విదేశాల నుండి వచ్చిన వారు 14 రోజులపాటు విధిగా హోం ఐసోలేషన్లో ఉండాలి

పత్రికా సమావేశం
తేది: 13.03.2020
అమరావతి


విదేశాల నుండి వచ్చిన వారు 14 రోజులపాటు విధిగా హోం ఐసోలేషన్లో ఉండాలి


• కరోనా నియంత్రణకు వ్యక్తిగత శుభ్రత, హోం క్వారంటైన్ పాటించడం మార్గం


• ఫిబ్రవరి 10 తర్వాత విదేశాల నుండి వచ్చినవారి గుర్తింపునకు ఇంటింటా సర్వే


• కరోనా లక్షణాలు కనపడితే 104 హెల్ప్ లైన్,0866-2410978 కాల్ సెంటర్ కు తెలియజేయండి


• కరోనా పరీక్షలకై తిరుపతి,విజయవాడల్లో లేబరేటరీలు సిద్ధం


•  ప్రభుత్వాసుపత్రుల్లో 300,ప్రవేట్ ఆసుపత్రుల్లో 350 ఐసోలేషన్ వార్డులు,పడకలు: వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సిఎస్ జవహర్ రెడ్డి


అమరావతి,13 మార్చి: రాష్ట్రంలో కరోనా వైరస్(కోవిద్-19) నియంత్రణకు ప్రభుత్వం అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి వెల్లడించారు.కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం అమరావతి సచివాలయంలోని నాల్గవ భవనం ప్రచార విభాగంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రస్తుతం కోవిద్ 118 దేశాలకు విస్తరించిందని ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా లక్షా 25వేల 48 కరోనా కన్ఫార్డ్  కేసులు నమోదు కాగా 4 వేల 613 మంది చనిపోయారని తెలిపారు. కాగా భారతదేశంలో ఇప్పటి వరకూ 14 రాష్ట్రాలు,దేశ రాజధాని ఢిల్లీ సహా 3కేంద్రపాలిత ప్రాంతాల్లో 73 కరోనా కన్ఫార్మ్డ్ కేసులు నమోదయయ్యాయని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నెల్లూరులో ఇటలీ నుండి వచ్చిన ఒక వ్యక్తికి పాజిటివ్ కేసు నమోదు అయిందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు చేపట్టిందని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులతో వీడియో సమావేశాలు, సమీక్షలు నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. జనవరి 28 నుండి విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకులను విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కడప తదితర విమానాశ్రయాలు, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవుల్లో ధర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారని వివరించారు. అంతేగాక రాష్ట్ర స్థాయిలో 0866-2410978 నంబరుతో కూడిన 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడంతో పాటు 104 నంబరుతో కూడిన హెల్ప్ లైన్ ను కూడా అందుబాటులోకి తేవడం జరిగిందని ఆయన మీడియాకు వివరించారు.


కరోనా పరీక్షల నిర్వహణకై తిరుపతిలోని స్విమ్స్ లోను, విజయవాడలోను రెండు ల్యాబ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని మరో వారం రోజుల్లో కాకినాడలో కూడా ల్యాబ్ అందుబాటులోకి రానుందని జవహర్ రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ప్రవేట్ ఆసుపత్రుల్లో 56 ఐసోలేషన్ వార్డులు, 428 ప్రత్యేక పడకలు ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.అంతేగాక జిల్లాకు ఒకటి వంతున 13జిల్లా ర్యాపిడ్ రెస్పాన్స్  టీంలను, 13 అంబులెన్సులను అందుబాటులో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తిరుపతిలో 500 పడకలతోను, విశాఖపట్నంలో 200 పడకలతో కూడిన క్వారైంటైన్ సౌకర్య కేంద్రాలు ఏర్పాటుకు గుర్తించి తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.కాగా ఇప్పటి వరకూ 55మంది నుండి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పూణే లోని ల్యాబ్ కు పంపగా వాటిలో 47 నెగెటివ్ ఫలితాలు రాగా నెల్లూరుకు చెందిన ఒక వ్యక్తికి పాజిటివ్ రాగా మరో 7శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు.కాగా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇటలీ నుండి రాగా అతనిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో చేర్చి తగిన వైద్య చికిత్సలు అందిస్తుండగా ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని 14 రోజుల పర్యవేక్షణ అనంతరం పూర్తిగా కోలుకున్నాక అతనిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.ఆవ్యక్తి ఐదుగురు వ్యక్తులను కలవగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని గుర్తించి ఆసుపత్రి క్వారంటైన్ అబ్జర్వేషన్లో ఉంచడం జరిగిందన్నారు. 


ఫిబ్రవరి 10 తర్వాత విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించేందుకు రాష్ట్రంలోని కోటి 40లక్షల కుటుంబాలను ఇంటింటా సర్వే ప్రక్రియ చేపట్టగా ఇప్పటికే 89వేల కుటుంబాల సర్వే పూర్తికాగా 3వేల మంది వరకూ విదేశాలకు వెళ్లి వచ్చినట్టు గుర్తించడం జరిగిందని జవహర్ రెడ్డి వెల్లడించారు. ఆవిధంగా గుర్తించిన వారికి కరోనా లక్షణాలేమైనా ఉన్నాయా అనేదానిపై పరిశీలన చేసి వారిని 14రోజుల పాటు ఇంటిలోనే ఉండి కుటుంబ సభ్యులు సహా ఎవరినీ కలవకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేలా సూచించడం జరుగుతోందని తెలిపారు. అంతేగాక వారు తినే ఆహారం ,వాడే వస్తువులు తదితరమైనవన్నీ వారే సక్రమంగా డిస్పోజ్ చేసుకోవాలని ఎవరికైనా దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి కరోనా లక్షణాలు కనపడితే వెంటనే 104 హెల్ప్ లైన్లో అందుబాటులో ఉన్న డాక్టర్ ను సంప్రందించాలని సూచించామని చెప్పారు.
కరోనా వైరస్ ముందు జాగ్రత్త చర్యల్లో ప్రజలు చేయదగిన చేయకూడని(Do’s&Dont’s) చర్యల్లో భాగంగా ప్రజలు విదేశాల నుండి వచ్చిన వారి బంధువులను దగ్గరగా వచ్చి కలవడం కొంత కాలం వరకూ చేయవద్దని జవహర్ రెడ్డి హితవు చేశారు.అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం చేయవద్దని ఒకవేళ దగ్గు, తుమ్ములు వంటివి వచ్చినపుడు చేతి రుమాలుతో ముక్కును మూసుకుని మాత్రమే దగ్గడం,తుమ్మడం చేయాలని తరచూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని ఆయన సూచించారు.


ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఇన్చార్చి కమిషనర్ వి.విజయరామరాజు, వైద్య ఆరోగ్యశాఖ సంచాలకురాలు డా.అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.


 


Popular posts
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image