నిర్భయ దోషులకు బహిరంగ ఉరి తీసి ఉంటే బాగుండేదని....

నిర్భయ దోషులకు బహిరంగ ఉరి తీసి ఉంటే బాగుండేదని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఈరోజు తన కార్యాలయం నుంచి విడుదల చేసిన పత్రిక ప్రకటనలో  పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఆడ పిల్లపై అతి దారుణంగా ప్రవర్తించిన నిర్భయ మానవ మృగాలకు ఉరి శిక్ష పడిన రోజు గొప్ప సూర్యోదయం అని న్యాయం గెలిచిన రోజని , నిర్భయ తల్లి మరియు వారి అడ్వకేట్ న్యాయం కోసం చేసిన పోరాటాన్ని చరిత్ర గుర్తుపెట్టుకుoటుందని తన కూతురు కోసం కాకుండా యావత్ భారత దేశంలోని యువత రక్షణ కోసం జరిగిన పోరాటం గా ఆయన వారి పోరాటాని  కొనియాడారు .నిర్భయ దుర్మార్గులు ఎన్ని వక్రమార్గాలు ఎoచుకున న్యాయం ముందు చట్టం ముందు నిలబడలేదని చివరికి న్యాయమే గెలిచింది అని మహేష్ అన్నారు. కరోన మహమ్మరి దేశంలో విజృంభిస్తున్న నిర్భయ దోషులకు ఉరి శిక్ష పడడాని ప్రజలందరూ ఆనందంతో పండగ చేసుకుంటున్నారు అని అన్నారు . ముఖ్యమంత్రి జగన్ గారు దిశ చట్టం తేవడం కాదు చిత్తశుద్ధి ఉంటే అయేషమీరా,సుగాలిప్రీతి కి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు