*08–01–2020*
*అమరావతి*
*అమరావతి: పాక్ జైలు నుంచి విడుదలైన మత్స్యకారులను కలుసుకున్న సీఎం శ్రీ వైయస్.జగన్*
*క్యాంపు కార్యాలయంలో మత్స్యకారులతో సమావేశమైన సీఎం*
*వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్న సీఎం*
*పేరుపేరునా పలకరించిన ముఖ్యమంత్రి*
*బతికినంత వరకూ మీ పేరు చెప్పుకుంటాం: మత్స్యకారులు*
*మీలో ఏదో కనిపించని శక్తి ఉందని, అందుకనే మేం బయటకు రాగలిగామన్న మత్స్యకారులు*
*14 నెలలపాటు పాక్ జైల్లో చిక్కుకున్న మత్స్యకారులు*
*వీరికి ప్రభుత్వం నుంచి రూ. 5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ చెక్కులు పంపిణీ చేసిన సీఎం*
అమరావతి : పాకిస్తాన్ జైల్లో నుంచి విడుదలైన మత్స్యకారులతో సమావేశమైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
పాక్ సరిహద్దుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?: సీఎం
పోర్టు అనేది లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లాల్సి వస్తోంది: సీఎం
మాకు ఫిషింగ్ హార్బర్ నిర్మించి ఇస్తే ఇక్కడే మేం మా కుటుంబాలతో కలిసి ఉంటాం: మత్స్యకారులు
వేటకు వెళ్లిన తర్వాత పట్టే చేపలను బట్టి మాకు కూలీ ఇస్తారు: మత్స్యకారులు
మా ప్రాంతంలో సముద్ర తీరం ఉంది :
కాని 10–15వేల మంది గుజరాత్కు వెళ్లాల్సి వస్తోంది:
జెట్టీలు, ఫిషింగ్ హార్బర్ లేకపోవడం వల్ల మేమంతా గుజరాత్కు వలస వెళ్లి వస్తోంది: మత్స్యకారులు
చేసే పనిని బట్టే మాకు జీతాలు ఇస్తారు :
మాకు మీరు నిజంగా ఊపిరి పోశారు :
బతికినంత వరకూ మీ పేరు చెప్పుకుంటాం:
మీలో ఏదో కనిపించని శక్తి ఉందని, అందుకనే మేం బయటకు రాగలిగామన్న మత్స్యకారులు
మత్స్యకారులకోసం జట్టీలు కట్టించి ఇస్తామన్న సీఎం
భావనపాడు పోర్టు నిర్మాణంకోసం ప్రయత్నాలు చేస్తున్నాం: సీఎం
మత్స్యకారులకోసం ప్రత్యేకంగా ఒక జెట్టీని కేటాయిస్తాం: సీఎం
శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు కోరిన విధంగా మంచి జెట్టీని కట్టిస్తాం: సీఎం
ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేస్తున్నాం: సీఎం
మీరు ఉపాధికోసం వేరే ప్రాంతాలకు వలసవెళ్లకుండా ఈ ఆర్థికసహాయం మీకు ఉపయోగపడుతుంది:
పాకిస్థాన్ జైల్లో ఉన్న మిగిలిన ఇద్దరినీ విడిపించేందుకు ప్రయత్నాలు : సీఎం
అలాగే బంగ్లాదేశ్ జైల్లో ఉన్న 8 మందినీ విడిపించేందుకు ప్రయత్నాలు చేయాలని అధికారులకు సీఎం శ్రీ వైయస్.జగన్ ఆదేశం
*పాకిస్తాన్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల పై నివేదిక*
2018 నవంబరులో చేపల వేటకు వెళ్లి పాకిస్ధాన్ తీర జలాల్లో యాధృచ్చికంగా ప్రవేశించిన 22 మంది మత్స్యకారులు
22 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్న పాక్ కోస్ట్ గార్డు దళం
అరెస్టు అయిన 22 మంది మత్స్యకారుల్లో 15 మంది శ్రీకాకుళం, 5గురు విజయనగరం జిల్లా, 2 తూర్పు గోదావరి జిల్లా వాసులు.
గుజరాత్కు చెందిన చేపలబోట్లలో పనికి వెళ్లి పాకిస్తాన్ కోస్ట్గార్డు దళాలకు చిక్కిన మత్స్యకారులు
జాలర్లు పాకిస్తాన్ అదుపులో ఉన్న విషయాన్ని ధృవీకరించుకున్న అనంతరం వారి విడుదలకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
భారత ప్రభుత్వ విదేశాంగశాఖ, మరియు గౌరవ ప్రధానమంత్రి పలు మార్లు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నిర్భందంలో ఉన్న మత్స్యకారుల విడుదల అయ్యేవరకు వారి కుటుంబాల ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రభుత్వం
1) కుటుంబానికి నెలకు రూ.4500 చొప్పున ఫెన్షన్ మంజూరు
2) ప్రతి కుటుంబానికి నెలకు రూ.2లక్షలు ఎక్స్గ్రేషియా
3) ప్రతి కుటుంబానికి 75శాతం సబ్సిడీపై వలలు, బోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
కేంద్రం ద్వారా మత్స్యకారుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వ నిరంతర విజ్ఞప్తుల ఫలితంగా పాక్ జైల్లో నుంచి మత్య్యకారుల విడుదలకు అంగీకరిస్తూ భారత్ ప్రభుత్వానికి సమాచారమిచ్చిన పాకిస్తాన్ అధికారులు
అరెస్టు కాబడిన 22 మంది మత్సా్యకారుల్లో 20 మందిని 06–01–2020నాడు విడుదల చేసిన పాకిస్తాన్ అధికారులు
భారత్–పాక్ సరిహద్దుల్లోని వాఘా చెక్ పోస్టు వద్ద మత్సా్యకారులను స్వయంగా రిసీవ్ చేసుకున్న రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్ జి సోమశేఖరం