గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కృషి

గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కృషి
* తిరుపతిలో జాతీయ గిరిజన సాంస్కృతికోత్సవాలు 
* గోడ పత్రికను ఆవిష్కరించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ (అవంతి శ్రీనివాస్)
అమరావతి: రాష్ట్రంలో గిరిజనుల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) అన్నారు. సచివాలయంలో మంత్రి తన కార్యాలయంలో శుక్రవారం జాతీయ గిరిజన సాంస్కృతికోత్సవ వేడుకల గోడపత్రికను ఆవిష్కరించి విడుదల చేశారు. రాష్ట్ర గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో తిరుపతి ఎస్.వి. యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో ఈ నెల 22, 23 తేదీల్లో  వేడుకలు  వైభవంగా జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హాజరవుతున్నట్లు గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్ నాయక్ వెల్లడించారు. గతంలో ఏ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి పని చేయలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిరిజన సామాజిక వర్గాల పట్ల ఎనలేని ప్రేమాభిమానాలు చాటారని మంత్రి  అవంతి శ్రీనివాస్ వివరించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌తో పాటుగా రాష్ట్ర పంచాయితీరాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిలతో సహా పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. గిరిజనులకు తొలిసారిగా ఉపముఖ్యమంత్రి పదవితో పాటు తమ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు గిరిజన సంక్షేమ శాఖను అప్పగించడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో గిరిజన ఎమ్మెల్యేలు, ఒక ఎండి పదవిని కట్టబెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్వదా రుణపడి ఉంటామని కొనియాడారు. ఈ జన్మలో గిరిజనులంతా సీఎం జగన్‌కు కట్టుబడి పనిచేస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాంస్కృతిక, యువజన, క్రీడలు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ఎండీ ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు జి. మల్లిఖార్జున నాయక్, రాష్ట్ర నాయకులు డి.భాస్కర్ నాయక్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image