జగనన్న విద్యా, వసతి దీవెనలకు అర్హుల జాబితా విడుదల*

*జగనన్న విద్యా, వసతి దీవెనలకు అర్హుల జాబితా విడుదల* వింజమూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సం క్షేమ శాఖ వారిచే ఇవ్వబడుతున్న జగనన్న విద్యా దీవెనకు సంబంధించి 920 మంది విధ్యార్ధులను అర్హులుగా ప్రకటించినట్లు యం.పి.డి.ఓ కనకదుర్గా భవాని పేర్కొన్నారు. విద్యా దీవెన అర్హత కలిగిన విధ్యార్ధులందరికీ ఫీజు రీయంబర్స్ మెంట్ పూర్తి స్థాయిలోనూ, జగనన్న వసతి దీవెన పధకం క్రింద భోజన, వసతి ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి చెల్లింపులు జరుగుతాయన్నారు. ఇందుకు సంబంధించి అర్హులైన విధ్యార్ధుల జాబితాలను మండలంలోని అన్ని గ్రామ సచివాలయాలకు పంపడం జరిగిందన్నారు. ఈ నెల 24 వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి. చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా అర్హులైన విధ్యార్ధులకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కనుక విధ్యార్ధులు, వారి తల్లిదండ్రులు హాజరై ఈ కార్డులను అందుకోవాలని యం.పి.డి.ఓ కనకదుర్గా భవాని కోరారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు