*24.02.2020*
*విజయనగరం*
*విజయనగరంలో ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్*
*ముఖ్యమంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలు:*
– *స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పేద కుటుంబంలో ఉన్న వారు పేదరికం దాటి ముందుకు అడుగు వేయలేదు*
*ఈ పరిస్థితి మారాలి*
*అందుకు ఏకైక మార్గం, ఆ పేద కుటుంబం అప్పులపాలు కాకుండా, ఆ కుటుంబం నుంచి ఒక ఇంజనీరు, డాక్టర్ లేదా కలెక్టర్ అయినా కావాలి.*
– *వారూ పెద్ద చదువులు చదవాలి.*
*మంచి ఉద్యోగాలు పొందాలి.*
*వారు సంపాదించిన దాంట్లో కొంత ఇంటికి పంపాలి, అప్పుడే పేదరికం పోతుంది*
– *రాష్ట్రంలో ఇప్పటికీ 33 శాతం నిరక్షరాస్యులున్నారు*
*అదే సమయంలో దేశంలో అది 27 శాతం మాత్రమే,అంటే జాతీయస్థాయి కంటే దిగువన మనం ఉన్నాం*
– *గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) కూడా కేవలం 23 శాతమే ఉంది*
*ఈ పరిస్థితి మారడం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టాం*
*అందులో భాగంగా ఇవాళ ఇక్కడి నుంచి వసతి దీవెన ప్రారంభిస్తున్నందుకు గర్వపడుతున్నాను*
*ఏటా రూ.2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న పేద విద్యార్థులకు రూ.20 వేల వరకు హాస్టల్, మెస్ ఛార్జీల కింద ఇస్తాం*
*జనవరి, ఫిబ్రవరిలో మొదటి వాయిదా కింద రూ.10 వేలు, జూలై, ఆగస్టులో మరో రూ.10 వేలు డిగ్రీ, ఆ పై కోర్సులు అభ్యసించే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తాం*
*వీరే కాకుండా ఐటిఐ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా రెండు విడతల్లో రూ.15 వేలు ఇస్తాం*
*ఒక కుటుంబంలో ఎందరు పిల్లలు చదివినా అందరికీ ఇస్తాం*
*దాదాపు 11.87 లక్షల మంది పిల్లలకు ఒక బటన్ నొక్కగానే, ఆయా మొత్తాల్లో సగం ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా దాదాపు రూ.1100 కోట్లు జమ అవుతాయి*
*వసతి దీవెన కోస ఏటా రూ.2300 కోట్లు ఖర్చు చేస్తుండగా, విద్యా దీవెన కోసం ఏటా మరో రూ.3700 ఖర్చు చేయబోతున్నాం*
*ఇవే కాకుండా అమ్మ ఒడి పథకంలో అక్షరాలా 42 లక్షల మంది తల్లులకు, తద్వారా 82 లక్షల మంది పిల్లలకు మేలు*
*ఆ తల్లుల ఖాతాల్లోకి రూ.15 వేల చొప్పున, రూ.6400 కోట్లు జమ చేశాం*
*ఈ మూడు పథకాలకే రూ.12400 కోట్లు ఖర్చు చేస్తున్నామని గర్వంగా చెబుతున్నాం*
*నాడు–నేడు మనబడి ద్వారా మూడేళ్లలో అన్ని స్కూళ్ల రూపురేఖలు మార్చబోతున్నాం*
*మధ్యాహ్న భోజన మెనూలో పూర్తి మార్పులు*
*దానికి అదనంగా రూ.200 కోట్లు ఖర్చైనా లెక్క చేయకుండా భరిస్తున్నాం*
*నాడు.నేడు మనబడిలో 45 వేల స్కూళ్లు, 471 జూనియర్ కళాళాలలు, 3287 హస్టళ్లు, 148 డిగ్రీ కళాశాలల రూపురేఖలు మారుతాయి*
*దీనికి దాదాపు రూ.13 వేల కోట్లు ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది*
*ప్రతి పిల్లవాడు చదవడమే కాదు, భావి తరంతో పోటీ పడాలి*
*అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియమ్ ప్రవేశపెడుతున్నాం*
*ఇవాళ చదువుకుంటున్న పిల్లలు ప్రపంచంలో పోటీ పడాలి. దీన్ని ఈ ప్రభుత్వం గుర్తించి, అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోంది*
*కానీ ఈ ప్రభుత్వంపై రోజూ కొందరు విమర్శలు చేస్తున్నారు. వారిని ఏమనాలో మీరే ఆలోచించాలి*
*తమను ప్రజలు చిత్తుగా ఓడించారు కాబట్టి, రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోవాలని కోరుకుంటూ డబ్బులు ఇచ్చి మరీ పత్రికల్లో రాయిస్తున్నారు*
*దుష్ప్రచారం చేస్తున్నారు* *ఇటువంటి వారిని ఏమనాలో మీరే ఆలోచించమని కోరుతున్నాను*
*రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయడానికి వీల్లేదని, దాడులు చేస్తున్న మూకలను ఏమనాలి అని చెప్పి, ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను*
*చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 25 లక్షల ఇళ్లస్థలాల పట్టాలు ఇస్తా ఉంటే, ఇక చంద్రబాబు గురించి మాట్లాడుకునే వారే ఉండరనే భయంతో తప్పుడు రాతలు రాస్తున్న ఈ పత్రికలను, తప్పుడు మాటలు చూపిస్తున్న ఈ ఛానళ్లను ఏమనాలో ఒక్కసారి ఆలోచించాలని మిమ్మల్నందరినీ కోరుతున్నాను*
*ఇంగ్లిష్ మీడియమ్కు, వేర్వేరుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ఏర్పాటు చేసి వారి జీవితాలు బాగు చేయడం కోసం ఇంకా ఫోకస్డ్గా అప్రోచ్ తీసుకోవడానికి.. ఇటు వంటి వాటికి కూడా చివరకు.. స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషాలో సీట్లు పెంచడానికి కూడా అడ్డు పడుతున్న ఇటువంటి వారిని ఏమనాలో ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతా ఉన్నాను*
*ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నా కూడా చరిత్రలో అతి గొప్ప మెజారిటీతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం*
*ప్రజలు ఇచ్చిన బలంతో, దేవుడి దయతో ఇక మీదట కూడా ముందడుగులు వేస్తామని ఈ వేదిక నుంచి మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను*
*ఇంటింటా చదువులు, అందరికీ ఆరోగ్యం, అన్ని ప్రాంతాలకు నీళ్లు, రైతన్నలకు ఆనందం, ఉద్యోగాలు–ఉపాధి.. ఈ లక్ష్యాల సాధనే లక్ష్యంగా ప్రభుత్వాన్ని గొప్పగా నడిపేట్టుగా మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతా ఉన్నాను*
*దేవుడి దయ చాలా కావాలి. ఎందుకంటే రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం*
*ఏ తప్పూ చేయకపోయినా కూడా, ఏదేదో జరిగి పోతున్నట్లుగా విపరీతమైన రాతలు. విపరీతంగా చూపిస్తున్న టీవీ ఛానళ్లు*
*యుద్ధం చేస్తా ఉన్నది ఒక్క ప్రతిపక్షంతోనే కాదు. ఒక ఉన్మాదులతో యుద్ధం చేస్తా ఉన్నాం*
*ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్*