తనిఖీలలో పట్టుబడ్డ వాహనాలు బహిరంగ వేలం

తనిఖీలలో పట్టుబడ్డ వాహనాలు బహిరంగ వేలం
* డిటిసి ఎస్.వెంకటేశ్వరరావు వెల్ల‌డి
విజ‌య‌వాడ‌: తనిఖీలలో పట్టుబడ్డ వాహనాలను ఈ నెల 26, 27 తేదీల్లో బహిరంగ వేలం నిర్వహించనున్న‌ట్లు జిల్లా డిటిసి ఎస్,వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక డిటిసి కార్యాలయంలో సోమవారం నాడు డిటీసీఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వాహనాల తనిఖీల సమయంలో రికార్డులు చూపని వాహనాలపై కేసులు నమోదు చేసి  వాహనాలను సీజ్ చేయ‌డం జరిగిందని, వాహన యజమానులకు నోటీసులు ఇచ్చాన కూడా ఎటువంటి స్పందన రాలేదని, అటువంటి వాహనాలను ఈ నెల 26, 27తేదీల్లో బహిరంగ వేలం నిర్వహించనున్నామని డిటీసీ తెలిపారు. ఉయ్యూరు ఆర్టీసీ డిపోలో సీజ్ చేసిఉన్న 24 వాహనాలను 26న, ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో సీజ్ చేసిఉన్న 30 వాహనాలను 27న సీజ్ చేసి ఉంచిన ప్రాంతంలోనే రెండుచోట్ల వేలం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వేలంపాటలో పాల్గొనేవారు ధరావత్తు సొమ్ముగా రూ.5 వేలు వాహనాల వేలానికి ముందు సమయంలో చెల్లించాలన్నారు. వాహనాలు ఎక్కువ మొత్తంలో ఎవరైతే వేలం పాటలో పాడుకుంటారో వారు అదేరోజు మొత్తం సొమ్మును చెల్లించాలన్నారు. ఈ వాహనాలకు వ్యాట్ పన్ను కూడా వర్తిస్తుందని  ఆయన తెలిపారు. నిర్బంధించిన వాహనాలకు చెల్లించాల్సిన మొత్తం సొమ్మును వాహన యజమానులు మంగ‌ళ‌వారంలోగా చెల్లించినట్లైతే  అటువంటి వాహనాలను వేలంపాట నుండి తొలగించడం జరుగుతుందని ఆయన తెలిపారు. లేనిపక్షంలో యధావిధిగా బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు