క్యాంటీన్ ను మర్చి 31వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేత. 


తేది:20.03.2020


• కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ముందు జాగ్రత్తగా ఎపి/టీఎస్ భవన్ లోని క్యాంటీన్ ను మర్చి 31వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేత. 


• కోవిద్ - 19 (కరోనా వైరస్ కంట్రోల్ కు, ప్రజల సహాయార్ధం ఎపి భవన్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు.  : ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీమతి భావన సక్సేనా   


న్యూ ఢిల్లీ, మార్చి 20, 2020:    జాతీయ విపత్తుగా పరిణమించిన "కోవిద్ - 19" (కరోనా వైరస్) వ్యాప్తిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్ లలో నిర్వహిస్తున్న క్యాంటీన్ ను ముందు జాగ్రత్త చర్యగా ఈనెల 20వ తేదీ శుక్రవారం సాయంత్రం నుంచి 31వ తేదీ మంగళవారం వరకు నిరవధికంగా మూసివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ శ్రీమతి భావన సక్సేనా ఒక ప్రకటనలో తెలిపారు.  


ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ముందు జాగ్రత్త చర్యగా ఎపి భవన్ లోని సాయి కేటరర్స్ క్యాంటీన్ ను తక్షణమే మూసివేస్తున్నట్లు ఎపి భవన్ రెసిడెంట్ కమిషనర్ పేర్కొన్నారు.  ఇందుకు ప్రజలు, దేశ రాజధానిలో వివిధ పనుల నిమిత్తం వచ్చే అధికారులు, సిబ్బంది సహకరించి, కరోనా వైరస్ నిర్మూలనకు తమ వంతు సహకారాన్ని అందించాలని ఆర్సీ శ్రీమతి భావన సక్సేనా విజ్ఞప్తి చేశారు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్ లకు అనుబంధంగా ఉన్న అతిధి గృహాలలో బస చేస్తున్నవారికి అల్పాహారం, భోజన వసతిని వారివారి రూములకే పార్సిల్స్ ద్వారా అందజేయుట జరుగుతుందని, ఇందుకు క్యాంటీన్ వారికీ, భవన్ సిబ్బందికి తగు ఆదేశాలు జరీ చేసినట్లు చెప్పారు.  అల్పాహారం, భోజనం కొరకు నిరంతరం వస్తున్న ప్రజలకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని, కరోనా వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.    


ఇరు భవన్ ల ప్రాంగణాలలో నివసిస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వివిధ పనుల నిమిత్తం ఢిల్లీ కి వచ్చి ఎపి/టిస్ భవన్ల అతిధి గృహాలలో విడిది చేస్తున్న వారు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించుటతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టి, నిర్మూలించేందుకు చేస్తున్న సూచనలను తూ.చా తప్పక పాటించి తమ ఆరోగ్యాలను, తోటి ప్రజల ఆరోగ్యాలను కాపాడటంలో తమవంతు సహకారాన్ని అందించాలని .


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు