గవర్నర్‌తో భేటీ కానున్న చంద్రబాబు

గవర్నర్‌తో భేటీ కానున్న చంద్రబాబు
అధికార వైసీపీ నేతల దౌర్జన్యాలపై గవర్నర్‌కు  ఓ వినతిపత్రం ఇవ్వనున్న  చంద్రబాబు


అమరావతి : టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ కానున్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీ నేతల దౌర్జన్యాలపై గవర్నర్‌కు చంద్రబాబు ఓ వినతిపత్రం ఇవ్వనున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన బుధవారం తీవ్ర హింసాకాండ చెలరేగింది. టీడీపీ అభ్యర్థులపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి.


అంతేకాకుండా నామినేషన్ పత్రాలను లాక్కొని చించేశారు. అంతకాకుండా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై వైసీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. సుమారు 30 కిలోమీటర్లు వెంటాడి అవకాశం దొరికిన  చోటా రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పట్టణ వైసీపీ యువనేత తురకా కిశోర్ స్వయంగా పెద్ద కర్రతో వాహనం అద్దాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. వీటన్నింటిని కూడా చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ బృందం గవర్నర్ హరిచందన్‌కు సాక్ష్యాలతో సహా వివరించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు