500  వీధికుక్కలకూ రెండు పూటలా ఆహారం

                                తిరుపతి, 2020 ఏప్రిల్ 11


మూగజీవాలపైనా శ్రీవారి దయ


కరోనా నేపథ్యంలో పశువులకు గ్రాసం, దాణా సరఫరా


500  వీధికుక్కలకూ రెండు పూటలా ఆహారం 


            కరోనా  వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  లాక్ డౌన్ విధించడంతో  వేలాది మంది నిరాశ్రయులు, వలస కూలీలు తిండి లేక ఇబ్బంది పడ్డారు. తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఉండే ఇలాంటి వారి ఆకలి తీర్చడానికి టీటీడీ రంగంలోకి దిగింది. రోజూ 50 వేల మందికి అన్నప్రసాదం అందిస్తోంది. మనుషులు సరే మరి మూగ జీవాల సంగతేమిటి ? లాక్ డౌన్ వల్ల జన సంచారం ఆగిపోవడంతో మూగ జీవాలకు కూడా ఆకలి తిప్పలు ఎదురయ్యాయి.  గోసాలల్లో ఉన్న పశువుల సంగతి సరే..మరి  రోడ్ల మీద తిరిగే పశువుల పరిస్థితి ఏమిటి ? తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దిశగా మానవీయ కోణంలో ఆలోచించింది. దేవుడి దృష్టి లో ప్రతి ప్రాణీ సమానమేననే ఆలోచనతో గత 11 రోజులుగా పశువులు,  వీధి కుక్కలకు కూడా ఆహారం సరఫరా చేస్తోంది. కోవిడ్ వైరస్ నేపథ్యంలో టీటీడీ తీసుకున్న ఈ మానవీయ నిర్ణయం వివరాలు ఇవీ.


            కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  లాక్ డౌన్ విధించినప్పటి నుంచి అన్ని వ్యాపార సంస్థలతో పాటు పెద్ద హోటళ్లు, వీధి హోటళ్లు మూత పడిన విషయం  తెలిసిందే. హఠాత్తుగా తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం  వల్ల తిరుపతిలోని వలస కూలీలు, బిచ్చగాళ్ళు అన్నం కోసం అష్టకష్టాలు పడ్డారు. ఇలాంటి వారి ఇబ్బందులు చూసిన టీటీడీ యాజమాన్యం గత 15 రోజులుగా తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న 50 వేల మంది పేదలకు  మధ్యాహ్నం, రాత్రి అన్నప్రసాదంఅందిస్తోంది.


మూగ జీవాల సంగతి?


           లాక్ డౌన్ వల్ల మూగ జీవాలు కూడా ఆకలితో ఇబ్బంది పడుతున్న విషయం టీటీడీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. రవాణా ఇబ్బందులతో ఇప్పటికే గోశాలల్లోని పశువులతో పాటు రోడ్ల మీద తిరిగే మూగజీవాలు కూడా అలమటిస్తున్నాయని టీటీడీ యాజమాన్యం దృష్టికి వచ్చింది.  దీంతో యాజమాన్యం  వెంటనే  అధికారులను రంగంలోకి దించింది.


గోశాల డైరెక్టర్ కు భాధ్యతలు


తిరుపతి పట్టణం, తిరుచానూరులో రోడ్ల మీద తిరిగే పశువులతో పాటు, తనపల్లి క్రాస్ లోని అయోధ్య స్వామి ఆశ్రమం, నవజీ వన్ వృద్ధాశ్రమం, తిరుపతిలోని రాధ గోవింద గోశాలలోని పశువులకు రోజూ పచ్చి మేత, దాణా సరఫరా చేసే భాధ్యతను ఎస్వీ గోసంరక్షణ శాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డికి అప్పగించారు. రోడ్ల మీద తిరిగే పశువులను అలిపిరి లింక్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక పశువులశాలకు తరలించి దాన్ని నిర్వహించే భాధ్యతను తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కు అప్పగించారు. ఈ నెల 1 వ తేదీ నుంచి టీటీడీ ఆధ్వర్యంలో మూగ జీవాల ఆకలి కూడా తీరుతోంది. రోజుకు సుమారు 3  మెట్రిక్ టన్నుల పశుగ్రాసం, 300 కిలోల దాణాను పశువుల కోసం సరఫరా చేస్తున్నామని గోసంరక్షణ శాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి చెప్పారు. లాక్ డౌన్ ముగిసే వరకు ఇదే విధంగా గ్రాసం, దాణా సరఫరా చేసి పశువుల ఆకలి తీరుస్తామని ఆయన చెప్పారు.


వీధి కుక్కలకూ ఆహారం


           లాక్ డౌన్ వల్ల ఆహారం సమస్య  ఎదుర్కొంటున్న వీధి కుక్కల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టీటీడీ  ప్రతిరోజూ సుమారు 500 వీధి కుక్కలకు కూడా  ఆహారం సరఫరా చేస్తోంది.. తిరుపతి నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వీధి కుక్కలను గుర్తించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్లతో  ఎక్కడి కుక్కలకు అక్కడే టీటీడీ సహాయం తో ఉదయం, సాయంత్రం ఆహారం అందిస్తున్నమని యానిమాల్ కేర్.  సంస్థకు చెందిన డాక్టర్ శ్రీకాంత్ చెప్పారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image