ప్రజల ఆరోగ్యం కన్నా స్థానిక ఎన్నికలు ముఖ్యమా ?:పోతిన వెంకట మహేష్

ప్రజల ఆరోగ్యం కన్నా స్థానిక ఎన్నికలు ముఖ్యమా ?


కరోనా మహమ్మారి నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు శూన్యం


కాపులను బీసీలను దారుణంగా మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ కు కులాల పేరు ఎత్తే అర్హత ఉంద.


సీఎం జగన్ పాలనలో అభివృద్ధి పడకేసిందని, ప్రజారంజక పాలన అందిస్తార అనుకుంటే ఫ్యాక్షన్ పాలన అంటే ఏంటో ఐదు కోట్ల మందికి ప్రత్యక్షంగా చూపిస్తున్నారని, ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారికి భయపడి ఆందోళన చెందుతుంటే సీఎం జగన్ స్థానిక సంస్థల నిర్వహించాలని నానా యాగీ చేస్తున్నారంటే రాజధాని అమరావతిని విశాఖపట్నానికి తరలించాలనే కుట్ర స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని, సీఎం జగన్ కు  రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కన్నా స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యమా ? అని  ఈ రోజున బెంజిసర్కిల్ వద్ద గల పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు సెంట్రల్ ఆంధ్ర పార్లమెంటరీ సంయుక్త కమిటీ సభ్యులు పోతిన వెంకట మహేష్ ముఖ్యమంత్రి జగన్ తీరును దుయ్యబట్టారు. పదే పదే కేంద్రం నుంచి వచ్చే 5వేల కోట్ల రూపాయలు నిధులు రావని అభివృద్ధి ఆగిపోతుందని మాట్లాడుతున్నారు మరి రంగులు వేయడానికి 1300 కోట్లు, గ్రామ వాలంటీర్లకు 7500, కోట్లు సీఎం ఇంటిని ఆధునీకరించి కునేందుకు 20 కోట్లు, ప్రధాన సలహాదారు 500 కోట్లు వెరసి సుమారు పదివేల కోట్ల ప్రజాధనం వృధా వల్ల అభివృద్ధి ఆగిపోలేదా?అని ప్రశ్నించారు. ఈ పది నెలల కాలంలో ఎక్కడైనా ఒక బస్తా సిమెంట్ వేసి ఇటుక మీద ఇటుక పెట్టిన పాపానపోలేదు, మీకు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత ఉందాని ఎద్దేవా చేశారు.  కేంద్రం నుండి నిధులు ఆగిపోతాయని ఆందోళన ఉంటే సీఎం జగన్ పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఒక వినతిపత్రం ఇవ్వండి చాలు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ నిధులు రాష్టం కు వచ్చేలాగా ప్రయత్నిస్తారని, ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సింది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాదు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కోసం  కేసు వేయాలి అని డిమాండ్ చేశారు .


 రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఇంతవరకూ ఎన్ని చోట్ల స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిందో, కరోనా నియంత్రణకు హెల్త్ సెంటర్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో , మందులు మాస్కులు అన్న అందుబాటులోకి తెచ్చే పరిస్థితి ఉందా లేదో ప్రజలకు తెలియచేయాలని కోరారు. పారాసెట్మాల్ బ్లీచింగ్ కొనుగోలలో వందల కోట్లు కాజేసి  ప్రయత్నం జగనన్న చేస్తున్నారనే అనుమానం కలుగుతుంది అని, కరోనా మహమ్మారి నియంత్రించడంలో ప్రభుత్వ చర్యలు శూన్యం ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కొరారు .కాపులను బీసీలను దారుణంగా మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ కులాల పేరు ఎత్తే అర్హత ఉందా అని ప్రశ్నించారు. నామినేటెడ్ పదవులను తన సామాజిక వర్గం తో నింపుకుని కులాల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రజలు కరోనా కన్నా జగన్ పాలన గురించి ఎక్కువగా భయపడుతున్నారని కరోనా పై జగన్ కు ఉన్న తెలివితేటలతో  వారి కీర్తి ఖండాంతరాలు పాకిందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ కరోనా వ్యాప్తి చెందకుండా ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని  ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image