శ్రీలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో
భారీగా కూరగాయలు పంపిణి
గూడూరు ఏప్రిల్ 10 (అంతిమ తీర్పు):. గ్రామీణ ప్రాంతాల్లో శుక్రవారం కూరగాయలు పంపిణి చేసారు. క్రిష్ణ జిల్లా మార్టురు లోనీ రైతు ల నుండీ నేరు గా కూరగాయలు కొనుగొలు చేసి లారీ ద్వారా గూడూరు కి తీసుకుని వచ్చి వెయ్యి మంది కి సరిపోయేలా పాకేట్లు చేసి స్దానిక రెండో పట్టణం లొని పారిశుధ్య కార్మికులకు, ప్రభుత్వ హాస్పిటల్ పారిశధ్య కార్మికులకు, 108 సిబ్బంది కి, నాయుడు కాలు వ కట్ట మీద, గూడూరు చెరువు కట్ట మీద ఉన్న గిరిజనులకు, పోలీసు సిబ్బందికి పంపిణి చేసారు.
నెల్ క్యాస్ట్ సమీపంలోని చవటపాళెం , మధురెడ్డిగిరిజన కాలనీ, వెములపాళెం గిరిజన కాలనీ, విందూరు గిరిజన కాలనీ, ఎస్,వి.ఆర్ట్స కాలేజి సమీపంలోని పేదలకు కూరగాయలు పంపిణి చేయడం జరిగింది.
ఈ సందర్బంగా ట్రస్ట పిఆర్వో మల్లవరపు భూషణ్ రెడ్డీ మాట్లాడుతూ కరోణ వయరస్సు విపత్తు కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని శ్రీలక్ష్మి పి.యం.రావు దంపతులు గూడూరు , రూరల్ ప్రాంతాల్లో కూరగాయలు పంపిణి చేస్తున్నారన్నారు. అనేక సేవాకార్యక్రమాలతొ గూడూరు మహాదాతలు గా పేరు పొందిన వారు మరిన్ని సేవాకార్యక్రమాలు చేసేవిదంగా ప్రజలు పేరం దంపతులను ఆశ్వీర్వదించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రస్టు పి.ఆర్వో. భూషణ్ రెడ్డి, సిబ్బంది ఉదయికిరణ్, ఇస్కాన్ ప్రభు వెంకట సుబ్బారెడ్డి నవీణ్ , ఒమ్ కార్, ఆయా ప్రాంతాల పెద్దలు పాల్గొన్నారు.