కరోనా నేపథ్యంలో మాస్కులు తయారుచేస్తున్న ఇస్రో

కరోనా నేపథ్యంలో మాస్కులు తయారుచేస్తున్న ఇస్రో
ఇప్పటికే 1000 లీటర్ల శానిటైజర్ల ఉత్పత్తి
సులువుగా వాడే వెంటిలేటర్ రూపకల్పన
తయారీ బాధ్యతను పారిశ్రామిక సంస్థలే తీసుకోవాలన్న ఇస్రో
కరోనా భూతాన్ని ఎదుర్కోవడంలో దేశం మొత్తం ఏకతాటిపైకి వస్తోంది. తాజాగా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కూడా కరోనా వైరస్ సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని నిర్ణయించింది. దీనిపై ఇస్రో డైరెక్టర్ ఎస్.సోమ్ నాథ్ మీడియాతో మాట్లాడారు. తమ  అధీనంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సులువుగా ఉపయోగించగల వెంటిలేటర్ ను డిజైన్ చేస్తుందని, దాని తయారీ బాధ్యతను ఇతర పారిశ్రామిక సంస్థలే స్వీకరించాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తాము 1000 లీటర్ల శానిటైజర్లను తయారు చేశామని, ప్రస్తుతం తమ ఉద్యోగులు మాస్కులు తయారుచేస్తున్నారని సోమ్ నాథ్ వివరించారు. కాగా, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో ఎవరూ కరోనా బారినపడలేదని వెల్లడించారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు