స్వీయ నిర్భంధంతోనే కరోనా వైరస్ కట్టడి సాధ్యం*యం.పి.డి.ఓ కనకదుర్గా భవాని.

*స్వీయ నిర్భంధంతోనే కరోనా వైరస్ కట్టడి సాధ్యం*యం.పి.డి.ఓ కనకదుర్గా భవాని..


. వింజమూరు, ఏప్రిల్ 3 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): ప్రజలు స్వీయ నిర్భంధం పాటించిన పక్షంలోనే కరోనా వైరస్ కట్టడి సాధ్యపడుతుందని వింజమూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ఎస్.కనకదుర్గా భవాని అన్నారు. శుక్రవారం నాడు స్థానిక జీ.బి.కే.ఆర్ ఎస్.టి కాలనీవాసులకు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి ట్రస్ట్ అందజేసిన శానిటైజర్లను యం.పి.డి.ఓ తమ సిబ్బందితో ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నెల 14 వ తేదీ వరకు ప్రభుత్వ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కాలనీవాసులకు విజ్ఞప్తి చేశారు. జన సమూహాల ద్వారా ఈ వైరస్ అత్యంత వేగంగా అందరికీ వ్యాపించే ప్రమాదముందన్నారు. అందు వలననే లాక్ డౌన్ విధించడం జరిగిందన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల సూచనల మేరకు ప్రజలు ఒకరికొకరు సమదూరం పాటించాలని ఆమె కోరారు. మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ల వినియోగం వలన కరోనా మహమ్మారిని కొంతమేర నియంత్రించవచ్చునన్నారు. కేవలం అవగాహనతోనే వ్యాధికి  దూరం కావాలన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ నిర్లక్ష్యంగా ఉండరాదన్నారు. చేతులను ఎప్పటికప్పుడు నిర్ణీత వ్యవధిలో శుభ్రపరుచుకుంటూ మెళుకువలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి బంకా. శ్రీనివాసులురెడ్డి  సచివాలయ ఉద్యోగులు నాగిరెడ్డి, రమాదేవి, నరేంద్ర, వాలంటీర్లు నూతలపాటి.సాయిసంధ్యారాణి, చిట్టీస్ రెడ్డి.పవన్ కుమార్, యాకసిరి. శివయ్య, వెంధోటి.రాధిక, చింతల.చంద్ఫశేళర్ తదితరులు పాల్గొన్నారు


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు