*అమరావతి*
*అమరావతి: ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమరవాణా, బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ నిరోధంపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష*
*ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు, ప్రొహిబిషన్–ఎక్సైజ్శాఖ అధికారులతో సీఎం సమీక్ష*
గ్రామాల స్వరూపాన్ని మార్చడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం: సీఎం
గ్రామ సచివాలయం, వైయస్సార్ రైతు భరోసాకేంద్రాలు, వైయస్సార్ విలేజ్ క్లినిక్లు, ఇంగ్లిషుమీడియంలో విద్యాబోధన తదితర మార్పులు తీసుకొస్తున్నాం: సీఎం
గ్రామాల సమగ్రాభివృద్ధిలో ఇవన్నీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తాయి:
ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు బెల్టుషాపులు, అక్రమంగా మద్యం తయారీ, అక్రమ ఇసుక తవ్వకాలు లాంటివి మన ఉద్దేశాలను దెబ్బతీస్తాయి:
ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాల్లో బెల్టుషాపులు నడవకూడదు :
అలాగే మద్యం అక్రమ తయారీ ఉండకూడదు:
ఇసుక అక్రమతవ్వకాలు, అక్రమ రవాణా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు:
సరిహద్దుల్లో అక్రమ ఇసుక రవాణా, మద్యం రవాణాలు ఉండకూడదు:
ఇలాంటి ఘటనలపై పోలీసులు, ఎన్ఫోర్స్ మెంట్ సిబ్బంది, ప్రొహిబిషన్ సిబ్బంది అత్యంత కఠినంగా వ్యవహరించాలి:
గ్రామాల్లో ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలంటే బెల్టుషాపులు ఉండకూడదు:
గ్రామాల్లో 11వేలకుపైగా మహిళా పోలీసులు ఉన్నారు. వీరిని శక్తివంతంగా వాడుకోవాలి:
వారందరికీ ఫోన్లు ఇచ్చాం. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకోవాలి:
బెల్టుషాపుల నిరోధం మహిళా పోలీసుల ప్రాథమిక విధి:
అలాగే మహిళా మిత్రలు కూడా ఉన్నారు :
వీరిని కూడా సమర్థవంతంగా వాడుకోవాలి:
ఎన్ఫోర్స్ మెంట్ విభాగంలో సిబ్బందిని పెంచాలంటూ సీఎం ఆదేశాలు
ప్రొహిబిషన్ – ఎక్సైజ్ శాఖలో ఉన్న మూడింట రెండు వంతుల సిబ్బందిని ఎన్ఫోర్స్మెంట్ పనులకోసం వినియోగించాలని సీఎం ఆదేశం
ఎన్ఫోర్స్ మెంట్ విభాగంతో కలిసి కట్టుగా వీరు పనిచేసి ఫలితాలు సాధించాలన్న సీఎం
స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్ను తయారుచేసుకోవడం ద్వారా విధుల నిర్వహణలో సమర్థతను పెంచుకుని అనుకున్న లక్ష్యాలను సాధించాలన్న సీఎం
సమావేశంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని తదితర అధికారులు.