అరెస్టులతో ఆందోళనలను అణచివేయలేరు:పోతిన మహేష్

*అరెస్టులతో ఆందోళనలను అణచివేయలేరు* 
అమరావతి నుంచి రాజధానిని అప్రజాస్వామిక రీతిలో తరలిస్తుంటే రైతాంగం ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తోంది. వారికి బాసటగా నిలిచిన జనసేన నాయకులను పోలీసు యంత్రాంగం గృహ నిర్భందాలు చేసి, అరెస్టులు చేసి శ్రేణులను భయభ్రాంతులకు లోను చేయాలని చూస్తున్నారు. ఈ రోజు రైతులు చేపట్టిన జాతీయ రహదారుల దిగ్భందనానికి మద్దతు పలికిన జనసేనపై పోలీసులు చేపట్టిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ బోనబోయిన శ్రీనివాస యాదవ్ గృహ నిర్బంధంలో ఉంచారు. పార్టీ కార్యదర్శి శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ ను తెల్లవారుజామునే పోలీసులు వెళ్లి కారణం చెప్పకుండా పోలీస్ స్టేషన్ కు తరలించారు. నాయకులను నిర్బంధించడం ద్వారా రైతులను, మా పార్టీ శ్రేణులను భయపెట్టాలని చూస్తున్నారా? అరెస్టులతో ఆందోళనలు అణచివేయలేరని ప్రభుత్వం గ్రహించాలి. ప్రశ్నించే పార్టీ మాది. ధర్మం వైపు నిలుస్తాం. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్న రైతులను నిర్భంధించడాన్ని తప్పుబడుతున్నాం. మా నాయకులను, రైతులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
-  పోతిన మహేష్, 
అధికార ప్రతినిధి, జనసేన


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు