కనుమూరి హరిచంద్రా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సారధ్యంలో రక్తదానం

    గూడూరు, ఏప్రిల్ 22,(అంతిమ తీర్పు).:                .ఆకలి అంటే అన్నం పెట్టేవాళ్ళు ఉండొచ్చు.  అవసరం అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండచ్చు. కానీ ప్రాణాలు నిలబెట్టే రక్తాన్ని ఇవ్వమంటే ఇచ్చేవారు ఎందరుంటారు. అందులోనూ కరోనా వైరస్ తో సతమతమౌతున్న ఈరోజుల్లో రక్తాన్ని ఎవరిస్తారు. దీంతో రక్త సేకరణ గగనంగా మారింది.  ఇప్పటికే బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు నిండుకున్నాయి.  ఈ క్రమంలో దాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కనుమూరి హరిచంద్రా రెడ్డి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇచ్చిన పిలుపుతో యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసింది.  ఎందరో ప్రాణాలు నిలబెట్టేందుకు వారి వంతు పాత్ర పోషించింది. 


ఎక్కడ చూసినా కరోనా..కరోనా..కరోనా... ఈ కోవిడ్ 19 వైరస్ ప్రజలను అంత భయభ్రాంతులకు గురి చేస్తుంది.  ఈ నేపథ్యంలో గత నెల 23 నుంచి కొనసాగుతున్న లాక్ డౌన్ తో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. రవాణా పూర్తిగా స్తంభించి పోవడంతో ప్రమాదాల సంఖ్య తగ్గినా రక్తం అవసరం ఉన్నా సందర్భాలు అనేకం ఉన్నాయి.  ఎనీమియా, కిడ్నీ, డయాలసిస్ వంటి వ్యాధిగ్రస్థులకు రక్తం అవసరం ఎక్కువగానే ఉంటుంది. గతంలో నిండుకుండలా ఉండే రక్త నిల్వ కేంద్రాలు నేడు నిండుకున్నాయి. రక్తం లేక నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దాతలు కరోనా వైరస్ నేపథ్యంలో రక్తం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీనికితోడు ప్రజల ఎవరు బయట తిరగరాదన్న  ఆంక్షలతో రక్తం సేకరణ కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో దాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి రక్త దానం చేయాలని తన ట్రస్ట్ కనుమూరి హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పిలుపునిచ్చారు. పిలుపునందుకున్న గూడూరు పరిసర ప్రాంతాలకు చెందిన యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. గూడూరు లోని బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసి సమాజ హితం కోసం తన పాత్ర పోషించింది.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image