నామినేషన్ను అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తాం : ఎన్నికల కమిషనర్
అమరావతి : రాష్ట్రంలో సమర్ధమైన పోలీసు యంత్రాంగం ఉందని, ఫిర్యాదులు స్వీకరించేందుకు అధికారులను నియమించామని ఎన్నికల కమిషనర్ రమేశ్ వెల్లడించారు. నామినేషన్ను అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. పోటీచేసే అభ్యర్థులకు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టించవద్దన్నారు. చిత్తూరు జిల్లా సదుం మండలంలో జరిగిన ఘటనపై కేసు నమోదు చేశామని రమేశ్ వెల్లడించారు. నియమావళిని ఉల్లంఘించినట్టు ఎక్కడా ఫిర్యాదులు రాలేదని రమేశ్ వెల్లడించారు. చిత్తూరు జిల్లా ఘటన తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో ఇబ్బంది కలిగించినా తీవ్రంగా పరిగణిస్తామన్నారు. సిబ్బందికి కొరత లేదని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ నుంచి తమకు సహకారం ఉందని రమేశ్ వెల్లడించారు.
నామినేషన్ను అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తాం : ఎన్నికల కమిషనర్