రాష్ట్ర మహా సభలను విజయ వంతం చేయండి

*రాష్ట్ర మహా సభలను విజయ వంతం చేయండి*


*ఇప్పటికే అందరికి అక్రిడిటేషన్ లు ఇచ్చాం, ఇళ్ళ స్థలాలు వచ్చేలా కృషి చేస్తా* 


*ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడి*


తూప్రాన్, మార్చి, 2.


మార్చి 8న ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే  టియుడబ్ల్యుజె హెచ్ 143 రాష్ట్ర మహా సభలను విజయవంతం చేయాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. సోమవారం తూప్రాన్ లో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి జర్నలిస్ట్ ల  సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సమావేశానికి  తూప్రాన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆంజనేయులు అధ్యక్షత వహించగా రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో 35 కోట్లు మంజూరు కాగా 259 కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడంతో పాటు నెలకు 3 వేలు ఫెంషన్, పిల్లల చదువుకు 5 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు ఉద్యమించామని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా జర్నలిస్ట్ నాయకుడైన తనకు అవకాశం కల్పించారని అన్నారు. 
ఈ సమావేశంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ వైస్ ఛైర్మన్ నందాల శ్రీనివాస్, యూనియన్  రాష్ట్ర నాయకులు మారుతి సాగర్, ఇస్మాయిల్, యూసుఫ్ బాబు, రమణ, యోగి, సీఆర్.జానకిరామ్, విష్ణు వర్ధన్ రెడ్డి, వర్దెల్లి వెంకన్న, జీ.యాదగిరి గౌడ్, ధారా సింగ్, భిక్షపతి తో పాటు తూప్రాన్ ప్రెస్ క్లబ్ నాయకులు పంజాల ఆంజనేయులు గౌడ్, దమ్మన్నగారి కృష్ణ, జీ.భాస్కర్, ఐ. రవిందర్, టి.నాగరాజు, కె.వేణు గోపాల్, పెద్దిగారి నగేష్ గుప్త, చెలిమేల నాగరాజు, గడ్డం ప్రశాంత్, చెంది శ్రీనివాస్, నర్సింహ్మ రెడ్డి, శివ కృష్ణ గౌడ్, రాజశేఖర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image