52వ రోజుకి చేరిన రాజధాని రైతుల ఆందోళనలు

52వ రోజుకి చేరిన రాజధాని రైతుల ఆందోళనలు
అమరావతి: రాజధాని రైతుల ఆందోళనలు 52వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 52వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడిలో రైతులు 24 గంటల దీక్షలను కొనసాగిస్తున్నారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.