రాజకీయ భిక్షపెట్టిన వారిని విమర్శించడం మీ నీచ వ్యక్తిత్వానికి నిదర్శనం

తేది. 30-01-2020
పత్రికా ప్రకటన
రాజకీయ భిక్షపెట్టిన వారిని విమర్శించడం మీ నీచ వ్యక్తిత్వానికి నిదర్శనం
                                    -డోలా బాల వీరాంజనేయ స్వామి
    తిన్నింటి వాసాలు లెక్కపెట్టే కారం శివాజీ లాంటి వ్యక్తులు కూడా రాజకీయం గురించి, విలువల గురించి మాట్లాడటం సిగ్గు చేటు. పాముకు పాలుపోసి పెంచినా.. కాటు వేయాలనే ఆలోచనతోనే ఉంటుంది. మీకు రాజకీయ భిక్ష పెట్టి, కీలక పదవిలో కూర్చోబెట్టిన తెలుగు దేశం పార్టీపై విమర్శలు చేయడం హేయం. బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని తపించేవారిలో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ముందు వరుసలో ఉంటుంది. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ పదవిని మీకు ఇచ్చారు. కేబినెట్‌ హోదా కల్పించారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని కాదని ఎస్సీ, ఎస్టీ ద్రోహి అయిన జగన్మోహన్‌ రెడ్డి పంచన చేరిన నాడే నీ వ్యక్తిత్వం ఏంటో అర్ధమైంది? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అందలం ఎక్కిస్తే ఆ హోదా నుంచి దించేందుకు జగన్మోహన్‌రెడ్డి అణుక్షణం ప్రయత్నించారు. అయినా మీరు ఆయన పంచ చేరి నీచ రాజకీయాలు చేస్తూ.. మీ విలువలేంటో ప్రజలకు తెలిసేలా చేశారు.


    ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరే మీలాంటి వారు కూడా నీతులు గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు. మీ వ్యక్తిగత హోదా కోసం తప్ప ఎన్నడూ ఎస్సీల అభ్యోన్నతి కోసం కృషి చేయలేదు. ఇప్పుడు కూడా కేవలం అధికారపక్షం నుంచి ఏదో రకంగా లబ్ది పొందాలనే తపన తప్ప ఎస్సీ అభివృద్ధికి కోసం కాదు. దళితుల అభివృద్దే కోరుకుంటే మునుపెన్నడూ చేయనన్ని పథకాలు అమలు చేసి వారి అభ్యున్నతికి పాటుపడిన తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు. అలా కాకుండా పార్టీ మారి మీరేంటో నీరూపించుకున్నారు.


                                        
                                


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image