కరోనా పై భారత్ విజయం సాధిస్తుంది: భారత ఉపరాష్ట్రపతి ఆకాంక్ష

కరోనా పై భారత్ విజయం సాధిస్తుంది: భారత ఉపరాష్ట్రపతి ఆకాంక్ష
----------------------------------------------------
 సీనియర్ జర్నలిస్ట్ చలపతిరావుకు ఫోన్ చేసి పలువురికి అభినందనలు
----------------------------------------------------
ప్రస్తుత విపత్తు కాలంలో ప్రజలను కాపాడటానికి వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయని భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు మంగళవారం ఉదయం సీనియర్ జర్నలిస్ట్ నిమ్మ రాజు చలపతిరావు కు స్వయంగా ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.  ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణతో, ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. కరోనా పై అంతిమ విజయం సాధించే వరకు అకుంఠిత దీక్ష ను మనం ప్రదర్శించాల్సి ఉందన్నారు. ఈ మహమ్మారిని త్వరలోనే చిత్తు చేస్తామన్న నమ్మకం తనలో ఉందని ఈ విజయం నేర్పిన అనుభవంతో భావి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొగలమని తాను పూర్తిగా విశ్వసిస్తున్నానని  శ్రీ వెంకయ్య నాయుడు గారు తెలపడం భారత ప్రజానీకానికి మరి ఎంతో ఆత్మస్థైర్యం, మనోధైర్యాన్ని కలుగజేస్తుంది. .....


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు