ఈనెల 31 వరకు రాష్ట్రమంతా లాక్‌డౌన్‌

*22.03.2020*
*అమరావతి*


*తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసులో మీడియాతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌:*


*ఈనెల 31 వరకు రాష్ట్రమంతా లాక్‌డౌన్‌*


*ప్రజా రవాణా వ్యవస్థ, ప్రైవేటు వాహనాల నిలిపివేత*


*రాష్ట్ర సరిహద్దుల మూసివేత, ప్రజలు సహకరించాలి*


*అత్యవసర సేవలు, నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి*
*ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు*
*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడి*


*ప్రతీ పేద కుటుంబానికి  ఈనెల 29 నాటికి రేషన్‌ సరుకులు రెడీ*
*కేజీ పప్పుతో పాటు, రేషన్‌ సరుకులు ఉచితంగా ఇస్తాం*
*మరో రూ.1000 ఆర్థిక సహాయం*


*ఏప్రిల్‌ 4న గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఇస్తారు*
*మీడియా సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌*


*సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ – ముఖ్యాంశాలు:*


– దేశంలో కరోనా వ్యాపిస్తోంది. రాష్ట్రం అలాంటి పరిస్థితుల్లోకి పోకుండా కృషి చేసిన గ్రామ వలంటీర్లు, ఆశా వర్కర్లు, వైద్యులు, సిబ్బందికి, ఆ శాఖకు, కలెక్టర్లు, అధికారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు.
– దేశంలో దాదాపు 341 కేసులు నమోదైతే, మరో 5గురు చనిపోతే, మన రాష్ట్రానికి వచ్చే సరికి కేవలం 6 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అందులోనూ ఒక కేసు నయమైపోయి, డిశ్చార్జ్‌ కూడా అయ్యారు.
– విదేశాల నుంచి వచ్చిన 11,670 మందిని ట్రాక్‌ చేయడంతో పాటు, వారిపై నిఘా పెట్టాం.
– 10,091 మందిని ఐసొలేషన్‌లో ఉంచాం. 24 మందికి ఆస్పత్రిలో చికిత్స అందించాం.
– మరో 1550 మందిని హోం ఐసొలైసేషన్‌ లో ఉంచడం జరిగింది.ఐసొలేషన్‌ సెంటర్లు 
                           
*ఐసోలేషన్ సెంటర్లు*   
                                                                                                                                                             – రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో ఐసొలేషన్‌ సెంటర్‌ సౌకర్యం ఏర్పాటు. 
– ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం 200 పడకలతో ఏర్పాటు చేయాలని ఆదేశం.


*విద్యాసంస్ధలు-మాల్స్ మూసివేత*


– ఇప్పటికే విద్యా సంస్థలు, కళాశాలలు మూసివేయడం జరిగింది. ఈనెల 31 వరకు అవి పని చేయవు.
– 10వ తరగతి పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయి.
– అన్ని సినిమా థియేటర్లు, మాల్స్, స్విమ్మింగ్‌ పూల్స్, జిమ్స్, సోషల్‌ ఈవెంట్స్‌ సెంటర్లు కూడా 31 వరకు మూసివేయాలని ఆదేశం.
– పెద్ద పెద్ద ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాల్లో దర్శనాల నిలిపివేతకు ఆదేశాలు జారీ చేశాం.


*రవాణా వ్యవస్థలు*
– ఇప్పటికే 12 రాష్ట్రాలు అంతర్‌రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థను ఆపేశాయి. సరిహద్దులు మూసేశాయి.
– మనం కూడా ఆ దిశలో అడుగులు వేయక తప్పదు. అంతర్‌రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థను ఈరోజు నుంచి నిలిపివేస్తున్నాం.
– ఇందులో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థ కట్టడి. అన్ని సర్వీసులు ఆపేస్తాం.
– ఆటోలు, టాక్సీలను అత్యవసర సర్వీసులకు మాత్రమే వినియోగించాలి. అది కూడా కేవలం ఇద్దరిని మాత్రమే ఎక్కించుకోవాలి.
– రాష్ట్రమంతా లాక్‌డౌన్‌ పరిస్థితి. బట్టలు, నగలు, బంగారం దుకాణాలు (నాన్‌ ఎస్సెన్షియల్‌ షాప్స్‌) కూడా ఈనెల 31 వరకు మూసేయాలని గట్టిగా కోరుతున్నాం.


*ప్రభుత్వ ఉద్యోగులు*
– ప్రభుత్వం కూడా కేవలం స్కెలెటన్‌ స్టాఫ్‌తో రొటేషన్‌ పద్ధతిలో ఉద్యోగులతో పని చేస్తుంది.


*విదేశాల నుంచి వచ్చే వారు పాటించాల్సినవి*
– విదేశాల నుంచి వచ్చే వారందరినీ కూడా కోరుతున్నాం. 
– వారంతా తప్పనిసరిగా 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని గట్టిగా కోరుతున్నాం.


*ప్రజలకు విన్నపం*
– ప్రజలందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రం కూడా రైళ్లను రద్దు చేసింది. 
– ఇప్పటికే 12 రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. మిగిలినవి కూడా రేపటి నుంచి చేయొచ్చు.
– 14 రోజులు చేస్తే, పరిస్థితి చక్కబడుతుంది. అందువల్ల కనీసం ఈనెల 31 వరకు దాన్ని అమలు చేయాల్సి ఉంది.
– ఆ తర్వాత పరిస్థితి, కేంద్రం ఏం చెబుతుందన్నది చూసి నిర్ణయం
– మరీ అవసరమైతేనే బయటకు రండి. అత్యవసరాల కోసం మాత్రమే బయటకు రండి. 
– అలా వచ్చినప్పుడు కనీసం 3 అడుగుల దూరంలో ఉండండి. దీనికి అందరూ సహకరించాలి
– పోలీసు కూడా విదేశాల నుంచి వచ్చిన వారిపై గట్టిగా నిఘా పెడతాం. వారికి పోలీసులను అటాచ్‌ చేస్తాం. 
– పోలీసు స్టేషన్లు కూడా తమ పరిధిలో ఏం జరుగుతుందన్నది చెప్పాలి.
– గ్రామ పోలీసులు కూడా శ్రద్ధ చూపాలి. అందరూ ఇళ్లలోనే ఉండేలా చూడాలి.


*ధరలు పెంచితే కఠిన చర్యలు*
– నిత్యావసరాల ధరలు పెంచవద్దు. అలా పెంచితే కఠిన చర్యలు తీసుకుంటాము. జైలుకు పంపడానికి కూడా వెనుకాడబోము.
– కలెక్టర్లు కూడా దీనికి సంబంధించి ప్రకటన చేస్తారు. సరుకుల ధరలు ప్రకటిస్తారు. కూరగాయలతో సహా.. అన్ని ధరలు ప్రకటిస్తారు.
– ఆ ధరల కంటే ఎవరైనా ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలుంటాయి.
– ఒక టోల్‌ఫ్రీ నెంబరు కూడా ఇస్తారు. దానికి కాల్‌ చేస్తే, పోలీసులు కూడా యాక్టివేట్‌ అవుతారు.


*అసెంబ్లీ కూడా పరిమిత రోజులే*
– 10 మందికి మించి ఎక్కడా గుమి కూడవద్దు.
– నిజానికి అసెంబ్లీ కూడా ఉండొద్దు.
– కానీ బడ్జెట్‌ కోసమే నిర్వహణ. వీలైనంత తక్కువ రోజులు నిర్వహిస్తాము.


*రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి*
– రైతులు, రైతు కూలీలు కూడా వీలుంటే పనులకు వెళ్లకండి.
– ఒకవేళ వెళ్లాల్సి వస్తే 3 అడుగుల దూరం మెయిన్‌టెయిన్‌ చేయండి.                                           *ఎవరూ ఆందోళన చెందవద్దు*
– అత్యవసర, నిత్యావసరాలు.. పెట్రోల్, గ్యాస్, ఔషధాల షాపులు, పాలు, కూరగాయాలు, కిరాణం షాపులు తెరిచే ఉంటాయి.
– ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. 2 శాతం కంటే ఉండదు.
– అది కూడా వయసు ఎక్కువ ఉండడంతో పాటు, తీవ్ర అనారోగ్యం ఉన్న వారే చనిపోతారు.
– 80.9 శాతం ఇళ్లలోనే ఉండి నయం అయ్యారు. కేవలం 13.8 శాతమే ఆస్పత్రికి. అందులో 4.7 శాతమే ఐసీయూలో చికిత్స చేశారు.
– జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్‌ వేగంగా వ్యాపిస్తుంది.


– అవ్వాతాతలు బయటకు వెళ్లొద్దు. 10 ఏళ్లలోపు పిల్లలను బయటకు పంపొద్దు.
– అందరూ కూడా ఈనెల 31 వరకు దయచేసి ఇళ్లలోనే ఉండండి. ఎక్కడికీ కదలొద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
– విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. హోం ఐసొలేషన్‌లో ఉండాలి.


*నిరుపేదలకు సహాయం*
– ఈనెల 29వ తేదీ నాటికి రేషన్‌ పూర్తిగా అందుబాటులో ఉంచుతాం.
– రేషన్‌ సరుకులు ఉచితంగా ఇస్తాం. దాంతో పాటు ఒక కేజీ పప్పు ఉచితంగా ఇస్తాం.
– ప్రతి కుటుంబానికి రూ.1000. ఏప్రిల్‌ 4న గ్రామ వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తాం. 
– దీనికి మాత్రమే దాదాపు రూ.1500 కోట్లు ఖర్చు.


*అందరితో కలిసి అడుగులు*
– ప్రజలు పరిస్థితులను గమనిస్తున్నారు కాబట్టి అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
– అందరం ఒకటి కావాలి. దేశమంతా ఏకమవుతుంది. అందరూ ఒకే రకమైన అడుగులు వేస్తున్నారు.
– అవే అడుగులు మనం కూడా వేయగలిగితేనే దీన్ని ఎక్కడికక్కడ కట్టడి చేయగలుగుతాం.
– కాబట్టి అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు