పన్నుల వాటా కుదింపు

కేంద్రం ధోకా
పన్నుల వాటా కుదింపు
రావాల్సింది రూ.19,718 కోట్లు...
కేటాయించింది రూ.15,987 కోట్లే
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజం
 హైదరాబాద్‌ :తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోతలు విధించింది. కేంద్ర అసమర్థత వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు ఎలాంటి నిర్ణయాలనూ బడ్జెట్‌లో ప్రకటించలేదు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించలేదు. ముఖ్య రంగాలకు నిధులు తగ్గించడం వల్ల సామాజికాభివృద్ధి దెబ్బతింటుంది.
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గించడం వల్ల అన్ని రాష్ట్రాలకూ నష్టం కలుగుతుంది. జీఎస్టీ చట్టం అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు. 14 శాతం ఆదాయ వృద్ధిరేటు లేని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందిస్తామనే చట్టం హామీని కేంద్రం తుంగలో తొక్కింది’
ప్రతి సందర్భంలోనూ బడ్జెట్లో ప్రకటించిన అంచనాల ప్రకారమే రాష్ట్రాలకు పన్నుల్లో వాటా చెల్లిస్తారు. ఒకటీ అరా శాతం అటూ ఇటు అయిన సందర్భాలున్నాయి.  2019-20 సంవత్సరంలో మాత్రం ఏకంగా 18.9 శాతం తగ్గుదల రావడం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో లోపానికి నిదర్శనం. ఇది తెలంగాణపై ప్రభావాన్ని చూపింది’
- సీఎం కేసీఆర్‌
కేంద్ర బడ్జెట్‌(2020-21)లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర వినతులు, అవసరాలను ఏ మాత్రం పరిగణనలోనికి తీసుకోలేదని, రావాల్సిన నిధుల్లో భారీ కోతలు విధించి వివక్ష చూపిందని మండిపడ్డారు. కేంద్ర పన్నుల్లో రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమని విమర్శించారు. కేంద్ర నిర్ణయాలు తెలంగాణ పురోగతికి శరాఘాతంగా మారనున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. కేంద్రం మాట నమ్మితే శంకరగిరి మాన్యాలే దిక్కయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణకు సంబంధించిన, రాష్ట్రంపై ప్రభావం చూపే అంశాలపై ఆయన ప్రగతిభవన్‌లో నాలుగు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక సలహాదారు జీఆర్‌ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్‌, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేంద్ర బడ్జెట్‌పై తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ‘కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రాజ్యాంగ పరమైన హక్కు. దీనికింద తెలంగాణకు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.19,718 కోట్లు రావాల్సి ఉంది. గత ఏడాది బడ్జెట్లో ఈ మొత్తాన్ని రాష్ట్రానికి అందిస్తామని కేంద్రం ప్రకటించింది. సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.15,987 కోట్లకు కుదించారు. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.3,731 కోట్లు తగ్గాయి. రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక తారుమారైంది. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా తగ్గించడం కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అసమర్థతే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పన్నులు వసూలు చేసి.. రాష్ట్రాలకు నిధులు సమకూర్చాల్సి ఉంది.
మాటలకు చేతలకు పొంతన లేదు
2019-20 ఆర్థిక సంవత్సరంలోనే కేంద్ర పన్నుల్లో తెలంగాణకు ఇస్తామని పార్లమెంటులో ప్రకటించిన వాటాలో రూ.3,731 కోట్లు తగ్గించిన కేంద్రం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.16,726 కోట్లు ఇస్తామని ప్రతిపాదిస్తోంది. ఈ సారి కూడా అంచనాలు సవరించే నాటికి చెప్పిన దాంట్లో ఎంత తగ్గిస్తారో తెలియదు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా విషయంలో కేంద్రం చెప్పిన మాటకు, ఇచ్చే నిధులకు సంబంధం లేకుండా పోతోంది. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలను చేపట్టిన తెలంగాణకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సులు చేసింది. వీటిని అమలు చేయాలని కేంద్రానికి అనేక సార్లు విన్నవించాం. అయినా పట్టించుకోలేదు. ఈ ఏడాది బడ్జెట్లో కూడా దాని ఊసులేదు.
జీఎస్టీ విషయంలోనూ మోసం
జీఎస్టీ విషయంలో కూడా కేంద్రం పెద్ద మోసం, దగా చేస్తోంది. 14 శాతం లోపు ఆదాయ వృద్ధి రేటు కలిగిన రాష్ట్రాలకు ఏర్పడే లోటును ఐదేళ్ల పాటు భర్తీ చేస్తామని 2017లో తెచ్చిన జీఎస్టీ చట్టంలో చెప్పారు. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి జీఎస్టీ పరిహారంగా ఇంకా రూ.1,137 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఈ నిధులను విడుదల చేసే విషయంలో స్పష్టత ఇవ్వలేదు.
పట్టణాలకూ తగ్గుదలే
కేంద్ర బడ్జెట్లో పట్టణాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో భారీ కోత పెట్టారు. దీనివల్ల శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుంది. పట్టణాల అభివృద్ధికి 2019-20 బడ్జెట్లో రూ.1,037 కోట్లు కేటాయించారు. 2020-21 బడ్జెట్‌లో గత ఏడాదికన్నా రూ.148 కోట్లు తగ్గించి, కేవలం రూ. 889 కోట్లు మాత్రమే కేటాయించారు. పట్టణాభివృద్దికి ఇచ్చే నిధుల్లో 14.3 శాతం కోత పెట్టారు.
ప్రాజెక్టులకు మొండిచేయి
తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు భారీ వ్యయంతో కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు నిర్మించాం. వాటి నిర్వహణకు కూడా పెద్ద ఎత్తున ఖర్చవుతుంది. ఇందులో కేంద్ర సహకారం కావాలని అభ్యర్థించాం. కానీ కేంద్రం నిధులు కేటాయించలేదు. రాష్ట్రం అమలు చేస్తున్న అనేక ప్రజోపయోగ కార్యక్రమాలకు ఆర్థిక చేయూత ఇవ్వాలని కేంద్రాన్ని కోరినా, బడ్జెట్లో ఎక్కడా తగిన కేటాయింపులు చేయలేదు.’
రెండు రకాలుగా నష్టం
2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రతిపాదనల్లో కూడా తెలంగాణకు వచ్చే నిధుల్లో రెండు రకాల నష్టం వాటిల్లింది.
* ఒకటి.. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గిస్తూ 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించడం.
* రెండోది.. తెలంగాణ రాష్ట్రానికి గతంలో 2.437 శాతం వాటాను ఇవ్వగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ వాటాను 2.133 శాతానికి తగ్గించారు. దీనివల్ల రాష్ట్రానికి  రూ.2,381 కోట్లు తగ్గనున్నాయి.
కేంద్ర కేటాయింపుల్లో రంగాల వారీగా కోతలు
* వ్యవసాయరంగానికి 2019-20 బడ్జెట్‌లో 3.65 శాతం మేర నిధులు కేటాయించగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో అది 3.39శాతం మాత్రమే.
* వైద్య ఆరోగ్య రంగానికి గతేడాది 2.24 శాతం...ఈ ఏడాది ఇస్తామంటుంది 2.13 శాతమే.
* గ్రామీణాభివృద్ధికి గత ఏడాది 4.37 శాతం.. ఈ ఏడాది 3.94 శాతం మాత్రమే.
* విద్యా రంగానికి గత ఏడాది 3.37 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 3.22 శాతం నిధులు మాత్రమే ఇస్తామంటున్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image