీ సొసైటీ  అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ  24/7 హెల్ప్ లైన్ ద్వారా 365 రోజులు  24 గంటలు ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ ప్రవాసాంధ్రులకు అందుబాటులో ఉంటోందన్నారు.    ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయం నుండి కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఏపిఎన్నార్టిఎస్,  ప్రవాసాంధ్రులకు అందించే వివిధ సేవలు... విదేశాల్లో మరణించిన ప్రవాసాంధ్రులకు మరియు  ఎవరైతే కదలలేని స్థితిలో నిస్సహాయంగా ఉన్నారో అలాంటి వారికి సహాయంగా ఒక సహాయకుడిని ఇచ్చి ఉచిత అంబులెన్స్ సేవ అందించడం, ప్రవాసాంధ్రుల కుటుంబ ఆర్ధిక భద్రతలో భాగంగా ప్రవాసాంధ్ర భరోసా బీమా అందించడం,  అభ్యర్థులకు శిక్షణా కార్యక్రమాలు-ఉద్యోగావకాశాలు కల్పించడం, ప్లేస్ మెంట్ డ్రైవ్స్ నిర్వహించడం, దేవాలయాల దర్శనం కల్పించడం, విద్యావాహిని ద్వారా విదేశాల్లో విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీ ల గురించి తెలియజేయడం తదితర కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఈ వై ఎస్ ఆర్  ప్రవాసాంధ్ర సేవా కేంద్రంలో  లభిస్తాయని,  ప్రధాన కార్యాలయం రాలేని వారికి, రాయలసీమ ప్రాంత వాసులకు ఈ కేంద్రం అందుబాటులో ఉంటుందని సొసైటీ  అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారు తెలిపారు.  ప్రవాసాంధ్రులకు తమ సేవా కార్యక్రమాలను అందిస్తూ,  అందరికి అందుబాటులో ఉండే  విధంగా ఏర్పాటు చేసిన ప్రవాసాంధ్ర సేవా  కేంద్రం సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని  కడప పార్లమెంట్ ఇంచార్జి మరియు కడప మాజీ మేయర్ శ్రీ కె .సురేష్ బాబు  సూచించారు. రాజంపేట డిఎస్పీ శ్రీ నారాయణ స్వామి రెడ్డి  గారు  మాట్లాడూతూ  విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఈ  కేంద్రం ని సంప్రదించాలని, సొసైటీ సేవలలో  అవసరమైన సహాయ సహకారాన్ని  పూర్తి స్థాయిలో అందిస్తామని తెలిపారు . ఆర్ డీ ఓ శ్రీ పి. ధర్మారెడ్డి  గారు మాట్లాడుతూ  ప్రవాసాంధ్రులు ఎదుర్కొనే సమస్యలకు   ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ అందించే సహకారానికి తోడుగా,  మా విభాగం నుండి కావలసిన సహాయం  ఎల్లవేళలా  ఉంటుందని అన్నారు.   ఈ కార్యక్రమానికి పలువురు ప్రవాసాంధ్రులు,  జిల్లా వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు,  ఏ‌పి‌ఎన్‌ఆర్‌టి‌ఎస్ సిబ్బంది హాజరయ్యారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image