జగన్ కు 5కోట్ల మంది ఆరోగ్యం కంటే, 5వేలకోట్లే ముఖ్యమయ్యాయి

విలేకరుల సమావేశం వివరాలు (16.03.2020.)


జగన్ కు 5కోట్ల మంది ఆరోగ్యం కంటే, 5వేలకోట్లే ముఖ్యమయ్యాయి


·       ప్రజలప్రాణాలకు హాని లేకుండా చూడటం కోసం ఎన్నికల కమిషనర్ ఎన్నికలు వాయిదావేస్తే, దాన్ని తప్పుపడతారా?


·       నిమ్మగడ్డతో ఒకే కంచం, ఒకే మంచం పంచుకున్నప్పుడు జగన్ కు కులం గుర్తురాలేదా?


·       తన సంస్థల్లో ప్రసాద్ పెట్టుబడులు పెట్టినప్పుడు కమ్మగా ఫీలయిన జగన్ కు, ఎన్నికల కమిషన్ ప్రకటన చలిపుట్టించింది.


·       కడప జిల్లా వ్యాప్తంగా జరిగిన ఏకగ్రీవాలన్నీ అధికారులు, పోలీసుల అండతో, అధికారపార్టీ నేతల బెదిరింపులతో జరిగినవే.     


                      శ్రీ బీ. చెంగల్రాయలు (ఎమ్మెల్సీ)


జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు కులాన్ని ఆపాదించడం, ఎన్నికల కమిషన్ విధులను భూతద్దంలోచూపుతూ, స్వతంత్రబద్దంగా వ్యవహరించే సంస్థను నిలువరించాలని చూడటం సీఎంకు సరికాదని టీడీపీనేత, ఆపార్టీ ఎమ్మెల్సీ బీ.చెంగల్రాయలు హితవుపలికారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించకుండా, వ్యవస్థలను నాశనం చేయడమేగాకుండా, ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేవారిపై నిందలే యడం ముఖ్యమంత్రికే చెల్లిందన్నారు. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంపై కేంద్రప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంటే, అవేమీ తనకు పట్టవన్నట్లుగా ముఖ్యమంత్రి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వేగంగా వ్యాప్తిచెందుతున్న  కరోనా ప్రభావాన్ని గుర్తించి, దానితీవ్రత ఉధృతమవకుండా నిరోధించడంకోసం, ప్రజల ప్రాణాలకు హాని లేకుండా చేయడంకోసం ఎన్నికల కమిషనర్, స్థానిక ఎన్నికలు వాయిదావేస్తే, ఆయన్ని దోషిగా చిత్రీకరించడం జగన్ వంటి అవకాశవాదికే  చెల్లిందన్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అవసరమైనప్పుడల్లా, కులాలప్రస్తావన తీసుకొస్తున్న ముఖ్యమంత్రి జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ ది ఏకులమో, ఆయనద్వారా తన సంస్థల్లోకి పెట్టుబడులుఎలా పెట్టించాడో సీఎం సమాధానం చెప్పాలన్నారు. నిమ్మగడ్డతో కలిసి ఒకే కంచాన్ని, ఒకేమంచాన్ని పంచుకున్న జగన్మోహన్ రెడ్డికి, ఆనాడు గుర్తురాని కులం ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందని చెంగల్రాయలు నిలదీశారు. నిమ్మగడ్డ ప్రసాద్ తన సంస్థల్లో రూ.700కోట్లు పెట్టుబడులు పెట్టినప్పుడు కమ్మగా ఫీలయిన జగన్ కు, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ప్రకటనతో చలి మొదలైందన్నారు. ఎన్నికల కమిషన్  అనేది కళ్యాణ మండపం లాంటిదని, ఎన్నికలు జరిగేటప్పుడు అది కళకళలాడుతుందని, మిగతా సందర్భాలలో వెలవెలబోతుందన్నారు. ఎన్నికల కమిషనర్ ని నియమించేది గవర్నర్ అనే విషయం కూడా తెలియకుండా జగన్ మాట్లాడుతున్నాడన్నారు. కడప జిల్లా కోడూరులో ఒక ఎస్సై, నామినేషన్ వేయడానికి వచ్చిన ప్రతిపక్షపార్టీ అభ్యర్థిని ఎత్తుకెళ్లి బయటపడేశాడని, అతను అంత అత్యుత్సాహం ఎందుకు చూపాడని చెంగల్రాయలు మండిపడ్డారు. నామినేషన్ పత్రాల్లో చిన్నచిన్న తప్పులను పట్టించుకోవాల్సిన పనిలేదని ఎన్నికల కమిషన్ చెప్పినాకూడా, రాష్ట్రంలోని అధికారులు ఆ ఆదేశాలను పట్టించుకోకుండా, కుంటిసాకులు చెబుతూ, అడుగడుగునా ప్రతిపక్షపార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడం జరిగింద న్నారు. నామినేషన్ల అంశంలో పరిశీలన అనే పదానికి తీసేయడమనే అర్థం వచ్చేలా అధికారులు వ్యవహరించారన్నారు. పోలీసులు కూడా అభ్యర్థులను అడ్డుకోవడం, అధికారపార్టీ నేతలుచెప్పినవిధంగా ప్రవర్తించడం జరిగిందన్నారు. అభ్యర్థి, బలపరిచే వ్యక్తి లేకుండానే కడప జిల్లాలో చాలాచోట్ల ఎన్నికల నామినేషన్ ను ముగించారన్నారు. తన సొంత జిల్లాలో జరిగిన అనేక సంఘటనలు, ఎన్నికల్లో గెలుపుకోసం చేసిన ఆకృత్యాలపై జగన్ ఏం సమాధానం చెబుతాడో చెప్పాలన్నారు. కోడూరు మండలం రెడ్డివారిపల్లెలో ప్రతిపక్షపార్టీ అభ్యర్థి ఇంట్లో ఎక్సైజ్ అధికారులే మందుసీసాలు పెట్టారని, ఆ తరువాత డీఎస్పీస్థాయి అధికారి నేరుగా సదరు అభ్యర్థి ఇంటికెళ్లి, నీమీద కేసుపెడతాను..నువ్వు నామినేషన్ వేయడానికి వీల్లేదని అతన్ని బెదిరించడం జరిగిందన్నారు. ఇదేవిధంగా అనేకచోట్ల అభ్యర్థులను పలురకాలుగా బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేసి, ఆస్థానాలను ఏకగ్రీవమైనట్లుగా చెప్పుకోవడం అధికారపార్టీకే చెల్లిందన్నారు. వచ్చిన నామినేషన్లు పరిశీలించి అర్హులెవరో, అనర్హులెవరో తేల్చాల్సిన అర్డీవో స్థాయి అధికారులు కూడా తమ విధులను సరిగా నిర్వర్తించలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని నడివీధిలో వివస్త్రను చేసేలా కడపజిల్లాలో అనేక సంఘటనలు జరిగాయన్నారు. జిల్లావ్యాప్తంగా జరిగిన 45 సంఘటనలకు సంబంధించి ఆధారాలను తాము ఎన్నికల కమిషనర్ ముందుంచుతున్నా మని, అవి పరిశీలించి వారేం చర్యలు తీసుకుంటారో చూస్తామన్నారు. హింసకు పాల్పడిన అధికారులు, పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకొని, వారిని సస్పెండ్ చేయాలని ఎన్నికల కమిషనర్ కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాష్ట్ర డీజీపీ మాదిరిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా కోర్టుల్లో నిలబడే పరిస్థితి తెచ్చుకోవద్దని టీడీపీ ఎమ్మెల్సీ సూచించారు. జగన్మోహన్ రెడ్డికి 5కోట్లమంది ప్రజలకంటే, 5వేల కోట్ల డబ్బులే ముఖ్యమైపోయాయని, ఆ డబ్బు ఎక్కడికీ పోదని ఆయన తెలుసుకుంటే మంచిదన్నారు. రాష్ట్రప్రభుత్వం నిబద్ధతతో ఎన్నికలు నిర్వహిస్తే, ఒక్కపైసా కూడా బయటకు పోదని, ప్రభుత్వానికి నిజంగా సత్తా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో నిర్వహించాలని చెంగల్రాయలు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ, నియంతృత్వ చర్యలను ప్రకృతే కరోనా రూపంలో వచ్చి కట్టడి చేసిందన్నారు.  


 


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image