ముప్పైయేళ్ళకు యం.పి.డి.ఓ కార్యాలయం బోర్డు మారింది....

*ముప్పైయేళ్ళకు యం.పి.డి.ఓ కార్యాలయం బోర్డు మారింది.... వింజమూరు: (అంతిమతీర్పు- దయాకర్ రెడ్డి) : ఎట్టకేలకు 30 సంవత్సరాల విరామం అనంతరం వింజమూరు యం.పి.డి.ఓ కార్యాలయం ప్రధాన భవనంపై నూతన హంగులతో బోర్డు మారింది. వివరాలలోకి వెళితే 1982 లో అప్పటి సమితి అధ్యక్షులు జొన్నలగడ్డ.రామానాయుడు హయాంలో వింజమూరులో సమితి భవన నిర్మాణం జరిగింది. అప్పట్లో కార్యాలయంపై సమితి భవన సముదాయము ఉండేదని పలువురు పేర్కొన్నారు. తరువాత ముఖ్యమంత్రిగా పదవీ భాధ్యతలు చేపట్టిన స్వర్గీయ నందమూరి.తారక రామారావు మండలాల వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో వింజమూరు మండల కేంద్రంగా రూపాంతరం చెందింది. అప్పట్లో ఈ కార్యాలయ భవనం ప్రధాన మార్గం పై భాగంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం అని ప్రచురించారు. తదుపరి ఈ బోర్డు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ వెలిసిపోయి రూపురేఖలు మారిపోయాయి. అధికారులు వస్తున్నరు, పోతున్నారు కానీ ఈ బోర్డుపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. అయితే ఇటీవల నూతనంగా వింజమూరు యం.పి.డి.ఓ గా భాధ్యతలు చేపట్టిన ఎస్.కనకదుర్గా భవాని ఈ బోర్డుపై దృష్టి సారించారు. అనుకన్నదే తడువుగా భావించి నూతనగా బోర్డుకు పెయింటింగ్ వేయించారు. కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఎదురుగా దర్శనమిస్తున్న బోర్డు తళుక్కుమనడంతో ఔరా ఎనాళ్ళకు బోర్డుకు మోక్షం కలిగింది అని సర్వత్రా చర్చించుకుంటూ యం.పి.డి.ఓ కు అభినందనలు తెలియజేస్తున్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image