రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి :సజ్జల

16.3.2020
తాడేపల్లి


*తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్*



1.    సీఎం జగన్ గారు ప్రజల వద్దకు నేరుగా పాలనను తీసుకువెళ్ళాలని భావిస్తున్నారు.
అత్యంత కీలకమైన స్థానిక సంస్థల నాకత్వం రూపుదిద్దుకోవాలని 
మరో వారం రోజుల్లో ఎన్నికలు జరిగే తరుణంలో
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సైందవ పాత్ర పోషిస్తూ... హటాత్తుగా ఎన్నికలను వాయిదా వేసింది.
ఇది హటాత్తు నిర్ణయం అని మీడియాకు కూడా తెలుసు.
ముందు ఎన్నికల అధికారి కరోనా గురించి చెప్పి...
ఆఖరున ఆరు వారాల పాటు వాయిదాని ప్రకటించారు. 


2.     దీనిపై సీఎం జగన్ గారు స్వయంగా మీడియా సమావేశంలో మాట్లాడారు.
దీనికి సంబంధించి ఏం జరిగింది... ఏం జరగవచ్చు.. రాష్ట్రానికి ఇది ఎటువంటినష్టం జరుగుతుందో చెప్పారు.
నిరంకుశంగా, అడ్డగోలుగా ఎన్నికల కమీషన్ తీసుకున్న నిర్ణయం ఇది.  
ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్ట్ కు మా ప్రభుత్వం వెళ్లింది.



3.     రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి.
ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దానికి ఒక ప్రోసీజర్ వుంటుంది.
కమిషన్ లోని అధికారి అప్పటికప్పుడు సొంతగా తన నిర్ణయాలను ప్రకటించవచ్చా?
ఎన్నికల కమిషన్ లోని అధికారులకు కూడా రమేష్‌ కుమార్ గారి నిర్ణయం షాక్ ఇచ్చింది.
రాజ్యాంగ పరిధిని దాటి... తన బాధ్యతలను నిర్వర్తించడంలో అన్ని ఉల్లంఘనలే కనిపించాయి.
తన పరిధిని దాటి, ప్రభుత్వాన్ని కూడా మించి రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు.
రమేష్‌ కుమార్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా తప్పు.
ఎన్నికలను వాయిదా వేస్తూ... కోడ్ ను ఎలా కొనసాగిస్తారు?
దురాలోచన, దురద్దేశంతో, వెనుక ఎవరో వుండి నడిపిస్తున్న దానిలో భాగంగా తీసుకున్న నిర్ణయం ఇది.


4.     కరోనా వైరస్ ఉదృతంగా వుందని ఎన్నికల అధికారిగా రమేష్ కుమార్ చెప్పారు.
6వ తేదీన రాజకీయపార్టీల సమావేశం జరిగింది.
ఆ సమావేశంలో కరోనా వైరస్ గురించి చర్చ జరిగింది.
రాష్ట్రప్రభుత్వం నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించిన తరువాత..
కరోనా వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని... ఎన్నికలకు వెడుతున్నామని రమేష్‌ కుమార్ చెప్పారు.
మరి నిన్న రమేష్‌ కుమార్ చేసిన ప్రకటన కోసం ప్రభుత్వం నుంచి ఎటువంటి వివరాలు, నివేదికను తీసుకున్నారు?
కరోనాపై పూర్తి వివరాలు తీసుకున్న తరువాత ఆయన ఎటువంటి నిర్ణయాలు అయినా తీసుకోచ్చు.
కరోనా పై చీఫ్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీలను పిలిచి సమీక్షించి, వివరాలు ఆన్ రికార్డ్ గా తీసుకోవాలి.
ఎన్నికల కమిషన్ అనేది ఒక వ్యవస్థ... ప్రోటోకాల్ ప్రకారం ఈ వ్యవస్థ నడుస్తుంది.
ఆరో తేదీ తరువాత కరోనా గురించి ఏ రాజకీయ పార్టీ అయినా మీకు లేఖ రాసిందా?
దీనిపై లేదు అనే సమాధానం వస్తోంది.


5.    ఒక వేళ ఎన్నికల అధికారి కరోనా గురించి ఆలోచిస్తే...
దానిపై ఏం చేయాలనేదానికి ఒక ప్రాసెస్ వుంది.
ఎన్నికల గేదరింగ్ లపై కరోనా ప్రభావం లేకుండా ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి.
కరోనా వల్ల ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసుకోవాలి.
రాజకీయ పార్టీలను కూడా పిలిచి మాట్లాడాల్సి వుంది.
ఇందులో ఎటువంటి ప్రక్రియను రమేష్ కుమార్  ఫాలోకాలేదు
రమేష్‌ కుమార్ ప్రకటన తరువాత వెంటనే చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు.
కరోనా వల్ల ఎన్నికలు వాయిదా వేయాలని మేం అడిగామంటూ చంద్రబాబు చెప్పుకున్నారు.
అధికారంలో వున్న పెద్దపార్టీగా వైఎస్ఆర్సిపిని కరోనా గురించి రమేష్ కుమార్ ఎందుకు అడగలేదు?
రమేష్ కుమార్ మీడియా ముందే తన నోట్ బుక్ లో రాసుకున్న దానిని గురించి మాట్లాడారు.
టిడిపి నాయకుడి ఇంట్లోనో, అధ్యక్షుడి వద్దనో, లాయర్లు సిద్దం చేసిన దానిని...
రమేష్ కుమార్ చదివి వుంటాడని మేం అనుకుంటున్నాం.
అటువంటి అనుమానాలకు ఆస్కారం ఇచ్చేలా రమేష్ కుమార్ వ్యవహారం వుంది. 


6.    243 ప్రకారం ఎన్నికల నిర్వహణ మాత్రమే ఎన్నికల సంఘం బాధ్యత.
రాష్ట్రప్రభుత్వం ఎన్నికలకు సిద్దంగా వుందని తెలిపిన తరువాతే ఎన్నికల నిర్వహణను కమిషన్ చేపడుతుంది.
నిర్వహణ ప్రక్రియపై పూర్తి అధికారాలు ఎన్నికల కమిషన్ కు వుంటాయి.
మొత్తం ఎన్నికలు వాయిదా వేయాలంటే... 
ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వంకు ఆ విషయం తెలియచేయాలి.
ఇక్కడ రమేష్ కుమార్ దానిని పూర్తిగా గాలికి వదిలేశారు.
అడ్డగోలుగా తన సొంత నిర్ణయం ప్రకటించారు.
వాయిదా వేసిన ఆరువారాల పాటు కోడ్ వుంటుందని ప్రకటించారు. 
నిబద్దతతో పనిచే వ్యక్తి గా రమేష్ కుమార్ కనిపించడం లేదు
ఆయనపై ఏ వత్తిడిపని చేసింది?
నిజంగా విచక్షణ వుంటే.. రమేష్‌ కుమార్ తన నిర్ణయాన్ని సరిదిద్దుకోవాలి.
ప్రజాస్వామ్య ప్రక్రియను పట్టపగలు హత్య చేశారు. 



7.   ఇళ్ళ స్థలాల పంపిణీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మేం ప్రకటించాం.
కానీ దీనిని నిలిపివేయాలంటూ వాయిదా కు ముందు రోజే రమేష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. 
తరువాత రోజు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 
ఎన్నిలకు ముందే ఇళ్ళ స్థలాల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.
అది ఎన్నికల ప్రలోభాలకు గురి చేసే అంశం ఎలా అవుతుంది?
దీనిని నిలిపివేయాలని అన్నారు...మేం దానిని గౌరవించాం.
ఆరు వారాల పాటు ఎన్నికలను పొడిగిస్తూ... కోడ్ ను కూడా కొనసాగిస్తామని చెప్పారు.


8.    కరోనా వైరస్ ను నియంత్రించే విషయంలో అగ్రరాజ్యాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
ప్రపంచమే ఈ వైరస్ ను ఎలా డీల్ చేయాలా అని ఆలోచిస్తున్నాయి.
ఒక్క మన రాష్ట్రమే పూర్తిస్థాయిలో దీనిని నియంత్రించగలదా?
ఈ వైరస్ ను తట్టుకోవాలంటే కిందిస్థాయిలో నియంత్రించే పటిష్టమైన వ్యవస్థ అవసరం. 
ఒక ఊరిలో ఎంపిటిసి, జెడ్పీటిసి, వార్డు సభ్యులు ఎన్నికైతే వారు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. 
కరోనా లక్షణాలు వున్న వారిని గుర్తించేందుకు వారు బాధ్యత తీసుకుంటారు.
వ్యాధి లక్షణాలు వున్న వారికి సకాలంలో చికిత్స అందించేందుకు ప్రజాప్రతినిధులుగా వారు పనిచేస్తారు.
ఈ వ్యాధిని నియంత్రించేందుకు ఒక మంచి వ్యవస్థ సిద్దమయ్యేంది.
కానీ ఆఖరి నిమిషంలో ఎన్నికల వాయిదా నిర్ణయంతో ఈ ప్రక్రియను అడ్డుకుంటున్నారు.


9.     కరోనా సంక్షోభం అంతటా పెరుగుతోంది.
చైనా, కొరియా, ఇటలీతో పాటు మనదేశంలోనూ కేసులు పెరుగుతున్నాయి.
ఈ సమయంలో స్థానిక ఎన్నికల వల్ల కిందిస్థాయిలో బాధ్యతాయుతమైన వ్యవస్థ ఏర్పడేది
కేంద్రం నుంచి రావాల్సిన అయిదువేల కోట్ల నిధులువచ్చేవి.
కానీ వాటిని కూడా అడ్డుకున్నారు. 
గోవాలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. 
విదేశీయులు ఎక్కువ వచ్చే చోట జరుగుతున్న ఎన్నికలకు కరోనా ఎఫెక్ట్ లేదా?
స్థానికంగా మన వద్ద జరిగే ఎన్నికలకు ఎఫెక్ట్ వుంటుందా?



10.     ఎన్నికలు మొదలైనప్పటి నుంచి చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు నానా యాగీ చేస్తున్నారు.
చంద్రబాబుకు పోటీ చేయడానికి మనుషులు దొరకడం లేదు
చంద్రబాబు నాయకత్వంపై విశ్వాసం పూర్తిగా పోయింది.
మునిగే ఈ పడవ నుంచి బయటకు వచ్చేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు.
మేం గేట్లు తెరవక కానీ, తెరిస్తే... వివపరీతంగా మాపార్టీలోకి వలసలువస్తాయి.
టిడిపి నుంచి వారంతట వారు మా పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా వున్నారు.
చంద్రబాబుపై నమ్మకం లేని వారు మా వైపు చూస్తున్నారు.
మేం తీసుకోవాలని అనుకుంటే  చంద్రబాబు, ఒకరిద్దరు మినహా...
మిగిలిన వారందరూ మా పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా వున్నారు. 
ఈ పరిస్థితి చంద్రబాబుకు తెలుసు. అందుకే ముందునుంచే ఒక ప్రణాళిక ప్రకారం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు.
దాడులు చేస్తున్నారని, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు.
దానిని కొనసాగింపులో భాగంగానే నిన్న ఎన్నికల అధికారి చేసిన వాయిదా ప్రకటన
ఎన్నికలను వాయిదా వేసినప్పుడు... అధికారులపై చర్యలకు ఎన్నికల అధికారి ఎలా సిఫార్స్ చేస్తారు?


11.    స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు అవుతుండటాన్ని టిడిపి జీర్ణించుకోలేక పోతోంది.
కొద్ది రోజుల పాటు అయినా ఎన్నికలను వాయిదా వేయించాలని ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది. 
ఎన్నికల్లో ఏకగ్రీవాలు సహజం.
గతంలో కాంగ్రెస్, టిడిపి కలిసి పోటీ చేశాయి, ఒప్పందాలతో ఏకగ్రీవం చేసుకున్నాయి.
ఇప్పడు జరుగుతున్న ఎన్నికల్లో కొన్నిచోట్ల టిడిపికి కూడా ఏకగ్రీవం అయ్యాయి.
సీఎం జగన్ గారు ఊహించిన దానికన్నా వేగంగా సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేశారు. 
దాని ఫలితంగా మాకు స్థానిక ఎన్నికల్లో ప్రజల నుంచి మద్దతు పెరిగి ఏకగ్రీవాలు పెరిగాయి.
ఈ సంక్షేమపథకాలు చూసి టిడిపి నుంచి పోటీకి కూడా ముందుకు రావడం లేదు.


Popular posts
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image