సీఎం జగన్‌తో అంబానీ భేటీ.. ముఖ్యంగా ఆ స్థలంపైనే.

సీఎం జగన్‌తో అంబానీ భేటీ.. ముఖ్యంగా ఆ స్థలంపైనే..?
అమరావతి : సీఎం జగన్‌తో రిలయెన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భేటీ ముగిసింది. రాష్ట్రంలో పెట్టుబడులపై సుమారు గంటా 40 నిమిషాల పాటు సీఎం జగన్‌తో ముఖేశ్ అంబానీ చర్చించారు. అనంతరం ముఖేష్ అంబానీ గన్నవరం ఎయిర్ పోర్టు‌కు బయలుదేరి వెళ్లారు. సీఎంను ముఖేశ్ అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్, రాజ్యసభ సభ్యులు పరిమల్ నత్వానీ, విజయసాయిరెడ్డి కలిశారు.  కాగా  రిలయెన్స్ గ్రూపు అధినేత ముఖేశ్ అంబానీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిగూడెంలోని ఆయన నివాసంలో కలిశారు. తిరుపతిలో రిలయెన్స్ ఏర్పాటు చేసే స్థలం వివాదంలో ఉంది. ఈ స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలంలోని కొంత భాగాన్ని ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రిలయెన్స్ తన పెట్టుబడులను ఉపసంహరించుకుంటుదని కూడా విసృతంగా ప్రచారం జరిగింది. ఈ తరుణంలోనే ముఖేశ్ అంబానీతో మాట్లాడాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇందుకోసం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ముఖేశ్ అంబానీకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులతో చర్చించారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి రావాలని ఆహ్వానం ఇచ్చారు. ముఖేశ్ అంబానీ పర్యటనను శనివారం మధ్యాహ్నం వరకు కూడా చాలా రహస్యంగా ఉంచారు. ముఖేశ్ అంబానీ విజయవాడ వస్తున్న విషయం ఎవరికీ తెలియనివ్వలేదు. గన్నవరం ఎయిర్ పోర్టుకు రాజ్యసభ్యుడు విజయసాయిరెడ్డి వెళ్లారు. ఈ న్యూస్‌కు సంబంధించి వివరాలను వైసీపీకి చెందిన మీడియాకు తప్ప మరే ఇతర మీడియాకు కూడా సమాచారం ఇవ్వలేదు. అయితే ముఖేశ్ అంబానీని తాడేపల్లికి తీసుకురావడం, ఆయనతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చర్చలు జరపడం, రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానించడం జరిగింది. పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా ముఖేశ్‌కు జగన్ వివరించారు. మూడు రాజధానుల విషయంపై కూడా వీరి మధ్య చర్చకొచ్చినట్లు తెలిసింది.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు