*17.02.2020*
*అమరావతి*
*రేపు కర్నూలులో సీఎం శ్రీ వైఎస్ జగన్ పర్యటన వివరాలు*
*డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*
*నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన*
► ఉదయం తొమ్మిది గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు బయలుదేరనున్న సీఎం
► 10.30 నిమిషాలకు ఓర్వకల్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న సీఎం
► 11 గంటలకు ఎస్టీబీసీ గ్రౌండ్లో సభా వేదిక వద్దకు చేరుకుని డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆరోగ్యశ్రీ స్మార్ట్ హెల్త్కార్డులను లబ్ధిదారులకు అందజేస్తారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా సబ్ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రధాన మంత్రి వందన యోజనను అమలు చేసినందుకు జాతీయ అవార్డులు పొందిన మెడికల్ అధికారులను సత్కరించనున్నారు.
► 11.20 - 12.50 బహిరంగ సభ
► 1.20 ఓర్వకల్ ఎయిర్పోర్టుకు చేరుకుని.. అక్కడ నుంచి గన్నవరం వెళ్లనున్న సీఎం
► 2.30 గన్నవరం ఎయిర్పోర్టుకు రాక... అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం