ఎన్నికల నిలిపివేతపై సీఎస్‌కు ఎస్‌ఈసీ లేఖ

ఎన్నికల నిలిపివేతపై సీఎస్‌కు ఎస్‌ఈసీ లేఖ
విజయవాడ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ స్పందించారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ..రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాసిన లేఖపై రమేశ్‌కుమార్‌ స్పందిస్తూ లేఖ రాశారు. ఎన్నికలు ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో సవివరంగా వెల్లడిస్తూ మూడు పేజీల లేఖను సీఎస్‌కు పంపారు.
 ‘‘గతంలో రాజ్‌భవన్‌లో ఫైనాన్స్‌ వ్యవహారాలు చూశాను. రాజ్‌భవన్‌ కంటే ముందు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో పనిచేసిన అనుభవం ఉంది. గతంలో ఎన్నికలు నిలిపివేసినా కేంద్ర నిధులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేశారు. గోవాలోనూ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదావేసే విషయాన్ని చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రాంట్లు, నిధుల విడుదల విషయంలో అవగాహన ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సహకారం ఉంటుంది. నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శితో సంప్రదింపులు జరిపా. వారి సూచనలు, హామీతో ఎన్నికలు వాయిదా వేశా. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికలు వాయిదావేస్తూ నిర్ణయం తీసుకున్నా. ఇతర రాష్ట్రాల కంటే ముందే ఎన్నికలు వాయిదావేస్తూ నిర్ణయం తీసుకున్నాం. అందరికంటే మందు నిర్ణయం తీసుకోవడం వల్లే విమర్శలు. కరోనా వైరస్‌ వివిధ దశల్లో వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వేగంగా ప్రబలుతోంది. వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడితే 6 వారాల కంటే ముందే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం’’ అని రమేశ్‌ కుమార్‌ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలకు, ఆర్థిక సంఘం నిధులకు ముడిపెట్టవద్దని సూచించారు. అపార్థాలకు తావులేకుండా ఉండేందుకే సీఎస్‌కు లేఖ రాసినట్లు రమేశ్‌కుమార్‌ వెల్లడించారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image